India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ముందుగా పశువుల నుంచి వచ్చే పేడను ఒక దగ్గర వేయాలి. అందులో కాస్త తేమ ఉండేందుకు కొద్దిగా నీళ్లను చల్లుతూ ఉండాలి. పేడ బాగా మగ్గాలంటే కుప్పపై గాలి చొరబడకుండా ప్లాస్టిక్ కవరును గట్టిగా కప్పి ఉంచాలి. ఇలా 2 నుంచి 3 నెలల పాటు ఉంచి మధ్యలో అప్పుడప్పుడు కుప్పను పైకి కిందకు తిరగేయాలి. దీని వల్ల ఎరువు సమానంగా కుళ్లి మగ్గుతుంది. ఇలా బాగా మగ్గిన పశువుల ఎరువును వాడితే నేలసారం పెరిగి అధిక దిగుబడులు వస్తాయి.

పుచ్చ పంటను సాగు చేసేటప్పుడు కాయ తీగను కాలితో తంతే అది మరింత బలంగా వ్యాపిస్తుందని ఒక నమ్మకం. అదే గుమ్మడికాయకు చిన్న దెబ్బ తగిలినా లోపల కుళ్లి పోతుందట. నిజ జీవితంలో కూడా కొందరు వ్యక్తులు కష్టాలు, విమర్శలు ఎదురైనా వాటిని సానుకూలంగా మార్చుకొని పుచ్చకాయలా మరింత ఉత్సాహంతో ఎదుగుతారు. మరి కొందరు వ్యక్తులు చిన్నపాటి కష్టాలకే గుమ్మడికాయలా కుంగిపోయి, ధైర్యం కోల్పోతారని ఈ సామెత చెబుతుంది.

శుక్ర జపం అంటే శుక్రుడికి సంబంధించి ‘ఓం శుక్రాయ నమః’ అనే మంత్రాన్ని పఠించే ప్రక్రియ. ఇది మనస్సును శాంతపరుస్తుంది. ఈ జప సాధనతో మెదడులోని ఆందోళనలు తగ్గుతాయి. సహనం పెరుగుతుంది. ప్రేమ గుణం వృద్ధి చెందుతుంది. క్రమం తప్పకుండా ఈ మంత్రాన్ని జపిస్తే జాతకంలోని శుక్రుడి ప్రభావం బలపడుతుందని నమ్మకం. సంబంధ బాంధవ్యాల్లో మధురత పెరుగుతుందని చెబుతారు. మానసికంగా సిద్ధం చేసి, సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనేలా చేస్తుంది.

శుక్ర జపాన్ని ప్రశాంత ప్రదేశంలో చేయాలి. వీలైతే తెల్లని దుస్తులు ధరించాలి. ఇందుకు ఉదయం/సాయంత్రం వేళలు అనుకూలం. కళ్లు మూసుకుని మంత్రాన్ని శ్రద్ధగా పఠించాలి. 108 పూసల జపమాల ఉంటే దాని సాయంతో వాటిని లెక్కిస్తూ జపించాలి. ఈ సాధనతో అంతర్గత మార్పు మొదలవుతుంది. క్రమంగా నిర్ణయాలు మెరుగుపడతాయి. బంధాలు బలపడతాయి. ఈ ప్రక్రియ మనల్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. బయట ప్రపంచపు ఆనందాన్ని అనుభూతి చెందేలా చేస్తుంది.

ప్రపంచంలోనే అమెరికా శక్తిమంతమైన దేశమని డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేశారు. తన మొదటి పదవీకాలంలో కొత్త, పునరుద్ధరించిన అణ్వాయుధాలతో మిలిటరీని పునర్నిర్మించినట్లు తెలిపారు. ఇరాన్తో చర్చల నేపథ్యంలో చాలా కాలం పాటు నిలిచే ఉండేలా అధునాతన, నూతన ఒప్పందంపై న్యూక్లియర్ నిపుణులు పనిచేయాలన్నారు. భారత్-పాకిస్థాన్, రష్యా-ఉక్రెయిన్, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య అణుయుద్ధాలను ఆపినట్లు మరోసారి గొప్పలు చెప్పారు.

