India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని ప్రధాని మోదీని నిన్న లోక్సభలో పునరుద్ఘాటించారు. కేంద్రం లెక్కల ప్రకారం సౌత్ స్టేట్స్లో సీట్ల పెంపు ఇలా ఉంటుంది.
☞ ఏపీ 25 నుంచి 38కి, ☞ తెలంగాణ 17 నుంచి 26కు, ☞ తమిళనాడు 39 నుంచి 59కి, ☞ కర్ణాటక 28 నుంచి 42కు, ☞ కేరళం 20 నుంచి 30కి పెరగనున్నాయి. మొత్తంగా 5 దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడున్న 129 ఎంపీ సీట్లు 195కి చేరతాయి.

TGలో కులాల మధ్య అసమానతల తీవ్రతను సీపెక్ సర్వే బహిర్గతం చేసింది. రూ.లక్షలోపు వార్షికాదాయం కలిగిన 1.10కోట్ల మంది నిరుపేదల్లో 40% మంది మాదిగ, లంబాడా, ముదిరాజ్, యాదవులేనని పేర్కొంది. విద్యాపరంగానూ అసమానతలు ఉన్నాయంది. కొన్ని కులాల్లో ఉన్నత విద్యావంతులు 35.37% ఉండగా మరికొన్ని కులాల్లో ఇది 5% లోపేనని తెలిపింది. మాదిగ, STల్లోనే అత్యధిక బాలకార్మికులు ఉన్నారని, వడ్డెరలో 55% మంది దినసరి కూలీలని చెప్పింది.

IPLలో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్తో కోల్కతా నైట్రైడర్స్ తలపడనుంది. ఇప్పటిదాకా ఆడిన 4 మ్యాచు(వర్షం వల్ల ఒకటి రద్దు)ల్లోనూ KKR ఘోరంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో నేటి పోరులో ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తోంది. మరోవైపు GT తొలి 2 మ్యాచుల్లో ఓడినా తర్వాత పుంజుకుని 2 గెలిచింది. కెప్టెన్ గిల్, బట్లర్, రషీద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ ఫామ్లో ఉండటంతో ఇదే జోరు కొనసాగించాలని అనుకుంటోంది.

AP: శ్రీవాణి ట్రస్ట్ నిధులతో రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ఆలయాల నిర్మాణం పూర్తి చేయాలని CM చంద్రబాబు ఆదేశించారు. ఒక్కో నియోజకవర్గంలో 25-30 గుళ్లు నిర్మించే అవకాశం ఉందన్నారు. ‘సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం దేవాలయాలకు మాస్టర్ ప్లాన్లు సిద్ధంగా ఉన్నాయి. మిగతా ఆలయాలకూ రూపొందించాలి. వీటి ద్వారా భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి’ అని దేవదాయ శాఖ సమీక్షలో సూచించారు.

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 40-45 డిగ్రీలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో 45 డిగ్రీలు దాటుతాయని, మే, జూన్లో ఎండలు మరింత తీవ్రమవుతాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది వేసవి సుదీర్ఘంగా ఉంటుందని చెబుతున్నారు. వాతావరణ మార్పులతో వర్షాలు కురిస్తే తప్ప హీట్ నుంచి ఉపశమనం లభించదని పేర్కొంటున్నారు. నిన్న APలోని 215 మండలాల్లో 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

లోక్సభలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి డీలిమిటేషన్ బిల్లుపై సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరగనుంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు సిద్ధమయ్యాయి. అటు బిల్లు ఆమోదం పొందడానికి కావాల్సిన 360 ఓట్లు కూడగట్టేందుకు అధికార ఎన్డీఏ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇక మహిళా రిజర్వేషన్ బిల్లుపై LSలో అర్ధరాత్రి ఒంటిగంట వరకు చర్చ జరిగింది.

డీలిమిటేషన్ బిల్లు చట్టంగా మారితే లోక్సభలో ప్రతిపక్షాల గొంతు మూగబోతుందని MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ‘ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ, తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు తక్కువ సీట్లు వస్తాయి. సౌత్ స్టేట్స్పై నార్త్ పెత్తనం చేస్తుంది. దక్షిణాది ఇస్తే ఉత్తరాది ఖర్చు చేస్తుంది. దేశ GDPలో 30%, పన్ను రాబడిలో 21 % సౌత్ నుంచే వస్తోంది. సుపరిపాలన చేసినందుకు ఈ శిక్ష’ అని మండిపడ్డారు.

హీనగుణమువాని నిలు సేరనిచ్చిన
ఎంతవానికైన నిడుము గలుగు
ఈగ కడుపు జొచ్చి యిట్టట్టు చేయదా?
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: చెడ్డవాడిని నమ్మి ఇంట్లో ఆశ్రయమిస్తే వాడు ఎప్పటికైనా మనకు అపకారం చేస్తాడు. కడుపులోకి వెళ్లిన ఈగ ఇబ్బంది పెట్టినట్లుగా నీచుడు ప్రవర్తిస్తాడు. అందుకే దుష్టులకు సాయం చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
<<-se>>#PADHYAM<<>>

హీనగుణమువాని నిలు సేరనిచ్చిన
ఎంతవానికైన నిడుము గలుగు
ఈగ కడుపు జొచ్చి యిట్టట్టు చేయదా?
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: చెడ్డవాడిని నమ్మి ఇంట్లో ఆశ్రయమిస్తే వాడు ఎప్పటికైనా మనకు అపకారం చేస్తాడు. కడుపులోకి వెళ్లిన ఈగ ఇబ్బంది పెట్టినట్లుగా నీచుడు ప్రవర్తిస్తాడు. అందుకే దుష్టులకు సాయం చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
<<-se>>#PADHYAM<<>>

TG: రాష్ట్రంలో కిడ్నీ బాధితుల కోసం కొత్తగా 79 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ద్వారా అదనంగా 416 బెడ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 102 డయాలసిస్ సెంటర్లు ఉండగా, వాటిలో 15,600 మంది పేషంట్లు సేవలు పొందుతున్నారు. మరోవైపు 67 పాత సెంటర్లలో వెయిటింగ్ టైమ్ తగ్గించేందుకు కొత్తగా 155 మెషీన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Sorry, no posts matched your criteria.