India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహబూబ్నగర్ పిల్లలమర్రి సమీపంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ డాక్టర్ జయప్రద తెలిపారు. బీఎస్సీ, బీకాం, బిజెడ్సీ, బీఏ కోర్సుల్లో చేరాలనుకునే వారు ‘దోస్త్’ (DOST) వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు మూడు సెట్ల జిరాక్స్ పత్రాలు, 8 ఫొటోలతో సంప్రదించాలని ఆమె పేర్కొన్నారు.

మహబూబ్నగర్ జిల్లాలో బాధితులు పోలీస్ స్టేషన్కు రాకుండానే ఇంటి నుంచే ఫిర్యాదు చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందని ఎస్పీ జానకి తెలిపారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, మైనర్లకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ బృందాలకు ఆదేశాలు జారీ చేశామని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతల రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో గండీడ్ మండలం సల్కర్పేటలో 43.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. కోయిలకొండ మండలం సిరివెంకటాపూర్ 43.3, దేవరకద్ర 43.2, చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ 43.0, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 42.6, అడ్డాకుల 42.4, కోయిలకొండ మండలం పారుపల్లి 42.0, చిన్న చింతకుంట 41.8, జడ్చర్ల 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

మహబూబ్నగర్ జిల్లాలో సోమవారం నుంచి పదో తరగతి & ఇంటర్మీడియట్ (తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ) పరీక్షల నిర్వహించనున్నారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్నిపరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డి.జానకి ఆదివారం తెలిపారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లు తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశించారు.

మహబూబ్నగర్ జిల్లాలో సోమవారం నుంచి పదో తరగతి & ఇంటర్మీడియట్ (తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ) పరీక్షల నిర్వహించనున్నారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్నిపరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డి.జానకి ఆదివారం తెలిపారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లు తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశించారు.

మహబూబ్నగర్ జిల్లాలో సోమవారం నుంచి పదో తరగతి & ఇంటర్మీడియట్ (తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ) పరీక్షల నిర్వహించనున్నారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్నిపరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డి.జానకి ఆదివారం తెలిపారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లు తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశించారు.

మహబూబ్నగర్ జిల్లాలో సోమవారం నుంచి పదో తరగతి & ఇంటర్మీడియట్ (తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ) పరీక్షల నిర్వహించనున్నారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్నిపరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డి.జానకి ఆదివారం తెలిపారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లు తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశించారు.

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భూత్పూర్ మండలం కొత్త మొల్గరలో 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ 43.4, గండీడ్ మండలం సల్కర్ పేట 43.3, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 43.2, అడ్డాకుల 43.0, కోయిలకొండ మండలం పారుపల్లి 42.9, కౌకుంట్ల 42.7, మహబూబ్ నగర్ అర్బన్ 42.6, దేవరకద్ర 42.5 ఉష్ణోగ్రత నమోదయింది.

మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ కవి, పండితులు ఆచార్య కమలేకర్ దాగోజీరావు శనివారం ఉదయం కన్నుమూశారు. భగీరథ కాలనీలోని ఆయన నివాసంలో పార్థివదేహాన్ని సందర్శనార్థం ఉంచారు. నేటి సాయంత్రం 4 గంటలకు వీరన్నపేట శివాలయం శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతిపట్ల సాహితీలోకం ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది.

జడ్చర్ల మండలం కోడుగల్ గ్రామ పంచాయతీ పరిధిలోని బిమ్లాగాని తండాకు చెందిన కాట్రావత్ సురేష్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ చదువుతూ ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందాడు. అతడి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ శనివారం పెద్దింటి రవీంద్రనాథ్ జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఆన్లైన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.