News March 26, 2024
అనంతపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎవరో?

AP: అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్ అభ్యర్థి ఎంపికపై TDPలో స్పష్టత కొరవడింది. సామాజిక, ఆర్థిక సమీకరణాలు లెక్కలతో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా మాజీ MP జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ రెడ్డి పేరు టికెట్ రేసులో వినిపిస్తోంది. ఈ సెగ్మెంట్లో బోయ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఆ వర్గానికి చెందిన కమ్మూరి నాగరాజు, రాజేష్, మాజీ ZP ఛైర్మన్ పూల నాగరాజు పేర్లను పరిశీలిస్తున్నారు.
Similar News
News February 13, 2026
ఎగ్జిమ్ బ్యాంక్లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

<
News February 13, 2026
జటాజూటంలో నెలవంక ఎందుకయ్యా శివయ్యా?

శివుని జటాజూటంలోని నెలవంక మనస్సుపై నియంత్రణను సూచిస్తుంది. చంద్రుడు మనస్సుకు కారకుడు. ఎప్పుడూ మారుతూ ఉంటాడు. అలాంటి చంద్రుడిని ధరించడమంటే చంచలమైన మనస్సును అదుపులో ఉంచుకొని స్థితప్రజ్ఞత సాధించడమే. ఇది అమృతత్వానికి చిహ్నం. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మనస్సును శాంతంగా, ధీరత్వంతో ఉంచుకోవాలని గుర్తుచేస్తుంది. కాలక్రమంలో వచ్చే మార్పులను స్వీకరిస్తూనే, అంతర్గత శాంతిని కోల్పోకూడదని సందేశం!
News February 13, 2026
పత్తి తీత తర్వాత తీసుకోవాల్సిన మరికొన్ని జాగ్రత్తలు

పత్తి తీత తర్వాత ఆ చేనులో గొర్రెలు, మేకలు, పశువులను మేపాలి. పత్తి మోళ్లను అందుబాటులో ఉండే ట్రాక్టరు రోటవేటరుతో భూమిలో కలియదున్నాలి. ఎండిన మొక్కల మోళ్లు, విచ్చుకోని కాయలను భూమిలో కలియదున్నడం వల్ల పంటకు హాని చేసే పురుగు కోశస్థ దశలను నాశనం చేయవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. పత్తి పంట పూర్తయిన తర్వాత ఆ భూమిలో నీటి వసతి ఉంటే రెండో పంటగా ఇతర ఆరుతడి పంటలను సాగు చేసుకోవచ్చు.


