News May 21, 2024

ఎవరు మైనర్లు.. ఎవరు మేజర్లు? చట్టాలు మార్చాలా..?(2/2)

image

కొన్ని చోట్ల హత్యలు చేయించేందుకు కుర్రాళ్లను వాడుకుంటున్నారు రౌడీ షీటర్లు. నేరం తీవ్రత బట్టి వయసుతో సంబంధం లేకుండా శిక్షలు ఎందుకు విధించకూడదు? కనీసం జువెనైల్‌ అన్న పదానికి చట్టంలో వయసును 15కు ఎందుకు తగ్గించకూడదు? సులువుగా నేరం చేసి జువెనైల్ హోంలో కులాసాగా గడిపి బయటికొచ్చే అదే కుర్రాడు ఆ తర్వాత మరింత కరుడుగట్టిన నేరస్థుడు కాడని ఏదీ గ్యారంటీ? ఇప్పుడిదే చర్చ సర్వత్రా నడుస్తోంది. మీరేమంటారు?

Similar News

News March 6, 2026

గిన్నిస్ రికార్డ్.. ఈయనకు 42 పళ్లు

image

సాధారణంగా మనిషికి 32 పళ్లు ఉంటాయని చదువుకున్నాం. కొందరికి 34 కూడా ఉండటం చూస్తుంటాం. కానీ మలేషియాకు చెందిన 33 ఏళ్ల ప్రతాప్ మునియాండికి ఏకంగా 42 పళ్లు ఉన్నాయి. ఈయనను అత్యధిక పళ్లున్న వ్యక్తిగా గుర్తించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ట్వీట్ చేసింది. ఆయన ఫొటోను షేర్ చేయగా నోరంతా దంతాలే కనిపించాయి. 2021లో తన కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు ఈ విషయాన్ని గమనించిన ఆయన డెంటిస్టుల ద్వారా నిర్ధారించుకున్నారు.

News March 6, 2026

కర్ణాటకలో మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్

image

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 16 ఏళ్లలోపు మైనర్లకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నట్లు సీఎం సిద్దరామయ్య అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. పిల్లలు, టీనేజర్లపై SM దుష్ప్రభావం చూపుతుందనే కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియాలో మైనర్లకు SMపై నిషేధం ఉండగా ఫిన్‌ల్యాండ్, UK కూడా అమలుకు కసరత్తు చేస్తున్నాయని KA ఐటీ మినిస్టర్ ప్రియాంక్ ఖర్గే వెల్లడించారు.

News March 6, 2026

కేజీ వెండిపై రూ.5వేలు తగ్గుదల

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో <<19309772>>బంగారం<<>>తో పాటు ఇవాళ వెండి ధర తగ్గింది. కేజీ వెండిపై రూ.5వేలు తగ్గి రూ.2,90,000 పలుకుతోంది. గత 6 రోజుల్లో కేజీ వెండిపై రూ.35వేలు తగ్గుదల నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ధరల్లో స్వల్ప తేడాలుండొచ్చు.