News April 3, 2024
రూ.34 కోట్ల సొత్తు సీజ్ చేశాం: సీఈవో

AP: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రూ.34 కోట్ల సొత్తు సీజ్ చేశామని సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఇందులో రూ.11 కోట్ల నగదు, రూ.7కోట్ల విలువైన మద్యం, రూ.10 కోట్ల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయన్నారు. మొత్తం 3,300 FIRలు నమోదయ్యాయని, సీ-విజిల్ యాప్ ద్వారా 5,500 ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. ఎన్నికలకు సంబంధించి 3,040 ఫిర్యాదులు పరిష్కరించామన్నారు.
Similar News
News February 18, 2026
ఇరాన్పై త్వరలోనే అమెరికా, ఇజ్రాయెల్ దాడి?

అమెరికా ఇరాన్పై త్వరలోనే భారీ మిలిటరీ ఆపరేషన్ లాంచ్ చేయనున్నట్లు రిపోర్ట్స్ రావడం కలకలం రేపుతోంది. ఇరాన్తో జరుగుతున్న చర్చలు విఫలమైతే దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని ఆక్సియాస్ ఏజెన్సీ రిపోర్ట్ వెల్లడించింది. అదే జరిగితే ఆ ఆపరేషన్ కొన్ని వారాల పాటు కొనసాగుతుందని అంచనా వేసింది. న్యూక్లియర్, మిసైల్ ఇన్ఫ్రాస్ట్రక్చరే లక్ష్యంగా ఇజ్రాయెల్తో కలిసి ఈ ఆపరేషన్ చేపట్టనున్నట్లు తెలిపింది.
News February 18, 2026
SMలో ‘ఓవర్ షేరింగ్’ వద్దు.. ఈ విషయాలు పోస్ట్ చేస్తే డేంజర్!

SMలో మనం సరదాగా పంచుకునే వివరాలే సైబర్ నేరగాళ్లకు అస్త్రాలుగా మారుతున్నాయి. లైవ్ లొకేషన్, బోర్డింగ్ పాస్, బ్యాంక్ వివరాలు, హోమ్ అడ్రస్, పాన్/ఆధార్, CVV, OTP వంటి కీలక విషయాలను షేర్ చేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి ఐడెంటిటీ థెఫ్ట్కు దారితీసి మీ పేరిట ఆర్థిక మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. ప్రైవసీని కాపాడుకోవడానికి టూ-స్టెప్ వెరిఫికేషన్ వంటి సెక్యూరిటీ మోడ్స్ ఆన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
News February 18, 2026
బొత్సకు ‘హెరిటేజ్’ లీగల్ నోటీసులు

AP: నెయ్యి వివాదంలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసులు పంపింది. అసత్య, నిరాధార ఆరోపణలతో తమ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని అందులో పేర్కొంది. తప్పుడు ప్రచారంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. కాగా 2014-19లో తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ డెయిరీతో హెరిటేజ్ చీకటి ఒప్పందం చేసుకుందని బొత్స ఆరోపించారు.


