News February 17, 2025
ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసేది ఎవరంటే?: క్లార్క్

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేస్తారని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ క్లార్క్ జోస్యం చెప్పారు. ఇటీవల ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో ఆయన తిరిగి ఫామ్లోకి వచ్చారని చెప్పారు. మరోవైపు ENG ప్లేయర్ జోఫ్రా ఆర్చర్ అత్యధిక వికెట్లు తీస్తారని అభిప్రాయపడ్డారు. ఈ సిరీస్లో జోఫ్రాను ఎదుర్కోవడం కష్టమేనని తెలిపారు. అయితే ఆస్ట్రేలియా ఫైనల్ వెళ్తుందన్నారు.
Similar News
News April 16, 2026
భార్యాభర్తల బంధం.. 5-5-5 రూల్తో పదిలం!

భార్యాభర్తలు గొడవలను దురుసుగా కాకుండా 5-5-5 రూల్తో పరిష్కరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఐదు నిమిషాలు భార్య మాట్లాడితే ఆ తర్వాత ఐదు నిమిషాలు భర్త మాట్లాడాలి.. మిగతా 5 నిమిషాలు పరిష్కారానికి కేటాయించాలనేది ఈ కాన్సెప్ట్. మొదటి పది నిమిషాల్లో ఒకరి మాటలను మరొకరు శ్రద్ధగా వినాలి. మధ్యలో కలగజేసుకోకూడదు. దీంతో పాటు రోజూ అభినందించుకోవడం, సాయపడటం వంటివి చేస్తే అనురాగం పెరిగి బంధం బలంగా ఉంటుంది.
News April 16, 2026
HMTలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

కాంట్రాక్ట్ పద్ధతిలో 2 డిప్యూటీ ఇంజినీర్, 2 ఆఫీసర్ పోస్టుల భర్తీకి HMT దరఖాస్తులను కోరుతోంది. మెకానికల్/ప్రొడక్షన్లో 60% మార్కులతో ఇంజినీరింగ్ పూర్తిచేసి రెండేళ్ల ఉద్యోగ అనుభవం ఉన్నవారు అప్లై చేయొచ్చు. జీతం నెలకు రూ.16,400-రూ. 40,500. వయసు 30 ఏళ్లు దాటకూడదు. ఇంటర్వ్యూ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో అప్లై చేయడానికి APR-26 చివరి తేదీ. పూర్తి వివరాలకు www.hmtindia.com చూడండి.
News April 16, 2026
రోడ్డు ప్రమాద బాధితులను కాపాడేవారికి రూ.25వేలు: మంత్రి

AP: రోడ్డు ప్రమాదాల్లో మొదటి గంటలోపు క్షతగాత్రులకు ‘PM రాహత్’ కింద ₹1.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ‘వీరి వైద్యం ఖర్చు ఇంకా ఎక్కువైనా మిగతా మొత్తాన్ని NTR వైద్యసేవ కింద అందిస్తాం. రోడ్డు ప్రమాదాల బాధితులను ఆసుపత్రిలో చేర్పించే వారికిచ్చే ప్రోత్సాహకాన్ని ₹5వేల నుంచి 25వేలకు పెంచారు’ అని తెలిపారు. వీరికి పోలీసుల వైపు నుంచి సమస్య లేకుండా చూస్తామని చెప్పారు.