తమిళనాడులోని తంజావూరు(D), నల్లూర్లో ఉన్న కల్యాణ సుందరేశ్వర ఆలయం అతి ప్రాచీనమైనది. చోళుల కాలంలో నిర్మించిన ఈ ఆలయంలోని శివలింగం రోజుకు 5 రంగులు (నలుపు, తెలుపు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ) మారుతాయి. 1,000 ఏళ్ల చరిత్ర గల ఈ క్షేత్రంలో శివుడిని, మురుగన్ను కొలుస్తారు. ఇక్కడి గర్భగుడిలో బంగారంతో అలంకరించిన శివలింగం ఉంటుంది. ప్రవేశ ద్వారం వద్ద గంధపు అభిషేకం చేసే మరో లింగం ఉంటాయి.

ఈ నెల 28న ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోనుంది. బృహస్పతి(గురు), బుధుడు, యురేనస్, నెప్ట్యూన్, శుక్రుడు, శని ఒకే దగ్గర కనిపించనున్నాయి. దీనిని గ్రహాల పరేడ్గా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. సూర్యాస్తమయం తర్వాత శుక్రుడు, బుధుడు, శని గ్రహాలను పశ్చిమ దిశలో టెలిస్కోప్తో చూసే అవకాశం ఉంది. వీటికి సమీపంలోనే నెప్ట్యూన్, యురేనస్ గ్రహాలను చూడవచ్చు. ఇక బృహస్పతి చంద్రుడి సమీపంలో నేరుగా కనిపించనుంది.

మూడేళ్లుగా తాను SMలో వేధింపులు ఎదుర్కొంటున్నట్లు నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రవీనా రవి పోస్ట్ చేశారు. తనతోపాటు కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని IGలో ఆమె కోరారు. ఈ విషయమై చట్టపరంగా వెళ్లినా వేధింపులు ఆగలేదన్నారు. సబరిష్ అనే వ్యక్తి తన సోదరుడితో కలిసి నకిలీ ఖాతాల ద్వారా అసభ్యకర సందేశాలు పంపిస్తున్నట్లు తెలిపారు. లవ్ టుడేలో నటించిన రవీనా త్రిష, దీపికా పదుకొనే, సమంత వంటి స్టార్లకు డబ్బింగ్ చెప్పారు.

కొన్ని రోజుల క్రితమే ప్రియుడితో అనూహ్య పరిస్థితుల్లో పెళ్లి రద్దయ్యి గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు క్రికెటర్ స్మృతి మంధాన. దీనిపై పలు రకాలుగా ప్రచారం జరిగినా ఆమె పట్టించుకోలేదు. తిరిగి కొన్ని రోజులకే బ్యాట్ పట్టారు. శ్రీలంకతో సిరీస్లో ఫర్వాలేదనిపించినా WPLలో ఆర్సీబీ సారథిగా సత్తా చాటారు. సీజన్లో అత్యధిక పరుగులు చేయడమే కాకుండా ఫైనల్లో POTMగా నిలిచి అసలైన ఛాంపియన్ అనిపించుకున్నారు.

✒ 1890: స్వాతంత్ర్య సమర యోధుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ జననం ✒ 1931: సమరయోధుడు మోతిలాల్ నెహ్రూ మరణం ✒ 1932: రచయిత భమిడిపాటి రామగోపాలం జననం ✒ 1947: ప్రముఖ రచయిత్రి కె.వి.కృష్ణకుమారి జననం ✒ 1956: AP అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్ ప్రతిభా భారతి జననం ✒ 2008: హాస్యనటి కల్పనా రాయ్ మరణం ✒ 2022: సింగర్ లతా మంగేష్కర్ మరణం(ఫొటోలో)
Sorry, no posts matched your criteria.