News June 17, 2024
అల్లర్ల గురించి పిల్లలకు ఎందుకు బోధించాలి?: NCERT డైరెక్టర్

పాఠ్యపుస్తకాలు కాషాయమయం అవుతున్నాయన్న ఆరోపణలను NCERT డైరెక్టర్ దినేశ్ ప్రసాద్ కొట్టిపారేశారు. ‘గుజరాత్ అల్లర్లు, బాబ్రీ మసీదు కూల్చివేతల గురించి పిల్లలకు ఎందుకు బోధించాలి? పెద్దయ్యాక వారే తెలుసుకుంటారు’ అని అన్నారు. తాజాగా విడుదలైన పుస్తకాల్లో బాబ్రీ మసీదు పేరును ప్రస్తావించలేదు. ‘మూడు గుమ్మటాల నిర్మాణం’ అని పేర్కొన్నారు. BJP రథయాత్ర, బాబ్రీ మసీదు కూల్చివేతతో మత ఘర్షణలు తదితర అంశాలను తొలగించారు.
Similar News
News January 18, 2026
SRCL: రాజకీయ పార్టీల సమక్షంలో రిజర్వేషన్ల ఖరారు

జిల్లాలోని మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా రాజకీయ పార్టీల రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు మున్సిపల్ వార్డుల్లో రిజర్వేషన్ ఖరారు చేసే ప్రక్రియను శనివారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇంచార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించారు.
News January 18, 2026
మెరిసిన మంధాన.. RCB ఘన విజయం

WPL: ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో RCB 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ స్మృతి మంధాన(96), జార్జియా హాఫ్ సెంచరీ(54*)తో రాణించడంతో 167రన్స్ లక్ష్యాన్ని RCB సునాయాసంగా ఛేదించింది. DC బౌలర్లు ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. మారిజాన్, నందినీ శర్మలకు చెరో వికెట్ దక్కింది. ఢిల్లీ తరఫున షెఫాలీ వర్మ(62) ఒంటరి పోరాటం వృథా అయ్యింది. ఈ విజయంతో బెంగళూరు జట్టు 8 పాయింట్లతో టేబుల్ టాపర్గా కొనసాగుతోంది.
News January 18, 2026
రేపు మౌని అమావాస్య.. ఉదయమే ఇలా చేయండి

రేపు పవిత్రమైన ‘<<18871132>>మౌని అమావాస్య<<>>’. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి భూమాతకు నమస్కరించాలి. పుణ్యస్నానం ఆచరించాలి. ఉదయం సూర్య నమస్కారం చేయాలి. అనంతరం శ్రీహరి, మహాలక్ష్మీ, గంగామాతను పూజించాలి. ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. శివాలయానికి వెళ్లి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శివుడికి రుద్రాభిషేకం చేయాలి. రేపు మౌనవ్రతం చేయడం వల్ల పుణ్యం సిద్ధిస్తుంది.


