News August 11, 2025
టబు-రమ్యకృష్ణలో ఎవరు బెస్ట్.. నాగార్జున ఏం చెప్పారంటే?

జగపతిబాబు హోస్టుగా ఓ టాక్ షో రాబోతోంది. తొలి గెస్టుగా నాగార్జున హాజరయ్యారు. అందుకు సంబంధించిన ప్రోమో వైరలవుతోంది. ‘బెస్ట్ కో-యాక్ట్రెస్ ఎవరు రమ్యకృష్ణ, టబు?’ అని జగపతిబాబు అడగ్గా.. ‘కొన్ని చెప్పకూడదు, నేను చెప్పను’ అని నాగార్జున సమాధానం చెప్పారు. రివర్స్లో ‘రమ్యకృష్ణ, సౌందర్యలో నీ ఫేవరెట్ ఎవరు?’ అని జగపతిబాబును అడిగారు. ‘ఇది నా ఇంటర్వ్యూ కాదు. నేను ఆన్సర్ చెప్పను’ అంటూ ఆయన తప్పించుకున్నారు.
Similar News
News March 6, 2026
రేపు 11:01AMకి ‘ధురంధర్-2’ ట్రైలర్

ఆదిత్య ధర్, రణ్వీర్ సింగ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ధురంధర్-2’ సినిమా ట్రైలర్ రేపు ఉదయం 11.01 గంటలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. ఈసారి హిందీలోనే కాకుండా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలవనుంది. కాగా ‘ధురంధర్’ తొలి పార్ట్ ఏకంగా రూ.1,350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే.
News March 6, 2026
పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్పై నెట్టింట ప్రశంసలు

పిల్లలను SM తప్పుదారి పట్టిస్తోందని దీనిని బ్యాన్ చేయడం కరెక్టేనని తల్లిదండ్రుల నుంచి అభిప్రాయం వినిపిస్తోంది. తాజాగా KA ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వీరు ఆహ్వానిస్తున్నారు. నేర్చుకునేందుకు SMలో ఎంతో మంచి కంటెంట్ ఉంటే పిల్లలు మాత్రం తప్పుదారి పట్టించే వీడియోలవైపే అట్రాక్ట్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు ఏకాగ్రతగా చదువుకోవాలంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు అవసరమంటున్నారు. మీ కామెంట్?
News March 6, 2026
గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం!

మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతల నడుమ LPG విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ సిలిండర్లను ప్రధానంగా గృహ వినియోగదారులకే సరఫరా చేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు స్పష్టం చేసింది. IOCL, BPCL, HPCLకు ఆదేశాలు జారీ చేసింది. కమర్షియల్, ఇండస్ట్రియల్, పెట్రో కెమికల్ రంగాలకు గ్యాస్ సప్లైపై తాత్కాలిక పరిమితులు విధించింది. సాధారణ ప్రజలకు LPG సరఫరాలో అంతరాయం ఉండొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


