News April 30, 2024
చింతలపూడి ప్రజలు ఎవరికి పట్టం కట్టేనో?

ప.గో(D)లో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం చింతలపూడి. గతంలో ఇక్కడ కాంగ్రెస్ హవా ఉన్న సమయంలోనూ స్వతంత్రులు నెగ్గారు. 1983లో కోటగిరి విద్యాధరరావు ఇండిపెండెంట్గా గెలిచి TDPలో చేరారు. ఆ తర్వాత ఆయన నాలుగు పర్యాయాలు విజయం సాధించారు. కాగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజాను కాదని వైసీపీ కంభం విజయరాజుని ఈసారి బరిలోకి దింపింది. దీంతో ఎలీజా కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచారు. TDP తరఫున రోషన్ పోటీలో ఉన్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News December 8, 2025
నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీలో ఉద్యోగాలు

CSIR-నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీ(<
News December 8, 2025
‘హమాస్’పై ఇండియాకు ఇజ్రాయెల్ కీలక విజ్ఞప్తి

‘హమాస్’ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలని భారత్ను ఇజ్రాయెల్ కోరింది. పాక్కు చెందిన లష్కరే తోయిబా, ఇరాన్ సంస్థలతో దీనికి సంబంధాలున్నాయని చెప్పింది. గాజాలో కార్యకలాపాల పునరుద్ధరణకు ప్రయత్నిస్తోందని, ప్రపంచవ్యాప్తంగా దాడులకు అంతర్జాతీయ సంస్థలను వాడుకుంటోందని తెలిపింది. హమాస్ వల్ల ఇండియా, ఇజ్రాయెల్కు ముప్పు అని పేర్కొంది. ఇప్పటికే US, బ్రిటన్, కెనడా తదితర దేశాలు హమాస్ను టెర్రర్ సంస్థగా ప్రకటించాయి.
News December 8, 2025
తెలంగాణ అప్డేట్స్

* ఈ నెల 17 నుంచి 22 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిది
* తొలిసారిగా SC గురుకులాల్లో మెకనైజ్డ్ సెంట్రల్ కిచెన్ను ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
* రాష్ట్రంలోని హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు, CHCల్లో మరో 79 డయాలసిస్ సెంటర్లు..
* టెన్త్ పరీక్షలకు విద్యార్థుల వివరాలను ఆన్లైన్ ద్వారా మాత్రమే సేకరించాలని స్పష్టం చేసిన ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీహరి


