India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ధురంధర్-2 బాక్సాఫీసు వద్ద రికార్డులు బద్దలు కొడుతోంది. మొదటిరోజే ₹102.55కోట్ల నెట్ సాధించిన ఈ చిత్రం ఒక్క హిందీ వర్షన్తోనే ₹99.10Cr రాబట్టింది. బాలీవుడ్ సినిమాల్లో ఇదే అత్యధికం. ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 (₹275.2కోట్లు) తర్వాత బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన రెండో భారతీయ సినిమాగా ధురంధర్-2 (₹236.63Cr) నిలిచింది. పెయిడ్ ప్రివ్యూల్లో OG (₹25కోట్లు)ని బీట్ చేసి ₹43కోట్లు వసూలు చేసింది.

AP: రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబును పౌరసరఫరాల కమిషనర్గా నియమించింది. ఆయన స్థానంలో CRDA కమిషనర్గా విజయరామరాజు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక మార్కాపురం కలెక్టర్గా విజయ సునీత, పోలవరం కలెక్టర్గా దినేశ్ కుమార్ నియమితులయ్యారు.

AP, TGలో ఖాళీగా ఉన్న మెడికల్ సీట్ల భర్తీపై కాలేజీల యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. FEB 28తో కౌన్సెలింగ్ ముగియగా ఏపీలో 246, టీజీలో 377 పీజీ సీట్లు భర్తీ కాలేదని తెలిపాయి. కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉన్నప్పటికీ కౌన్సెలింగ్ గడువును పొడిగించలేదన్నాయి. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ సోదరుల్లా ఉండాలి. మంచి సంబంధాలు ఏర్పర్చుకోండి. ముస్లింల మధ్య విభేదాలు రాకుండా చూడాల్సిన బాధ్యత మీపై ఉంది. ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నా’ అని ఖమేనీ చెప్పినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దవుతాయనే ప్రచారంపై విద్యా కమిషన్ OSD డా.జీనత్ క్లారిటీ ఇచ్చారు. ఇంతవరకు పదోతరగతి బోర్డు ఎగ్జామ్స్ రద్దు చేయమని ఎక్కడా సిఫార్సు చేయలేదని స్పష్టం చేశారు. కేవలం 11వ తరగతి (ఇంటర్ ఫస్టియర్) పబ్లిక్ పరీక్షల రద్దుకే ప్రతిపాదన చేసినట్లు పేర్కొన్నారు. SSC బోర్డు, ఇంటర్ బోర్డు (BIE) విలీనానికి కమిషన్ సిఫార్సు చేసిందని తెలిపారు. తప్పుడు వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దని కోరారు.

మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ బీసీసీఐ కామెంట్రీ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా బోర్డుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘23 ఏళ్లుగా పెద్ద మ్యాచ్లకు టాస్ వేయడం, అవార్డు ప్రజెంటేషన్లకు నన్ను వాడుకోకుండా BCCI వివక్ష చూపింది. నా పాత్రను పరిమితం చేసింది. నా తర్వాత వచ్చిన వాళ్లకు అవకాశాలు వస్తున్నాయి. ఆత్మ గౌరవాన్ని కోల్పోయి పనిచేయలేను’ అని SMలో పోస్టులు చేశారు.

మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ బీసీసీఐ కామెంట్రీ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా బోర్డుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘23 ఏళ్లుగా పెద్ద మ్యాచ్లకు టాస్ వేయడం, అవార్డు ప్రజెంటేషన్లకు నన్ను వాడుకోకుండా BCCI వివక్ష చూపింది. నా పాత్రను పరిమితం చేసింది. నా తర్వాత వచ్చిన వాళ్లకు అవకాశాలు వస్తున్నాయి. ఆత్మ గౌరవాన్ని కోల్పోయి పనిచేయలేను’ అని SMలో పోస్టులు చేశారు.

యూరియా రేట్లు పెంచుతున్నారని వస్తున్న వార్తలను కేంద్రం ఖండించింది. ఇలాంటి ప్రతిపాదనేదీ లేదని స్పష్టం చేసింది. యూరియాను సమర్థంగా వాడేందుకు, భూసారాన్ని కాపాడటానికి వీలుగా కొన్ని రకాల బస్తాల పరిమాణాన్ని గతంలోనే కుదించామని తెలిపింది. ప్రస్తుతం 45కేజీల నీమ్ కోటెడ్ యూరియా ధర రూ.242, 40 కేజీల సల్ఫర్ కోటెడ్ యూరియా రేటు రూ.254గా ఉందంది.

యూరియా రేట్లు పెంచుతున్నారని వస్తున్న వార్తలను కేంద్రం ఖండించింది. ఇలాంటి ప్రతిపాదనేదీ లేదని స్పష్టం చేసింది. యూరియాను సమర్థంగా వాడేందుకు, భూసారాన్ని కాపాడటానికి వీలుగా కొన్ని రకాల బస్తాల పరిమాణాన్ని గతంలోనే కుదించామని తెలిపింది. ప్రస్తుతం 45కేజీల నీమ్ కోటెడ్ యూరియా ధర రూ.242, 40 కేజీల సల్ఫర్ కోటెడ్ యూరియా రేటు రూ.254గా ఉందంది.

AP: శ్రీకాకుళం నుంచి నేరుగా HYD, తిరుపతికి రైలు సర్వీసుల ఏర్పాటే తన లక్ష్యమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం(D) హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్లో హాల్ట్ మంజూరైన 3 రైళ్లను ఆయన ప్రారంభించారు. 45 రోజుల్లోనే 6 రైల్వే స్టాప్లకు అనుమతి రావడం గర్వకారణమన్నారు. రవాణా వ్యవస్థను మరింత బలపరిచి, ఉపాధి అవకాశాలనూ పెంచే దిశగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.