News April 21, 2024

పేదలకు 3 కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తాం: కిషన్ రెడ్డి

image

TG: వచ్చే ఐదేళ్లలో మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో BJP ముందుకెళ్తోందని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను మారుస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా అవినీతిని, బంధుప్రీతిని వదిలిపెట్టలేదని విమర్శించారు. HYD BJP ఆఫీస్‌లో సంకల్ప పత్రాన్ని ఆయన విడుదల చేశారు.

Similar News

News December 16, 2025

పోలీసులను బెదిరిస్తే ఊరుకోం: పవన్

image

AP: పోలీసు ఉన్నతాధికారులను మాజీ సీఎం బెదిరిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. పోలీసులను బెదిరిస్తే తమ ప్రభుత్వం ఉపేక్షించదని హెచ్చరించారు. కానిస్టేబుల్ నోటిఫికేషన్‌పై కేసులు వేస్తే గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. మంగళగిరిలో కానిస్టేబుల్స్‌ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇక్కడ మంత్రి నారా లోకేశ్ లేని లోటు కనిపిస్తోందని చెప్పారు.

News December 16, 2025

32 కేసులను పరిష్కరించి కానిస్టేబుల్ ఉద్యోగాలిచ్చాం: CM

image

AP: ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు ఇస్తున్నామని కానిస్టేబుల్ సెలక్షన్ ఆర్డర్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు తెలిపారు. పోస్టుల కోసం కానిస్టేబుల్ అభ్యర్థులు 4 ఏళ్లుగా ఎదురుచూశారని, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో 32 కేసులు ఉంటే వాటిని పరిష్కరించి ఉద్యోగాలు ఇప్పించామని పేర్కొన్నారు. మెగా డీఎస్సీతో 15వేల ఉద్యోగాలు, ఇప్పుడు 6,014 మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలిచ్చామని వెల్లడించారు.

News December 16, 2025

కౌలు రైతులకు ₹లక్ష వరకు పంట రుణం

image

AP: కౌలు రైతులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వారు పంటలు సాగు చేసుకునేందుకు రుణాలివ్వాలని DCCBలను ఆదేశించింది. రైతులు PACS సభ్యత్వం, ఆ పరిధిలో నివాసం, కౌలుపత్రం కలిగి ఉండాలి. ఎకరాకు తక్కువ కాకుండా భూమి ఉండాలి. ₹లక్ష వరకు రుణమిస్తారు. రైతులు వ్యక్తిగతంగా లేదా సంఘంగా ఏర్పడి రుణాలు పొందవచ్చు. రుణాన్ని వడ్డీతో ఏడాదిలోపు చెల్లించాలి. కాగా డీకేటీ, అసైన్డ్ భూముల్లో వ్యవసాయం చేసే వారికి రుణాలు రావు.