Vizianagaram

News July 11, 2025

జిందాల్ రైతుల‌కు చ‌ట్ట‌ప్ర‌కార‌మే ప‌రిహారం: క‌లెక్ట‌ర్

image

జిందాల్ భూముల‌కు సంబంధించి మిగిలిన రైతుల‌కు ప‌రిహారాన్ని వారం రోజుల్లో అందజేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ ఆదేశించారు. జిందాల్‌కు కేటాయించిన‌ భూముల‌కు సంబంధించి విజయనగరంలోని త‌మ ఛాంబ‌ర్‌లో సంబంధిత అధికారుల‌తో శుక్ర‌వారం స‌మీక్షించారు. ఇప్ప‌టివ‌ర‌కు చెల్లించిన ప‌రిహారం, పెండింగ్ బ‌కాయిల‌పైనా ఆరా తీశారు. 28 ఎకరాల అసైన్డ్ భూములకు సంబంధించి 15 మందికి పరిహారం అందజేయాల్సి ఉందని తెలిపారు.

News July 11, 2025

సీజ‌న‌ల్ వ్యాధుల‌ను అరిక‌ట్టాలి: కలెక్టర్

image

సీజ‌న‌ల్ వ్యాధులు విజృంభించ‌కుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వైద్యారోగ్య‌శాఖ అధికారుల‌ను క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేడ్క‌ర్ ఆదేశించారు. రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.విజ‌యానంద్ క‌లెక్ట‌ర్ల‌తో గురువారం వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి, వివిధ అంశాల‌పై స‌మీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సీజ‌నల్ వ్యాధులు వ్యాప్తి చెంద‌కుండా క‌ట్టుధిట్టంగా చ‌ర్య‌లు తీసుకోవాలన్నారు.

News July 11, 2025

అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన

image

విజయనగరంలోని పోలీసు సంక్షేమ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి SP వకుల్ జిందల్ గురువారం శంకుస్థాపన చేశారు. రెండు అంతస్తుల్లో నాలుగు తరగతి గదుల నిర్మాణానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో తక్కువ ఫీజులతో పోలీసుల పిల్లలకు, ఇతర విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని భవనాలు నిర్మిస్తున్నామన్నారు.

News July 10, 2025

VZM: 2,232 పాఠశాలలు, కాలేజీల్లో మీటింగ్

image

విజయనగరం జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ గురువారం జరిగింది. జిల్లాలోని 2,232 పాఠశాలల్లో 2,10,377 మంది విద్యార్ధులు వారి తల్లిదండ్రులతో కలసి పాల్గొన్నారు. అలాగే జిల్లాలోని 180 జూనియర్ కళాశాల్లోనూ ఈ మీటింగ్ జరిగింది. విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు టీచర్లు, లెక్చరర్లు వివరించారు..

News July 10, 2025

VZM: అభ్యంతరాలు ఉంటే చెప్పండి

image

విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను ఆన్‌లైన్‌లో పొందుపరిచామని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ పద్మలీల తెలిపారు. 20 విభాగాల్లో 91 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. 12 విభాగాలకు సంబంధించి స్పీకింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. జాబితా https://vizianagaram.nic.inలో అందుబాటులో ఉందని, అభ్యంతరాలు ఉంటే చెప్పాలని ఆమె కోరారు.

News July 10, 2025

VZM: అగ్నిపథ్‌లో అవకాశాలు

image

అగ్నిపథ్ పథకంలో భాగంగా భారతీయ వాయుసేనలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. 4 ఏళ్ల కాల పరిమితికి అగ్నివీర్(వాయు)గా చేరడానికి అవివాహిత పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ సూచించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జులై 11న ఉదయం 11 గంటలకు ప్రారంభమై, జులై 31న రాత్రి 11 గంటలకు ముగుస్తుందన్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News July 10, 2025

నేరాల నియంత్రణకు ప్రత్యేక నిఘా పెట్టాలి: SP

image

నేరాల నియంత్రణకు నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. బుధవారం విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో మాసాంతర సమీక్ష నిర్వహించారు. ప్రజలకు శక్తి యాప్‌పై అవగాహన చేపట్టాలన్నారు. విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పించేందుకు శక్తి వారియర్స్ టీమ్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు.

News July 9, 2025

గ్రంథాల‌యాల అభివృద్దికి చ‌ర్య‌లు: జేసీ

image

జిల్లాలో గ్రంథాల‌యాల అభివృద్దికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జేసీ, జిల్లా గ్రంథాల‌య సంస్థ ఇన్‌ఛార్జ్ ఎస్‌.సేతు మాధ‌వ‌న్ ఆదేశించారు. జిల్లా గ్రంథాల‌య సంస్థ బ‌డ్జెట్‌ స‌మావేశం జేసీ ఛాంబ‌ర్‌లో బుధవారం జ‌రిగింది. పౌర గ్రంథాల‌యశాఖ డైరెక్ట‌ర్ సూచ‌న‌లు, కేటాయించిన బ‌డ్జెట్‌కు అనుగుణంగా, త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే స‌ర్వ‌స‌భ్య స‌మావేశం గురించి, ప్ర‌స్తుత ఆర్థికసంవ‌త్స‌రంలో చర్యలు గురించి చర్చించారు.

News July 9, 2025

జరజాపుపేట యువకుడిపై పోక్సో కేసు నమోదు: ఎస్‌ఐ

image

నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేటకు చెందిన ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గణేశ్ బుధవారం తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసం చేసినట్లు చెప్పారు. బాలిక ఫిర్యాతో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశామన్నారు.

News July 9, 2025

VZM: అగ్నిప్రమాదం.. ఇళ్లబాట పట్టిన విద్యార్థినులు

image

కొత్తవలస మండలం తుమ్మికాపల్లి KGBVలో మంగళవారం రాత్రి జరిగిన <<16996993>>అగ్ని ప్రమాదం<<>>తో ఆందోళన చెందిన విద్యార్థినిలు ఇళ్ల బాట పట్టారు. 20 రోజుల క్రితం ఇదే పాఠశాలలో అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. వరుస ప్రమాదాల నేపథ్యంలో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చెంది ఇళ్లకు తీసుకెళ్లారు. గతంలో జరిగిన ప్రమాదంపై స్పందించిన మంత్రి లోకేశ్.. ఈసారి ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.