India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఒంగోలు మండలం త్రోవగుంట పొగాకు వేలం కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారీయా గురువారం సందర్శించారు. అక్కడ పొగాకు రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కలెక్టర్ను కోరారు. స్పందించిన కలెక్టర్ ఉన్నతాధికారులతో మాట్లాడి రైతులకు న్యాయమైన ధర వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు.
ప్రతి ఏటా 2 నెలల పాటు ఉండే చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాల జీవనం కోసం ఇచ్చే భృతిని రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచినట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. శనివారం ఒంగోలు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మెగా చెక్కును మత్స్యకారులకు అందజేశారు.
మూగజీవుల పాలిట ప్రాణదాతులుగా పశు వైద్యులు అందిస్తున్న వైద్య సేవలు అభినందనీయమని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. శనివారం ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన ప్రపంచ పశువైద్య దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, పశు సంవర్థక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పంపిన సందేశాన్ని వినిపించారు.
కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో శనివారం జిల్లా కలెక్టర్ గనుల శాఖ అధికారులు, 6 ఇసుక స్టాక్ యార్డుదారులతో సమీక్ష నిర్వహించారు. రాబోయే వర్షాకాల దృష్ట్యా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వివిధ డిపోలలో లక్ష మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉంచాలని ఆదేశించారు. అక్రమ ఇసుక రవాణాపై తహశీల్దార్లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో సామాజిక చైతన్య ఉత్సవాలు పేరుతో సంఘం శరణం గచ్చామి హైదరాబాద్ వారిచే అంబేడ్కర్ నాటకాన్ని మే 8న ఒంగోలు అంబేడ్కర్ భవనంలో ప్రదర్శిస్తున్నట్లు కేవీపీఎస్ నాయకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసు ఆవిష్కరించారు. అంబేడ్కర్ నాటిక ప్రదర్శనను తిలకించడానికి అధిక సంఖ్యలో రావాలని కోరారు.
పంచాయతీ రాజ్ విభాగాల అధికారులతో కలెక్టర్ తమీమ్ అన్సారియా శుక్రవారం ఒంగోలులో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పెద్దారవీడు పీఈవో, యర్రగొండపాలెం ఈవో హాజరుకాకపోవడంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. తన అధ్యక్షతన సమావేశం ఉన్నప్పటికీ ఎందుకు రాలేదని, వెంటనే షోకాజ్ ఇవ్వాలని ఆదేశించారు. వై.పాలెంలో వేరే కార్యక్రమం ఉండడం వల్ల ఈవోకు అనుమతి ఇచ్చానని ఎంపీడీవో తెలుపగా, అనుమతి ఎలా ఇస్తావని ఎంపీడీవోకి షోకాజ్ ఇచ్చారు.
పంచాయతీ రాజ్ విభాగాల అధికారులతో కలెక్టర్ తమీమ్ అన్సారియా శుక్రవారం ఒంగోలులో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పెద్దారవీడు పీఈవో, యర్రగొండపాలెం ఈవో హాజరుకాకపోవడంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. తన అధ్యక్షతన సమావేశం ఉన్నప్పటికీ ఎందుకు రాలేదని, వెంటనే షోకాజ్ ఇవ్వాలని ఆదేశించారు. వై.పాలెంలో వేరే కార్యక్రమం ఉండడం వల్ల ఈవోకు అనుమతి ఇచ్చానని ఎంపీడీవో తెలుపగా, అనుమతి ఎలా ఇస్తావని ఎంపీడీవోకి షోకాజ్ ఇచ్చారు.
వీరయ్య చౌదరి హత్య కేసులో కీలకంగా దొరికిన స్కూటీ ఆధారంగా కేసు పురోగతి ఊపందుకుంది. అమ్మనబ్రోలుకు చెందిన వ్యక్తి ఈ హత్యలో కీలకంగా వ్యవహరించినట్లుగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆ గ్రామం పోలీసుల కనుసన్నల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తి ఈ నెల 29వ తేదీన అమెరికాకు వెళ్లటానికి టికెట్స్ కూడా బుక్ చేసుకోగా స్కూటీ ఆధారంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తూ ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కలిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా, పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ పరిశ్రమల శాఖ అధికారులతో, ఎపీఐఐసీ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో అమలు అవుతున్న ఆంధ్రప్రదేశ్ సింగిల్ డెస్క్ పాలసీ 2015, ప్రధానమంత్రి ఉపాధి కల్పన వాటిపై సమీక్ష నిర్వహించారు.
టీడీపీ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో పోలీసులకు క్లూ దొరికింది. వీరయ్యను కత్తులతో పొడిచిన నిందితులు రెండు బైకులు మీద పరారయ్యారు. అందులో ఒకటైన స్కూటర్ను చీమకుర్తి పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు పోలీసులు శుక్రవారం గుర్తించారు. హత్య జరిగిన రోజు రాత్రి నుంచి ఆ స్కూటర్ అక్కడే ఉండటం, దానికి రక్తపు మరకలు అంటుకుని ఉండడంతో క్లూస్ టీం రంగంలో దిగింది. ఆధారాలను సేకరించారు.
Sorry, no posts matched your criteria.