News August 26, 2024

అంజన్న భక్తులకు భారం కానున్న పార్కింగ్

image

కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థాన కొండపైన వాహనాల పార్కింగ్ రుసుము వసూలుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. బస్సు, లారీ రూ.50, కారు, జీపు రూ.40, ఆటోకు రూ.30, బైక్‌ రూ.10 వాహన రుసుముగా అధికారులు నిర్ణయించారు. పార్కింగ్‌కు సంబంధించి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలపకుండానే పార్కింగ్ రుసుము ప్రవేశ పెట్టడం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

Similar News

News April 14, 2026

3 నెలలకోసారి అట్రాసిటీ సమావేశాలు: కలెక్టర్

image

దళితులపై అణచివేత ఘటనలను నివారించేందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సమావేశాలను 3 నెలలకోసారి నిర్వహిస్తామని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. కరీంనగరంలోని కోర్టు సమీపంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి సభలో ఆమె మాట్లాడారు. దళితుల సమస్యలను సమగ్రంగా పరిశీలించి తక్షణ పరిష్కారం కోసం అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా ప్రత్యేక కృషి జరుగుతోందని తెలిపారు.

News April 14, 2026

KNR: ‘ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన పెంచుకోవాలి’

image

కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తోన్న అరైవ్ – అలైవ్ రోడ్డు భద్రత వారోత్సవాల వాల్ పోస్టర్లను సోమవారం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. అరైవ్ – అలైవ్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

News April 12, 2026

ఇంటర్ సెకండియర్ RESULTS.. కరీంనగర్‌కు 7వ ర్యాంకు

image

ఇంటర్ 2ndఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. కరీంనగర్(D)లో రెగ్యులర్ విద్యార్థులు 14943 మంది పరీక్షలు రాయగా 11961 మంది పాసై 80.04 శాతంతో స్టేట్‌లోనే 7వ ర్యాంకు వచ్చింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 1320 మందికి 876 మంది పాసై 66.36 శాతంతో 30వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 1837 మందికి 591 మంది పాసై 32.17%తో 16వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 163 మందికి 71 మంది పాసై 43.56%తో 28th ప్లేస్ వచ్చింది.