News May 1, 2024
ఎవరి అధీనంలో ఏ కంపెనీలు అంటే..

గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ (GIG) పరిధిలో గోద్రేజ్ ఇండస్ట్రీస్, గోద్రేజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్, గోద్రేజ్ ఆగ్రోవెట్, ఆస్టెక్ లైఫ్సైన్సెస్ సంస్థలు వస్తాయి. GIGకి నాదిర్ ఛైర్మన్గా ఉంటారు. నాదిర్ కజిన్ జమ్షెద్ గోద్రేజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్కు (GEG) ఛైర్మన్గా ఉంటారు. GEG పరిధిలో డిఫెన్స్, ఏవియేషన్, నిర్మాణం, IT, ఫర్నీచర్, ఎనర్జీ, ఇంజిన్స్ & మోటార్స్ మొదలైన వ్యాపారాలు ఉన్నాయి.
Similar News
News December 7, 2025
రోహిత్, కోహ్లీలకు గంభీర్ షాక్!

ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో జరిగిన సిరీసుల్లో రాణించినప్పటికీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. విరాట్, రోహిత్ శర్మలు 2027 WC ఆడటంపై గ్యారంటీ ఇవ్వలేదు. వారిద్దరూ 2027 ప్రపంచకప్ ఆడతారా అని జర్నలిస్టులు అడగ్గా.. ‘వన్డే ప్రపంచకప్ మరో రెండేళ్లు ఉందని మీరు తెలుసుకోవాలి. ప్రస్తుతం గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. యంగ్ ప్లేయర్లు చక్కగా ఆడుతూ అవకాశాలు సద్వినియోగం చేసుకుంటున్నారు’ అని స్పష్టం చేశారు.
News December 7, 2025
విత్తన మొలక శాతం.. పంట దిగుబడికి ముఖ్యం

పంట దిగుబడి బాగుండాలన్నా, వ్యవసాయం లాభసాటిగా సాగాలన్నా పంటకు ‘విత్తనం’ ప్రధానం. అందుకే మేలైన దిగుబడి కోసం మొలక శాతం బాగా ఉన్న విత్తనాన్ని సేకరించాలి. విత్తన కొనుగోలు తర్వాత దాని మొలక శాతాన్ని పరిశీలించాలి. అది నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే విత్తుకోవాలి. అసలు విత్తన మొలక శాతాన్ని ఎలా పరిశీలించాలి? దానికి అందుబాటులో ఉన్న పద్ధతులు ఏమిటో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 7, 2025
ఒకరికి 38, మరొకరికి 37.. అయితేనేం అదరగొట్టారు

SAతో జరిగిన వన్డే సిరీస్ను భారత్ కైవసం చేసుకోవడంలో ‘రో-కో’ కీలక పాత్ర పోషించారు. గత రెండు సిరీస్లను గమనిస్తే ఒక్కోసారి ఒక్కో స్టార్ అదరగొట్టారు. AUSతో జరిగిన సిరీస్లో రోహిత్ శర్మ(38y) అత్యధిక పరుగులు, సగటు, బౌండరీలు, P.O.Sగా నిలిస్తే, తాజాగా SAతో జరిగిన సిరీస్లో అవే రికార్డులు విరాట్ కోహ్లీ (37y) దక్కించుకున్నారు. 37+ ఏళ్ల వయసులోనూ ఈ ఇద్దరూ సూపర్ ఫామ్ కొనసాగిస్తూ విజయాలను అందిస్తున్నారు.


