News October 30, 2025
ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా రూ.3వేలు: పవన్

AP: CM ముందుచూపు కారణంగా తుఫాను వేళ చాలా జాగ్రత్తలు తీసుకున్నామని Dy.CM పవన్ తెలిపారు. ‘పంచాయతీరాజ్ శాఖ పరిధిలో బాగా నష్టం జరిగింది. 46వేల హెక్టార్లలో వరి, 14వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. తుఫాను బాధితులకు బియ్యం ఫ్రీగా ఇస్తున్నాం. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లే ఒక్కో ఫ్యామిలీకి గరిష్ఠంగా ₹3వేలు అందిస్తున్నాం. డ్రెయిన్ల పూడికతీత ద్వారా నీరు నిల్వ లేకుండా చేశాం’ అని అన్నారు.
Similar News
News November 12, 2025
ట్రాఫిక్లోనే 117 గంటల జీవితం

వాహనాల ట్రాఫిక్లో బెంగళూరు దేశంలోనే టాప్లో నిలిచింది. అక్కడ ఒక్కో ప్రయాణికుడు ఏడాదిలో సగటున 117 గంటలు ట్రాఫిక్లో గడుపుతున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. ఆ తర్వాతి స్థానాల్లో కోల్కతా(110), పుణే(108), ముంబై(103), చెన్నై(94), హైదరాబాద్(85), జైపూర్(83), ఢిల్లీ(76), అహ్మదాబాద్(73) ఉన్నాయి. ఇక 10KM ప్రయాణానికి బెంగళూరులో 34ని.10 సెకన్లు పడుతుండగా, HYDలో 31ని.30 సెకన్లు పడుతున్నట్లు తేలింది.
News November 12, 2025
600 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News November 12, 2025
భారీ ‘ఉగ్ర కుట్ర’.. సంచలన విషయాలు

ఢిల్లీలోని ఎర్రకోట మెట్రోస్టేషన్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడి ఘటనపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జనవరి 26 గణతంత్ర దినోత్సవం, దీపావళి రోజున భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర చేసినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇందుకోసం ఉమర్ నబీ, ఉమర్ మహ్మద్ పలుమార్లు ఎర్రకోట వద్ద రెక్కీ చేసినట్లు సమాచారం. కాగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు 9 మందిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.


