News April 23, 2025

ఉగ్రదాడితో మాకు సంబంధం లేదు: పాక్ రక్షణ మంత్రి

image

పహల్‌గామ్ ఉగ్రదాడితో పాకిస్థాన్‌కు ఎటువంటి సంబంధం లేదని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ స్పష్టం చేశారు. టెర్రరిజాన్ని పాకిస్థాన్ ప్రోత్సహించదని, తమ దేశాన్ని అనవసరంగా నిందించకూడదని అన్నారు. భారత్ మాత్రం బలూచిస్థాన్ వ్యవహారాల్లో తల దూరుస్తోందని ఆరోపించారు. ఇండియాలో ప్రస్తుతం జరిగిన అశాంతికి ఆ దేశంలో జరుగుతున్న తిరుగుబాట్లే కారణమన్నారు. ఇస్లామిక్‌తో పాటు ఇతర అంశాలలో నిరసనలు పెరుగుతున్నాయన్నారు.

Similar News

News March 10, 2026

FDI రూల్స్ సడలించిన కేంద్రం

image

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కేంద్రం 2020లో తెచ్చిన రూల్స్‌ను సవరించినట్లు తెలుస్తోంది. పాత రూల్‌లో చైనా సహా భారత్‌తో సరిహద్దు పంచుకున్న దేశాల సంస్థలు ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే కేంద్రం అనుమతి ఉండాల్సిందే. ఇతర విదేశీ సంస్థలైనా సరే వాటిలో ఈ దేశాల వాటా ఉంటే ఈ రూల్ వర్తిస్తుంది. చైనాతో ఉద్రిక్తతలు, దేశ భద్రత దృష్ట్యా గతంలో ఈ నిబంధన తెచ్చింది. తాజాగా ఈ నిబంధన మార్చింది.

News March 10, 2026

ఈనెల 13న పీఎం కిసాన్ నిధులు విడుదల

image

పీఎం కిసాన్ పెట్టుబడి సాయం నిధుల విడుదలపై కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 13న 22వ విడత డబ్బులను అర్హులైన రైతుల అకౌంట్లలో జమ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రధాని మోదీ అస్సాం పర్యటనలో ఈ డబ్బులు రిలీజ్ చేయనున్నారు. దీని వల్ల 9.32 కోట్ల మంది రైతులకు లబ్ధి కలగనుంది. 2019 నుంచి కేంద్రం ఏటా 3 విడతల్లో రూ.2వేల చొప్పున మొత్తం రూ.6వేలను పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది.

News March 10, 2026

BREAKING: 13న అకౌంట్లలో డబ్బులు జమ

image

రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ పెట్టుబడి సాయం నిధుల విడుదల డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 13న 22వ విడత డబ్బులు జమ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రధాని మోదీ అస్సాం పర్యటనలో ఈ డబ్బులు రిలీజ్ చేస్తారు. కేంద్రం ఏటా 3 విడతల్లో రూ.2వేల చొప్పున మొత్తం రూ.6వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. దీని ద్వారా సుమారు 10 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు.