Hyderabad

News April 20, 2026

కొడంగల్‌: CM ఇలాకాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రూ.224 కోట్లతో 450 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని పెద్ద సర్కార్ దవాఖానాలైన గాంధీ (2,000+ పడకలు), ఉస్మానియా (1,168+ పడకలు) తర్వాత, ప్రాంతీయ స్థాయిలో ఇంతటి ఆధునిక వైద్యశాల రావడం ఇదే తొలిసారి. ఈ భారీ నిర్మాణం పూర్తయితే కొడంగల్‌తో పాటు పరిసర జిల్లాలకు ఎంతో ఉపయోగపడనుంది.

News April 20, 2026

కొడంగల్‌: CM ఇలాకాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రూ.224 కోట్లతో 450 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని పెద్ద సర్కార్ దవాఖానాలైన గాంధీ (2,000+ పడకలు), ఉస్మానియా (1,168+ పడకలు) తర్వాత, ప్రాంతీయ స్థాయిలో ఇంతటి ఆధునిక వైద్యశాల రావడం ఇదే తొలిసారి. ఈ భారీ నిర్మాణం పూర్తయితే కొడంగల్‌తో పాటు పరిసర జిల్లాలకు ఎంతో ఉపయోగపడనుంది.

News April 20, 2026

HYDలో త్వరలో మరో IVF సెంటర్

image

HYD హైకోర్టు సమీపంలోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో త్వరలో IVF కేంద్రం అందుబాటులోకి రానుంది. గాంధీ ఆసుపత్రిలో IVF సెంటర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఇక్కడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు DME నరేందర్ కుమార్ తెలిపారు. సుమారుగా 490 పడకల సామర్థ్యంతో, డాక్టర్లతో అద్భుతమైన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయడం, పసిపిల్లలకు వైద్యం, పిల్లల తల్లులకు అడ్వాన్స్‌డ్ వైద్యం అందించనున్నారు.

News April 20, 2026

HYD: భారీగా పెరిగిన గుడ్ల ధరలు

image

HYDలో కోడి గుడ్ల ధరలు భారీగా పెరిగాయి. 10రోజుల క్రితం ₹140 ఉన్న ధరలు ఒక్కసారిగా ఎగబాకి వినియోగదారులకు భారంగా మారాయి. ప్రస్తుతం ఉప్పల్, తార్నాక, ఎల్బీనగర్, కాచిగూడ ప్రాంతాల్లో 30 గుడ్లు ₹170- ₹185 వరకు అమ్ముడవుతున్నాయి. డిమాండ్ పెరగడం, సరఫరా తగ్గడం ప్రధాన కారణాలుగా వ్యాపారులు చెబుతున్నారు. ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మీ ఏరియాలో గుడ్ల రేట్లు పెరిగాయా? కామెంట్ చేయండి.

News April 20, 2026

RR: కుర్చీలు ‘వెయిటింగ్’.. జనం ‘రోస్టింగ్’

image

కొన్ని రోజులుగా ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో ప్రజలు త్వరగా పనులు ముగించుకొని ఇల్లు చేరాలనుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదుల కోసం వచ్చే ప్రజలు ఉ.10 నుంచి పడిగాపులు కాస్తున్నారు. ఉ.11 గంటలు దాటినా అధికారులు రాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు సమయపాలన పాటిస్తే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన తిరిగి వెళ్లడానికి ఆస్కారం ఉంటుందని అంటున్నారు.

News April 20, 2026

HYD: పెట్రోల్ బంకుల్లో ఇవి లేవా? నిలదీయండి

image

HYD పెట్రోల్ బంకుల్లో మనకు ఉచిత మంచినీరుతో పాటు, ఫ్రీగా ఎయిర్, నైట్రోజన్ అందించాలని నిబంధనలు ఉన్నాయి. కంపెనీ టెలిఫోన్ నంబర్లు, టాయిలెట్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ సేఫ్టీ కోసం తగిన ఏర్పాట్లు అందుబాటులో ఉంచాలని IOCL సహా అన్ని కంపెనీల నిబంధనలలో పొందుపరిచారు. నగరంలో అనేక చోట్ల ఇవి కనిపించవు. IOCL: 1800-2333-555, HPCL: 1800-2333-555, BPCL: 1800-22-4344 నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించాయి.

