Prakasam

News November 7, 2025

రేపు ప్రకాశం జిల్లాలో పాఠశాలలకు సెలవు రద్దు

image

మొంథా తుఫాను కారణంగా జిల్లాలో గత నెలలో ఐదు రోజులపాటు పాఠశాలలకు సెలవులు ఇచ్చిన కారణంగా ఈనెల 8న రెండో శనివారం అన్ని యాజమాన్య పాఠశాలలు యథావిధిగా నిర్వహించాలని DEO కిరణ్ కుమార్ శుక్రవారం తెలిపారు. 2026 మార్చి వరకు ప్రతి రెండో శనివారం పాఠశాలలను నిర్వహించాలన్నారు. పాఠశాలల సిబ్బంది నియమాలు పాటించాలన్నారు.

News November 7, 2025

ఒంగోలు: RTC బస్‌కు తప్పిన ప్రమాదం

image

ఒంగోలు సమీపంలో RTC బస్సుకు పెను ప్రమాదం తప్పింది. నిన్న రాత్రి ఒంగోలు నుంచి కొండపికి ఓ బస్ బయల్దేరింది. చీమకుర్తికి వెళ్తున్న టిప్పర్‌కు పేర్నమిట్ట వద్ద ఓ గేదె అడ్డు వచ్చింది. టిప్పర్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. ఇదే సమయంలో వెనుక వస్తున్న ఆర్టీసీ బస్సు టిప్పర్‌ను ఢీకొట్టింది. బస్సు ముందు భాగం దెబ్బతింది. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

News November 7, 2025

వెలిగొండను ఎలా అంకితం చేశావు జగన్: నిమ్మల

image

వెలిగొండ ప్రాజెక్టు పనులు ఎక్కడివి అక్కడే ఉండిపోయాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అయినప్పటికీ ప్రాజెక్ట్ పూర్తి చేశానంటూ ఎన్నికల సమయంలో జగన్ జాతికి అంకితం ఎలా చేశారని ప్రశ్నించారు. దోర్నాల మండలంలో ప్రాజెక్టు కెనాల్, సొరంగం, తదితర అంశాలను పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట మార్కాపురం ఎమ్మెల్యే కందుల, ఎర్రగొండపాలెం ఇన్‌ఛార్జ్ ఎరిక్షన్ బాబు ఉన్నారు.

News November 7, 2025

ప్రకాశం: భారీగా పెరిగిన పొగాకు ధర.. కానీ!

image

ప్రకాశం జిల్లాలో పొగాకు ధరలు భారీగా పెరిగాయి. మార్చి 10న వేలం ప్రారంభమప్పుడు గరిష్ఠ ధర KG రూ.280గా ఉంది. తర్వాత క్రమంగా పెరిగింది. తుఫాన్ ముందు రూ.315 ఉండగా వారం లోపే ప్రస్తుతం రూ.362కి చేరింది. వేలం ముగింపు వేళ ధర పెంచి.. వచ్చే సీజన్‌లో రైతులు ఎక్కువ సాగు చేసేలా కంపెనీలు కుట్రలు చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. హైగ్రేడ్ ధరలు పెరిగినప్పటికీ లోగ్రేడ్ కేజీ రూ.150 నుంచి రూ.50కి పడిపోవడం గమనార్హం.

News November 7, 2025

మర్రిపూడి: ఆలయ పునర్నిర్మాణానికి రూ.3.55 కోట్ల ప్రతిపాదనలు

image

మర్రిపూడి మండలంలో ఉన్న పృదులగిరి దేవస్థానం పునర్నిర్మాణం కోసం రూ.3.55 కోట్లు మంజూరు కోసం రాష్ట్ర మంత్రి స్వామి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. పవిత్ర పుణ్య క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని దశాబ్దాలుగా భక్తులు కోరుతున్నారు. ఈ ఏడాది ఘాట్ రోడ్ నిర్మాణానికి రూ.4 కోట్లు నిధులు మంజూరు చేయించగా.. ప్రస్తుతం ఆలయ పునర్నిర్మాణానికి రూ.3.55 కోట్లు ప్రతిపాదనలు పంపించడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News November 6, 2025

ప్రకాశం జిల్లాలో 213 వాహనాలకు జరిమానా

image

ప్రకాశం వ్యాప్తంగా బుధవారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. 2,044 వాహనాలను తనిఖీ చేసినట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 213 వాహనాలను గుర్తించి రూ.1.56లక్షల జరిమానా విధించారు. డ్రైవింగ్‌పై పూర్తి దృష్టి కేంద్రీకరించి, ప్రమాదాలు జరగకుండా చూడాలని పోలీసులు సూచించారు.

News November 6, 2025

అధికారులకు ప్రకాశం కలెక్టర్ సూచనలు

image

లోప రహిత ఓటర్ల జాబితా రూపకల్పనే లక్ష్యంగా ఇప్పటినుంచే దృష్టిసారించాలని ప్రకాశం కలెక్టర్ పి.రాజాబాబు సూచించారు. ఈ దిశగా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని ఈఆర్వోలను ఆదేశించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) నిర్వహణపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు ఒంగోలు నుంచి కలెక్టర్ హాజరయ్యారు.

News November 6, 2025

ప్రకాశం: చెరువులో పడి విద్యార్థి మృతి

image

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో విషాదం నెలకొంది. ఈదుమూడి గ్రామానికి చెందిన కటారి అఖిల్(12) ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గ్రామంలోని ఊర చెరువులో పడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న స్థానికులు మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 6, 2025

ఒంగోలు: 10 నుంచి అసెస్మెంట్ పరీక్షలు

image

ప్రకాశం జిల్లాలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఈనెల 10వ తేదీ నుంచి సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తామని DEO కిరణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 9:15 గంటల నుంచి 12.35గంటల వరకు.. 6, 7వ తరగతి విద్యార్థులకు 1.15 గంటల నుంచి 4.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు.

News November 6, 2025

మార్కాపురం జిల్లా ఏర్పాటు ఇలా..!

image

మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి రెవెన్యూ జిల్లాలతో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. కందుకూరు, అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలిపేలా ప్రతిపాదించారు. మర్రిపూడి, పొన్నలూరు, కొండపి, జరుగుమిల్లి, సింగరాయకొండ, టంగుటూరును కందుకూరు డివిజన్‌లోకి మార్చనున్నారు. ముండ్లమూరు, తాళ్లూరు, అద్దంకి నియోజకవర్గంలోని అన్ని మండలాలు కలిపి అద్దంకి డివిజన్‌గా ఏర్పాటు కానుంది. డిసెంబర్ నెలాఖారు లోపల ఈ ప్రక్రియ పూర్తి కానుంది.