News June 4, 2024
నారా లోకేశ్కు 85,140 ఓట్ల ఆధిక్యం
నారా లోకేశ్ 85,140 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తం 22 రౌండ్లకు గానూ, 20 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇప్పటి వరకు లోకేశ్కు 155462 ఓట్లు, వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యకు 70322 ఓట్లు వచ్చాయి. నారా లోకేశ్ గెలుపు ఖాయమైందని ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
Similar News
News September 29, 2024
అమరావతి: సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.లక్ష విరాళం
క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్కు ఆదివారం రూ.లక్ష చెక్కును సీఎం చంద్రబాబుకు అందించారు. వరద బాధితులకు తక్షణ సాయంగా చంద్రబాబు సీఎం రిలీఫ్ ఫండ్ అందిస్తూ ఎంతగానో బాధితులను ఆదుకున్నారని క్రైస్తవ మిషనరీ సంఘం వారు ఆన్నారు. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో సహాయం అందించడం జరిగిందని మిషనరీ బిషప్ అన్నారు.
News September 29, 2024
పల్నాడు: రైలులో భారీ చోరీ
హుబ్లీ నుంచి విజయవాడ వస్తున్న రైలులో శనివారం ఉదయం చోరీ జరిగింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన జ్యువెలర్స్ షాపు నిర్వాహకులు రంగారావు, సతీశ్లకు చెందిన రూ.2.5 కోట్ల విలువైన 3.5 కిలోల బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. రైలు నంద్యాల చేరుకున్న అనంతరం తాము నిద్రపోగా చోరీ జరిగిందని, నంద్యాల రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చామని రంగారావు, సతీశ్ తెలిపారు.
News September 29, 2024
హోంమంత్రి అనిత డిక్లరేషన్ ఇచ్చారా.?: అంబటి
‘హోంమంత్రి శ్రీమతి అనిత గారు శ్రీవారి దర్శనానికి వెళ్లారు డిక్లరేషన్ ఇచ్చారా? లేదా?’ అని గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా ఆమెను ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే తిరుమల దర్శనానికి వెళ్లాలని హోంమంత్రి అనితతో పాటు పలువురు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై అంబటి తనదైన శైలిలో స్పందించారు. డిక్లరేషన్పై కొద్ది రోజులుగా చర్చ నడుస్తోన్న విషయం తెలిసిందే.