News April 20, 2026

HYD: పిల్లలు కలగటం లేదా? ఇక్కడికి రండి

image

పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగక దిగులు చెందుతున్నారా? ఆ చింతన వదిలేయండి. నమ్మకంతో HYD గాంధీ ఆస్పత్రిలో IVF(సంతాన సాఫల్య కేంద్రానికి) రావాలని డా.ఇందిరా సూచిస్తున్నారు. అద్భుతమైన చికిత్స అందిస్తున్నామని, IVF సెంటర్ ప్రారంభించినప్పటి నుంచి సుమారుగా 40 శాంపిల్స్ సేకరించి, 17 మందికి IVF వైద్యం ప్రారంభించినట్లుగా ఆమె తెలిపారు. వీరిలో ఏడుగురికి పాజిటివ్ ఫలితం వచ్చిందన్నారు.
#SHARE IT

News April 20, 2026

HYD: ప్రభుత్వం చేస్తున్న ప్లాన్ ఇదే!

image

HYDలో ట్రాఫిక్ కష్టాలు తగ్గించేందుకు MMTSలో ‘జీరో ఫేర్’ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. టికెట్ ఉచితం చేస్తే ప్రయాణికుల సంఖ్య రోజుకు 1.2 లక్షలకు చేరుతుందని రవాణా శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం MMTS ద్వారా ఏడాదికి రూ.10 కోట్ల ఆదాయమే వస్తోంది. ఈ స్వల్ప మొత్తాన్ని ప్రభుత్వమే భరించి, ప్రజలను మళ్లీ రైలు ప్రయాణం వైపు మళ్లించడం ద్వారా రోడ్లపై రద్దీని తగ్గించవచ్చని సర్కార్ భావిస్తోంది.

News April 20, 2026

HYD: ప్రభుత్వం చేస్తున్న ప్లాన్ ఇదే!

image

HYDలో ట్రాఫిక్ కష్టాలు తగ్గించేందుకు MMTSలో ‘జీరో ఫేర్’ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. టికెట్ ఉచితం చేస్తే ప్రయాణికుల సంఖ్య రోజుకు 1.2 లక్షలకు చేరుతుందని రవాణా శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం MMTS ద్వారా ఏడాదికి రూ.10 కోట్ల ఆదాయమే వస్తోంది. ఈ స్వల్ప మొత్తాన్ని ప్రభుత్వమే భరించి, ప్రజలను మళ్లీ రైలు ప్రయాణం వైపు మళ్లించడం ద్వారా రోడ్లపై రద్దీని తగ్గించవచ్చని సర్కార్ భావిస్తోంది.

News April 20, 2026

రాజేంద్రనగర్‌లో ‘Ecorise’ ప్రాజెక్ట్ గ్రాండ్ లాంచ్

image

శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌ రాజేంద్రనగర్‌లో ‘Ecorise’ ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ను ఏప్రిల్ 19న ప్రారంభించింది. శ్రీత్రిదండి చిన్న జీయర్ స్వామి లాంచ్ చేశారు. 5.24 ఎకరాల్లో 3, 4 BHK వాస్తు ఫ్లాట్లు 2250–4695 చ.అ.లో అందుబాటులో ఉన్నాయి. ORR, గచ్చిబౌలి, ఎయిర్‌పోర్ట్‌కు సులభ కనెక్టివిటీ ఉంది. ప్రత్యేక లాంచ్ ధరలు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలకు 9458799799 సంప్రదించండి.