News July 11, 2025

తుది శ్వాస వరకు సనాతన ధర్మం కోసం పనిచేస్తా: రాజాసింగ్

image

TG: తన <<17030713>>రాజీనామాను<<>> BJP ఆమోదించడంపై రాజాసింగ్ స్పందించారు. ‘ప్రజా సేవ చేసేందుకు, హిందుత్వాన్ని కాపాడేందుకు 11yrs క్రితం BJPలో చేరాను. నన్ను నమ్మి 3 సార్లు MLA టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. TGలో BJP ప్రభుత్వం రావాలని కార్యకర్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారి బాధేంటో ఢిల్లీ పెద్దలకు అర్థమయ్యేలా చెప్పలేకపోయానేమో. తుది శ్వాస వరకు సనాతన ధర్మాన్ని రక్షించేందుకు పనిచేస్తా’ అని ట్వీట్ చేశారు.

News July 11, 2025

HCA అధ్యక్షుడే కీలక సూత్రధారి: CID

image

HCA అవకతవకల కేసు వ్యవహారంలో CID దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న ఐదుగురిని కస్టడీలోకి ఇవ్వాలని మల్కాజ్‌గిరి కోర్టులో పిటిషన్ వేసింది. వారిని 10 రోజులపాటు విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. ‘HCAలో అక్రమాలు జరిగాయి. కమిటీ అధ్యక్షుడు జగన్మోహనే కీలక సూత్రధారి. BCCIతోపాటు IPL నుంచి వచ్చిన నిధులను దుర్వినియోగం చేశారు’ అని CID పేర్కొంది. ఈ పిటిషన్‌పై కోర్టు ఇవాళ విచారించనుంది.

News July 11, 2025

భారత్‌పై 11వ సెంచరీ బాదిన రూట్

image

భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ENG స్టార్ బ్యాటర్ రూట్ సెంచరీతో చెలరేగారు. రెండో రోజు తొలి బంతికే ఫోర్ కొట్టి శతకం పూర్తి చేశారు. భారత్‌పై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా స్మిత్ సరసన చేరారు. 60 ఇన్నింగ్స్‌లలో 11 సెంచరీలు చేశారు. మొత్తంగా 37 సెంచరీలు చేసి ద్రవిడ్, స్మిత్(36)ను అధిగమించి టాప్ 5లో నిలిచారు. మరోవైపు బుమ్రా బౌలింగ్‌లో స్టోక్స్(44) ఔటయ్యారు. ప్రస్తుతం ENG స్కోర్ 265/5.

News July 11, 2025

యాపిల్ ఉద్యోగికి ₹1,714 కోట్లు చెల్లించిన మెటా!

image

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అగ్రగామిగా నిలిచేందుకు మెటా CEO మార్క్ ఉద్యోగులకు కోట్లు కుమ్మరిస్తున్నారు. తాజాగా యాపిల్ కంపెనీలోని అగ్రశ్రేణి AI నిపుణుడైన రూమింగ్ పాంగ్‌ను మెటా నియమించుకుంది. తమ ‘సూపర్ ఇంటెలిజెన్స్’ గ్రూపులో పాంగ్‌ను చేర్చినట్లు తెలిపింది. దీనికోసం ఆయనకు మెటా ఏడాదికి $200M( ₹1,714కోట్లు) చెల్లించనుండడం టెక్ యుగంలో చర్చనీయాంశమైంది. ఈ ప్యాకేజీ ఇచ్చేందుకు యాపిల్ ఇష్టపడలేదు.

News July 11, 2025

2 దేశాలకు ఆడిన అరుదైన క్రికెటర్ రిటైర్

image

రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన పీటర్ మూర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై పలికారు. 35 ఏళ్ల మూర్ 2014 నుంచి 2019 వరకు జింబాబ్వే తరఫున ఆడారు. ఆ దేశం తరఫున 49 వన్డేలు, 21 టీ20లు, 8 టెస్టులు ఆడి 1,700కుపైగా పరుగులు చేశారు. ఆ తర్వాత ఐర్లాండ్‌కు వలస వెళ్లి 7 టెస్టులు ఆడారు. ఐర్లాండ్ తరఫున వన్డే వరల్డ్ కప్ ఆడాలన్న తన కోరిక నెరవేరకుండానే వీడ్కోలు పలికారు. తన చివరి మ్యాచ్ జింబాబ్వేపైనే ఆడడం విశేషం.

