News April 1, 2024
‘డబ్బులు ఇస్తాం వెళ్లిపోండి’.. సీనియర్లకు మెక్కిన్సే ఆఫర్

ఆర్థిక భారం తగ్గించుకునేందుకు బడా సంస్థలు లేఆఫ్ ట్రెండ్ ఫాలో అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మెక్కిన్సే కంపెనీ సైతం వందలాది సీనియర్ ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. తమ సంస్థను వదిలి మరోచోట ఉపాధి వెతుక్కోవాలని ఉద్యోగులను కోరుతోంది. యూకేలోని మేనేజర్ స్థాయి ఉద్యోగులకు అయితే తొమ్మిది నెలల పాటు జీతం ఇస్తామని.. ఆ సమయాన్ని మరోచోట ఉద్యోగం సంపాదించుకునేందుకు ఉపయోగించుకోమని ఆఫర్ ఇచ్చింది.
Similar News
News February 9, 2026
విత్తన పొట్టేలుకు ఉండాల్సిన లక్షణాలు

ప్రతీ రెండు నుంచి మూడేళ్లకు ఒకసారి విత్తన పొట్టేలును మార్చాలి. ఎంపిక చేసుకునే పొట్టేలు దృఢంగా, ఎత్తుగా, చురుకుగా, ఎక్కువ బరువు, అధిక లైంగికాసక్తి కలిగి ఉండాలి. ముఖ్యంగా కవల పిల్లలను కనే సంతతి నుంచి వచ్చిన పొట్టేలును ఎంచుకోవడం చాలా మంచిదని వెటర్నరీ నిపుణులు సూచిస్తున్నారు. రెండేళ్లకు పైన వయసున్న పొట్టేలును మాత్రమే ఎంచుకోవాలి. మరింత సమాచారం కోసం వెటర్నరీ నిపుణుల సలహా తీసుకోవాలి.
News February 9, 2026
దీపారాధన తర్వాత కాలిన వత్తులను ఏం చేయాలి?

దీపం వెలిగించిన తర్వాత కాలిన వత్తులను, ఆ బూడిదను పవిత్రంగా భావించాలి. వీటిని ఎప్పుడూ చెత్తబుట్టలో, అపవిత్ర ప్రదేశాలలో పారేయకూడదు. 10 రోజుల పాటు సేకరించిన ఆ వత్తులను 11వ రోజున కర్పూరం, లవంగాలు వేసి కాల్చాలి. ఆ ధూపాన్ని ఇల్లంతా తిప్పితే ప్రతికూల శక్తులు నశిస్తాయి. చివరగా మిగిలిన బూడిదను శుభకార్యాలకు వెళ్లే ముందు తిలకంలా ధరించవచ్చు. మొక్కల మొదట్లో వేస్తే మంచి జరుగుతుంది. వాటిని అపవిత్రం చేయకూడదు.
News February 9, 2026
కల్తీ నెయ్యి వ్యవహారం.. కేసు నమోదు చేసిన ఈడీ

AP: తిరుమల కల్తీ నెయ్యి <<18933854>>వ్యవహారం<<>>లో హవాలా ద్వారా డబ్బులు చేతులు మారాయనే ఆరోపణల నేపథ్యంలో ED రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ECIR) నమోదు చేసింది. ₹235 కోట్ల అక్రమాలు జరిగాయని, ₹20 కోట్లకు పైగా హవాలా జరిగిందని ఛార్జ్షీట్లో CBI పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో ముడుపులు అందుకున్న వారికి, ఏజెంట్లకు త్వరలో ED నోటీసులు జారీచేసే అవకాశం ఉందని సమాచారం.


