News February 27, 2025

కాకినాడ: ఐదుకు చేరిన జీబీఎస్ కేసులు

image

కాకినాడ జిల్లాను జీబీఎస్ వైరస్ వణికిస్తోంది. ఇప్పటివరకు ఐదు కేసులు నమోదయ్యాయి. గతంలో నాలుగు కేసులు ఉండగా బుధవారం ఇదే వైరస్‌తో మరో వ్యక్తి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఒకరు డిశ్చార్జి కాగా నలుగురు చికిత్స పొందుతున్నారు. గిలియన్ బార్ సిండ్రోమ్ లక్షణాలు ఉన్నవారు కాకినాడ జీజీహెచ్‌కు రావాలని సూపరిండెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి కోరారు.

Similar News

News February 27, 2025

కన్నప్ప మూవీ కొత్త పోస్టర్ విడుదల

image

కన్నప్ప చిత్రం విడుదల తర్వాత శివుడి గురించి ఎవరు ఆలోచించినా అక్షయ్ కుమార్ రూపమే దర్శనమిస్తుందని నటుడు మంచు విష్ణు అన్నారు. కన్నప్ప హిందీ టీజర్ లాంఛ్ ఈవెంట్ సందర్భంగా మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. స్టార్ హీరోల పాత్రలు ఎలా ఉండనున్నాయో ఈ పోస్టర్‌లో దర్శనమిస్తున్నాయి. ఈ చిత్ర టీజర్ మార్చి1న విడుదల అవుతుండగా ఏప్రిల్ 25న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

News February 27, 2025

CT: గెలుపు రుచి ఎరుగని పాకిస్థాన్

image

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆతిథ్య పాకిస్థాన్ ఒక్క విజయం కూడా లేకుండా తమ జర్నీ ముగించింది. దాదాపు 3 దశాబ్దాల తర్వాత ICC టోర్నీ నిర్వహిస్తున్న పాక్ గెలుపు రుచి చూడకుండానే నిష్క్రమించింది. న్యూజిలాండ్, భారత్‌తో జరిగిన మ్యాచుల్లో ఘోర ఓటమిపాలై, బంగ్లాతో జరగాల్సిన మ్యాచు వర్షం కారణంగా రద్దైంది. పాక్ తలరాతను చూసి ఆ దేశ అభిమానులు నిట్టూరుస్తున్నారు. కప్ కాదు కదా ఒక్క మ్యాచ్ కూడా విన్ కాలేదంటూ వాపోతున్నారు.

News February 27, 2025

అనకాపల్లి జిల్లాలో 96.19% పోలింగ్

image

అనకాపల్లి జిల్లాలో గురువారం జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో మొత్తం 96.19 శాతం పోలింగ్ నమోదయింది. చీడికాడ, మాకవరపాలెం, రోలుగుంట, ఎస్.రాయవరం మండలాల్లో శతశాతం పోలింగ్ నమోదయింది. దేవరాపల్లిలో 98.41%, మాడుగులలో 96.36%, గొలుగొండలో 95.12%, రావికమతం 98.08 శాతం, బుచ్చయ్యపేటలో 97.06 %, చోడవరంలో 96.73%, కే.కోటపాడులో 95.33%, నర్సీపట్నంలో 95.20%, నాతవరంలో 97.18% పోలింగ్ నమోదయింది.

error: Content is protected !!