News July 11, 2025

HCA అవకతవకలపై రంగంలోకి దిగిన ఈడీ

image

TG: HCA <<17021009>>అవకతవకల <<>>వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగింది. HCA కేసు వివరాలు ఇవ్వాలని సీఐడీకి లేఖ రాసింది. FIR, రిమాండ్ రిపోర్టులు, వాంగ్మూలాలు ఇవ్వాలని కోరింది. సీఐడీ నుంచి వివరాలు రాగానే కేసు నమోదు చేయాలనే ఆలోచనలో ఈడీ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా HCAలో నిధుల గల్లంతు, నకిలీ పత్రాలతో జగన్మోహన్ ఎన్నిక, ప్లేయర్ల ఎంపికలో అవకతవకలు వంటి అభియోగాలపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది.

News July 11, 2025

జురెల్ బ్యాటింగ్ చేయవచ్చా?

image

రిషభ్ పంత్ గాయంపై ఇంకా అప్డేట్ రాలేదు. ఒకవేళ ఆయన తిరిగి ఆటలోకి రాకుంటే టీమ్ ఇండియా 10 మంది బ్యాటర్లతోనే ఆడాల్సి ఉంటుంది. ఐసీసీ రూల్స్ ప్రకారం సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ బౌలింగ్, బ్యాటింగ్ చేయలేడు. అంపైర్ అనుమతితో కీపింగ్ మాత్రమే చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. కేవలం కంకషన్ (తలకు గాయం) అయితేనే సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ బ్యాటింగ్/బౌలింగ్ చేయగలడు. కానీ పంత్ వేలికి గాయంతో జురెల్ వచ్చారు.

News July 11, 2025

రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ: ఉత్తమ్

image

TG: సీఎం రేవంత్ చేతుల మీదుగా ఈ నెల 14న కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. దాదాపు 5 లక్షల కొత్త కార్డులు ఇస్తున్నామని చెప్పారు. కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం జరుగుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎప్పుడైనా తెల్ల రేషన్ కార్డులిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే రూ.13వేల కోట్లతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నామన్నారు.

News July 11, 2025

ఒక్క MLA అయినా రైతులను పరామర్శించాడా?: పేర్ని నాని

image

AP: చంద్రబాబు ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. మామిడి కొనుగోళ్లపై మంత్రులు అధికారులు తలో మాట చెబుతున్నారని ఆరోపించారు. ‘మామిడి, పొగాకు, మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఒక్క ఎమ్మెల్యే అయినా వారిని పరామర్శించారా? రైతులను పరామర్శించడానికి జగన్ వెళ్తుంటే అడ్డుకుంటారా? కొంతమందికి కూలీ ఇచ్చి మరీ జగన్‌ను తిట్టిస్తున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News July 11, 2025

బీసీలతో కవితకు ఏం సంబంధం?: మహేశ్ గౌడ్

image

TG: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వడం తమ <<17024394>>విజయమని <<>>BRS MLC కవిత చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పందించారు. ‘బీసీ రిజర్వేషన్లతో కవితకు ఏం సంబంధం? మేం చేసిన దానికి కవిత రంగులు పూసుకోవడం ఏంటి? ఆమెను చూసి జనం నవ్వుకుంటున్నారు. గత పదేళ్లు కేసీఆర్ ఏం వెలగబెట్టారని కవిత బీసీ పాట పాడుతున్నారు? ఇది రాహుల్ ఎజెండా, రేవంత్ నిబద్ధత’ అని ఆయన స్పష్టం చేశారు.