News February 27, 2025
కడెం: వ్యవసాయ బావిలోకి దూకి వ్యక్తి ఆత్మహత్య…!

మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది. SI కృష్ణసాగర్రెడ్డి కథనం ప్రకారం.. పాత మద్దిపడగ గ్రామానికి చెందిన బాతెం నర్సయ్య(67) మద్యానికి బానిసై ఇంట్లో తరచూ డబ్బులు అడిగేవాడు. ఈ క్రమంలో డబ్బులు ఇవ్వకపోవడంతో క్షణికావేశంలో వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణసాగర్ రెడ్డి తెలిపారు.
Similar News
News February 27, 2025
కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా

కరీంనగర్ జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. గడచిన 24 గంటల్లో అత్యధికంగా బురుగుపల్లి 38.0°C నమోదు కాగా, ఈదులగట్టేపల్లి 37.4, నుస్తులాపూర్ 37.1, తాంగుల, పోచంపల్లి 36.3, గంగిపల్లి, గట్టుదుద్దెనపల్లె 35.9, జమ్మికుంట 35.7, అర్నకొండ 35.6, కరీంనగర్ 35.5, తాడికల్, దుర్శేడ్, కొత్తపల్లి-ధర్మారం 35.4, కొత్తగట్టు 35.1, గంగాధర 34.9, గుండి 34.8, వీణవంక 34.6, ఇందుర్తి 34.5, వెదురుగట్టు 34.2°Cగా నమోదైంది.
News February 27, 2025
BNGR: టైర్ పగిలి ఇంట్లో ఉన్న వృద్ధురాలికి గాయం..

రోడ్డుపై వెళ్తున్న వాటర్ ట్యాంకర్ టైరు పగిలి దాని నుంచి వేరుపడిన ఇనుప వస్తువు ఇంట్లో కూర్చొని ఉన్న వృద్ధురాలి కాలికి తాకడంతో ఆమెకు తీవ్ర గాయాలైన ఘటన భువనగిరిలో జరిగింది. బాధితురాలి కుటుంబీకుల వివరాలిలా.. ములుగు జిల్లా జగన్నాథపురానికి చెందిన రామలక్ష్మి బంధువుల ఇంటికి వచ్చారు. ఇంట్లో కూర్చొని ఉండగా ఈ ఘటన జరిగింది. ఘటనపై కేసు నమోదైంది.
News February 27, 2025
#WeStandWithPosani అంటున్న వైసీపీ శ్రేణులు

AP: కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. పోసాని కృష్ణమురళి అరెస్టును ఖండిస్తూ #WeStandWithPosani అని కార్యకర్తలు ట్వీట్లు చేస్తున్నారు. గతంలో సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వారిని అరెస్టు చేశారని, ఇప్పుడు నాయకులను టార్గెట్ చేశారని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం వైసీపీ నేతలపై కాకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.