News October 3, 2024
కేసులకు YCP శ్రేణులు భయపడొద్దు: జగన్

AP: వైసీపీ శ్రేణులు ప్రజల తరఫున పోరాటాలు చేయాలని, కేసులకు భయపడొద్దని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. తాడేపల్లిలో పశ్చిమగోదావరి నేతలతో ఆయన సమావేశమయ్యారు. ‘కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టకుండా కాలయాపన చేస్తోంది. వైసీపీ, టీడీపీ పాలనకు తేడాను ప్రజలు గమనిస్తున్నారు. ఏ ప్రభుత్వంలో మంచి జరిగిందన్నదానిపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోంది. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 12, 2025
చిలగడదుంపలతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో!

శీతాకాలంలో దొరికే చిలగడదుంపలు పోషకాల పవర్ హౌస్ అని వైద్యులు చెబుతున్నారు. ‘వీటిలోని బీటా కెరోటిన్ కంటి, చర్మ ఆరోగ్యానికి మంచిది. అధికంగా ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. పెద్దమొత్తంలో ఉండే పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది. అలాగే ఆంథోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు శరీర వాపులను, నొప్పులను తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇవి కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి మనల్ని రక్షిస్తాయి’ అని అంటున్నారు.
News December 12, 2025
చివరి దశకు ‘పెద్ది’ షూటింగ్

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇవాళ్టి నుంచి HYDతో కొత్త షూటింగ్ షెడ్యూల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. వచ్చే నెల చివరికల్లా టాకీ పార్ట్ పూర్తవుతుందని సినీ వర్గాలు తెలిపాయి. ఈ మూవీ నుంచి రిలీజైన చికిరీ సాంగ్ ఇప్పటికే వ్యూస్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. వచ్చే ఏడాది మార్చి 27న ‘పెద్ది’ రిలీజ్ కానుంది.
News December 12, 2025
ఇందుకేనా శాంసన్ని పక్కన పెట్టారు: నెటిజన్స్

SAతో టీ20 సిరీస్కి గిల్ ఎంపిక సెలక్టర్లకు తలనొప్పి తెచ్చి పెడుతోంది. VC కావడం, ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా తీర్చిదిద్దాలనే శాంసన్ని పక్కనపెట్టి గిల్కు అవకాశం ఇస్తున్నారు. తీరా చూస్తే పేలవ ప్రదర్శనతో (రెండు టీ20ల్లో 4, 0 రన్స్) నిరాశపరుస్తున్నారు. దీంతో సంజూ ఫ్యాన్స్, నెటిజన్స్ సెలక్టర్లపై మండిపడుతున్నారు. ‘గిల్ కోసం శాంసన్, జైస్వాల్కే కాదు. టీమ్కీ అన్యాయం చేస్తున్నారు’ అంటూ ఫైరవుతున్నారు.


