News May 7, 2025

క్యాబినెట్‌లో NDSA రిపోర్ట్‌పై చర్చిస్తాం: ఉత్తమ్

image

TG: మేడిగడ్డ బ్యారేజ్‌పై NDSA రూపొందించిన <<16206712>>నివేదికపై<<>> మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. బ్యారేజ్ ఎందుకూ పనికిరాదని NDSA తేల్చిందన్నారు. రూ.లక్ష కోట్లతో BRS నాసిరకం ప్రాజెక్టు నిర్మించిందని మండిపడ్డారు. రూ.వేల కోట్లు దోచుకునేందుకు కాళేశ్వరం నిర్మించారని ఫైరయ్యారు. క్యాబినెట్‌లో NDSA నివేదికపై చర్చించాకే తర్వాతి కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నారు.

Similar News

News February 10, 2026

ఇండియా-పాక్ మ్యాచ్.. విమాన టికెట్లకు రెక్కలు

image

T20 ప్రపంచకప్‌లో ఇండియాతో మ్యాచ్ విషయంలో <<19097488>>పాక్ యూటర్న్<<>> తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరగనున్న కొలంబోకు విమాన టికెట్ల ధరలు భారీగా ఎగిశాయి. ఇండియాతో ఆడతామని పాక్ ప్రకటించిన నిమిషాల్లోనే ఏకంగా రూ.10 వేలు పెరిగాయని సమాచారం. ప్రస్తుతం పోను రాను టికెట్ ధర రూ.60 వేలుగా ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్‌కు ఇంకా 5 రోజులుండటంతో ఈ రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.

News February 10, 2026

పాక్ యూటర్న్ విలువ ₹1,500 కోట్లు!

image

భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్‌పై పాక్ యూటర్న్ తీసుకోవడంతో ICC సహా గ్లోబల్ బ్రాడ్‌కాస్టర్లకు దాదాపు ₹1,500 కోట్ల ఆదాయం మిగిలింది. మ్యాచ్ రద్దయి ఉంటే మీడియా పార్ట్‌నర్ అయిన జియోహాట్‌స్టార్‌కు ICC భారీ పరిహారం ఇవ్వాల్సి వచ్చేది. అలాగే 10 సెకన్ల యాడ్‌కు ₹25-40 లక్షల చొప్పున సుమారు ₹200-300 కోట్ల యాడ్ రెవెన్యూ పోయేది. స్పాన్సర్‌షిప్‌లు, డిజిటల్ ట్రాఫిక్, హోటల్ బుకింగ్‌ల రూపంలో మరింత లాస్ తప్పేది కాదు.

News February 10, 2026

తాబేలు ఉన్న ఉంగరాన్ని ధరిస్తే..?

image

జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆర్థిక కష్టాలు తొలగి, లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి తాబేలు ఉంగరం ధరించడం మంచిదని పండితులు చెబుతున్నారు. ‘ఈ ఉంగరాన్ని ముందుగా పాలు, గంగాజలంతో శుద్ధి చేయాలి. ముందుగా లక్ష్మీదేవి పాదాల చెంత ఉంచి పూజించాలి. గురువారం ఈ ప్రక్రియ పూర్తి చేసి, శుక్రవారం నాడు కుడిచేతి చూపుడు/మధ్య వేలుకు ధరించాలి. ఉంగరం పెట్టుకున్నప్పుడు తాబేలు ముఖం మీ వైపు ఉండేలా చూసుకోవాలి’ అని సూచిస్తున్నారు.