News March 27, 2024

పాము రక్తం తాగుతున్న మహిళలు.. ఎందుకంటే?

image

అందంగా కనిపించేందుకు కొందరికి పండ్ల రసాలు తాగే అలవాటు ఉంటుంది. అయితే ఇండోనేషియా రాజధాని జకార్తాలో అందం కోసం కోబ్రా రక్తాన్ని తాగేస్తారు. చర్మం నిగారింపు కోసం మహిళలు, ఆరోగ్యం కోసమని పురుషులు ఈ బ్లడ్ లాగించేస్తారట. అందుకే నగర వీధుల్లో సాయంత్రం 5 నుంచి అర్ధరాత్రి 1 వరకు వీటి అమ్మకాలు జరుపుతారు. విక్రయదారులు రోజుకు రూ.10లక్షలు సంపాదిస్తారంటే అర్థం చేసుకోవచ్చు డిమాండ్ ఏ రేంజ్‌లో ఉందో.

Similar News

News February 19, 2026

వరుణ్.. నువ్వో వరం!

image

టీ20ల్లో టీమ్ ఇండియాకు వరుణ్ చక్రవర్తి వరంలా మారారు. గత 29 టీ20ల్లో 28 మ్యాచుల్లో అతడు వికెట్లు పడగొట్టడం విశేషం. ఒక్క మ్యాచులో మాత్రమే వికెట్లు తీయలేదు. కీలక సమయాల్లో తన మిస్టరీ బంతులతో బ్యాటర్లను బోల్తా కొట్టించడం వరుణ్ స్పెషల్. ఈ ప్రపంచకప్‌లోనూ మిగతా బౌలర్లు వికెట్లు తీయలేక ఇబ్బందులు పడుతుంటే వరుణ్ వరుసగా వికెట్లు తీస్తూ భారత్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.

News February 19, 2026

భారీగా తగ్గిన రష్యన్ ఆయిల్ దిగుమతులు

image

భారత్ చమురు దిగుమతుల్లో రష్యా వాటా భారీగా తగ్గింది. ఒకప్పుడు 40% ఉన్న షేర్ ఇప్పుడు 21.1%కు పడిపోయింది. జనవరిలో రోజుకు 1.1 మిలియన్ బ్యారెళ్ల చమురును మాత్రమే దిగుమతి చేసుకుంది. 2022 నవంబరు తర్వాత ఇంత తక్కువ దిగుమతులు చేసుకోవడం ఇదే తొలిసారి. మార్చిలో ఈ దిగుమతి రోజుకు 8లక్షల బ్యారెళ్లకు పడిపోవచ్చని అంచనా. మరోవైపు జనవరి చమురు దిగుమతుల్లో మిడిల్ ఈస్ట్ వాటా దాదాపు 55%గా నమోదైంది.

News February 19, 2026

భారీగా తగ్గిన రష్యన్ ఆయిల్ దిగుమతులు

image

భారత్ చమురు దిగుమతుల్లో రష్యా వాటా భారీగా తగ్గింది. ఒకప్పుడు 40% ఉన్న షేర్ ఇప్పుడు 21.1%కు పడిపోయింది. జనవరిలో రోజుకు 1.1 మిలియన్ బ్యారెళ్ల చమురును మాత్రమే దిగుమతి చేసుకుంది. 2022 నవంబరు తర్వాత ఇంత తక్కువ దిగుమతులు చేసుకోవడం ఇదే తొలిసారి. మార్చిలో ఈ దిగుమతి రోజుకు 8లక్షల బ్యారెళ్లకు పడిపోవచ్చని అంచనా. మరోవైపు జనవరి చమురు దిగుమతుల్లో మిడిల్ ఈస్ట్ వాటా దాదాపు 55%గా నమోదైంది.