News August 12, 2025
YS జగన్కు రాఖీ కట్టిన కాకాణి పూజిత

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం కాకాణి పూజిత మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు బొకే అందించి రాఖీ కట్టారు. అనంతరం మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు ఆమె జగన్కు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News March 17, 2026
నెల్లూరు: 4107 ఫైర్ యాక్సిడెంట్స్.. రూ. 95 కోట్లు డ్యామేజ్

అసలే వేసవి కాలం ఎక్కడ ఏ నిప్పు అంటుకుంటుందో, ఎక్కడ పెను ప్రమాదం పొంచి ఉంటుందో తెలీదు. 2020-26 మధ్య 4107 అగ్ని ప్రమాదాలు జరిగాయి. రూ.95.54 కోట్ల డామేజ్ అవగా, 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్నిమాపక సిబ్బంది ఈప్రమాదాల్లో రూ.179 కోట్ల మేరా నష్టం నుంచి కాపాడి 33 మందిని సేవ్ చేశారు. అగ్ని ప్రమాదాలు ఏటా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా లేకుంటే ప్రాణ, ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉంది.
News March 17, 2026
నెల్లూరు: ఓ పక్క 10th పబ్లిక్ పరీక్షలు.. మరోపక్క తల్లి మరణం

దుత్తలూరు (M) భైరవరంలో విషాదఛాయలు నెలకొన్నాయి. అంగన్వాడీ కార్యకర్త దాసరి జయమ్మ గుండెపోటుతో మృతి చెందారు. మృతురాలు కొడుకు రామకృష్ణ వింజమూరు (M) గుండెమడకల జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు. ఈ నేపథ్యంలో పబ్లిక్ పరీక్షలు బాగా రాయాలని తల్లి మాట్లాడిన మాటలు చివరి మాటలు అవుతాయని ఊహించలేదు. పరీక్ష రాసి వచ్చిన తర్వాత తన తల్లి మరణ వార్త విని కన్నీటిపర్యంతమయ్యాడు.
News March 17, 2026
నెల్లూరు: నల్లగా ఉన్నావు.. అందంగా లేవంటూ..

భర్త తీరుతో మనస్తాపానికి గురై వివాహిత సూసైడ్ చేసుకుంది. నెల్లూరు అనగుంటకు చెందిన ప్రతాప్, మహిత(20) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సజావుగా సాగిన కాపురంలో కలతలు చోటుచేసుకున్నాయి. ఆమెను నల్లగా ఉన్నావు.. అందంగా లేవంటూ మానసికంగా వేధించడంతోపాటు కొడుతుండేవాడు. ఈ క్రమంలో ఆమె ఉరేసుకొని సూసైడ్ చేసుకుంది. కుటుంబ సభ్యులు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


