News April 1, 2024
వృద్ధుల ఉసురు పోసుకుని CBN బాగుపడతారా?: పేర్నినాని

AP: పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లు వద్దని ఈసీకి ఫిర్యాదు చేసిన నిమ్మగడ్డ రమేశ్ టీడీపీ సానుభూతిపరుడు కాదా? అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ప్రజల నుంచి తిరుగుబాటు రావడంతో చంద్రబాబు మాట మార్చారని మండిపడ్డారు. వృద్ధులు, వితంతువుల ఉసురు పోసుకుని ఆయన బాగుపడతారా? అని ఫైరయ్యారు. సంక్షేమ కార్యక్రమాలు అడ్డుకునే ప్రయత్నాన్ని విషపు కూటమి చేస్తోందని దుయ్యబట్టారు.
Similar News
News February 15, 2026
బంగ్లా ప్రయోజనాలకే ప్రాధాన్యం: తారిఖ్ రెహ్మాన్

బంగ్లాదేశ్, ప్రజల ప్రయోజనాలే తమ విదేశాంగ విధానాన్ని నిర్ణయిస్తాయని BNP చీఫ్ తారిఖ్ రెహ్మాన్ అన్నారు. ఇండియాతో సంబంధాలపై మీడియా అడిగిన ప్రశ్నకు ఇలా బదులిచ్చారు. ‘ఈ గెలుపు బంగ్లాది. ఇప్పుడు మనం స్వేచ్ఛను పొందాం. హక్కులకు అసలైన అర్థాన్ని తిరిగి సంపాదించుకున్నాం. ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వారికి ఈ విజయాన్ని అంకితమిస్తున్నా’ అని చెప్పారు. తాజా ఎన్నికల్లో BNP <<19134014>>భారీ మెజారిటీ<<>>తో గెలవడం తెలిసిందే.
News February 15, 2026
శివరాత్రి ఉపవాసం చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించండి!

ఇవాళ మహా శివరాత్రి సందర్భంగా భక్తులు <<19142196>>ఉపవాస దీక్షలు<<>> ఆచరిస్తారు. అయితే పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘శరీరం డీహైడ్రేట్ కాకుండా నీరు ఎక్కువగా తీసుకోవాలి. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తాగితే మంచిది. పాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు’ అని చెబుతున్నారు. ఉపవాసం తర్వాత భారీగా తినొద్దని, ముందు తేలికైన ఆహారంతో ప్రారంభించాలని పేర్కొంటున్నారు.
News February 15, 2026
ఫిబ్రవరి 15: చరిత్రలో ఈరోజు

1564: ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో జననం
1739: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జననం
1861: UK గణిత శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త ఆల్ఫ్రెడ్ నార్త్ వైట్హెడ్ జననం
1964: సినీ దర్శకుడు, నిర్మాత అశుతోశ్ గోవారికర్ జననం
1982: సినీ నటి మీరా జాస్మిన్ జననం
2022: మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ బప్పి లాహిరి మరణం (ఫొటోలో)


