News October 8, 2025

కరూర్ తొక్కిసలాటపై రిషబ్ శెట్టి ఏమన్నారంటే?

image

తమిళనాడులో హీరో విజయ్ ర్యాలీలో చోటు చేసుకున్న <<17885395>>తొక్కిసలాట<<>> ఘటన దురదృష్టకరమని ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి అన్నారు. ఇది అనుకోకుండా జరిగిన ఘటనగా పేర్కొన్నారు. ఇది ఒక్కరి తప్పు కాదని సమష్టి పొరపాటుగా భావిస్తున్నానని అభిప్రాయపడ్డారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందని పేర్కొన్నారు. పోలీసులు, ప్రభుత్వంపై నింద వేయడం సులభమేనని, అంత జనం ఉన్నప్పుడు వారిని నియంత్రించడం సమస్యేనని పేర్కొన్నారు.

Similar News

News January 24, 2026

కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ

image

TG: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌తో కేటీఆర్ సమావేశం అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న విచారణకు హాజరైన విషయాలను గులాబీ బాస్‌కు వివరిస్తున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో హరీశ్ రావు కూడా ఫామ్‌హౌస్‌కు చేరుకోనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు, త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలపై కేటీఆర్, హరీశ్‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.

News January 24, 2026

అమ్మాయితో అడ్డంగా దొరికిన పలాశ్.. ఫ్రూఫ్ ఏదని ప్రశ్న!

image

క్రికెటర్ స్మృతి మంధాన మాజీ లవర్ <<18940645>>పలాశ్‌<<>>పై వస్తున్న ఆరోపణలను అతని లాయర్ శ్రేయాన్ష్ కొట్టిపారేశారు. మరో అమ్మాయితో పలాశ్ అడ్డంగా దొరికిపోయాడన్న విద్యాన్ మానే ఆరోపణలను లాయర్ కొట్టిపారేస్తూ.. ‘దానికి సాక్ష్యం ఏది?’ అని ప్రశ్నించారు. అలాగే ₹40 లక్షల ఫ్రాడ్ ఆరోపణలపై స్పందిస్తూ ఆ డబ్బు చెక్కు ద్వారా ఇచ్చారా లేక ట్రాన్స్‌ఫర్ చేశారా అని నిలదీశారు. అతనికి లీగల్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

News January 24, 2026

రథ సప్తమి పూజ ఎలా చేయాలంటే..?

image

రథసప్తమి నాడు సూర్యరశ్మి పడే చోట ఆవు పేడతో శుద్ధి చేయాలి. పిడకల పొయ్యి పెట్టాలి. ఇత్తడి పాత్రలో ఆవు పాలను పొంగించాలి. పాలు పొంగే సమయంలో కొత్త బియ్యం, బెల్లంతో పరమాన్నం చేయాలి. దాన్ని చిక్కుడాకుల్లో సూర్యుడికి నివేదించాలి. అనంతరం అందరికీ వితరణ చేస్తే మంచి జరుగుతుందని నమ్మకం. అలాగే చిక్కుడు కాయలు, కొబ్బరి పుల్లలతో చిన్న రథాన్ని తయారు చేసి పూజించాలి. పాలు పొంగడం ఇంటి అభివృద్ధికి సంకేతంగా భావిస్తారు.