News April 21, 2024
భారత బానిసల పునాదులపై యేల్ వర్సిటీ!

పురాతన విద్యాసంస్థల్లో యేల్ యూనివర్సిటీ(US) ఒకటి. దీనికి, భారత్కు ఓ సంబంధం ఉంది. 17వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ ఎలిహు యేల్. మద్రాస్లో 30+ ఏళ్లు ఉన్న ఇతను కొన్ని వేల మంది భారతీయులను బానిసలుగా మార్చి ఎగుమతి చేశాడు. లండన్ వెళ్లిన తర్వాత ఓ US కాలేజీకి డొనేషన్లు ఇచ్చాడు. దీంతో అతని పేరునే దానికి పెట్టారు. కాగా బానిసత్వంతో తమకు సంబంధాలు ఉన్నందుకు ఆ వర్సిటీ ఫిబ్రవరిలో క్షమాపణ చెప్పింది.
Similar News
News December 15, 2025
పెరగనున్న టీవీల ధరలు!

కొత్త ఏడాదిలో TVల ధరలు పెరిగే అవకాశం ఉంది. మెమొరీ చిప్ల కొరత, రూపాయి పతనం, దిగుమతి వ్యయాలు పెరగడం ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో జనవరిలో 3 నుంచి 10% వరకు టీవీల ధరలు పెరగొచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కొన్ని తయారీ కంపెనీలు డీలర్లకు ఈ విషయం తెలియజేశాయని పేర్కొంటున్నాయి. గత మూడేళ్లలో మెమొరీ చిప్ల ధరలు 500% ఎగిశాయని, వచ్చే 6 నెలలూ పెరిగే అవకాశం ఉందని వెల్లడించాయి.
News December 15, 2025
AP న్యూస్ రౌండప్

* నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామాను కలెక్టర్ హిమాన్షు ఆమోదించారు. త్వరలో కొత్త మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం.
* రఘురామకృష్ణరాజును హింసించారనే ఆరోపణల కేసులో ఐపీఎస్ సునీల్ కుమార్ ఇవాళ గుంటూరు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకానున్నారు.
* ఏపీ లిక్కర్ కేసులో బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్రెడ్డి, ధనుంజయ్ బెయిల్ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
News December 15, 2025
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేడు బాధ్యతలు చేపట్టనున్న నితిన్

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బిహార్ మంత్రి నితిన్ నబీన్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా నితిన్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బిహార్ నుంచి నియమితులైన తొలి వ్యక్తిగా, పిన్న వయస్కుడిగానూ ఆయన నిలిచారు. త్వరలోనే నితిన్ను జాతీయ అధ్యక్షుడిగా నియమించే అవకాశముందని తెలుస్తోంది.


