India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దివ్యాంగుల సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ హరేంద్రప్రసాద్ శనివారం నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు. దివ్యాంగుల చట్టాలు పక్కాగా అమలు జరగాలన్నారు. దివ్యాంగ బాలలను పాఠశాలలో చేర్పించాలని సూచించారు. 18 ఏళ్ల లోపు దివ్యాంగుల పెన్షన్ డేటాను సేకరించాలని ఆదేశించారు. జిల్లాలో దివ్యాంగుల పూర్తి సమాచారం సేకరించాలన్నారు. దివ్యాంగుల కోసం అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక ర్యాంపులు నిర్మించాలని సూచించారు.
ఈనెల 30న సింహాచలంలో జరగనున్న చందనోత్సవానికి 151 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను సిద్ధం చేసినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పల నాయుడు తెలిపారు. శనివారం ఆర్టీసీ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. చందనోత్సవానికి కొండపైకి వెళ్లే బస్సులు కండిషన్లో ఉండేలా చూడాలని ఆదేశించారు. గోశాల నుంచి RTC కాంప్లెక్స్, పాత పోస్ట్ ఆఫీస్, RK బీచ్, కొత్తవలస, చోడవరం, అడవివరం, హనుమంతవాక, విజయనగరం నుంచి బస్సులు నడపనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి తొలి ప్రాధాన్యత ఇస్తోందని ఆ శాఖ మంత్రి సత్య కుమార్ వెల్లడించారు. శనివారం ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రాంగణంలో నిర్మించిన నూతన భవన ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు దూరదృష్టితో రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పద్మనాభం మండలంలో ఓ యువకుడు శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. తగరపువలసకు చెందిన అలుగోలు రవీంద్ర (34) పద్మనాభం మండలం తునివలసలోని జగనన్న కాలనీలో ఉంటున్నాడు. మద్యానికి బానిసైన రవీంద్ర జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయినట్లు అతని భార్య పెట్ల వరలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పద్మనాభం పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం తరలించారు.
మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మేడ పైనుంచి పడి ఒకరు మృతి చెందారు. ఇండస్ట్రియల్ కాలనీలో ఉంటున్న గోవింద్ శనివారం మధ్యాహ్నం ఇంటి మేడపై నడుస్తూ ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని కేజీహెచ్కి తరలించారు. మద్యం మత్తులో తూలి పడిపోయినట్లు స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ స్వయం ఉపాధి పథకం కోసం దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు మైనారిటీ కార్పోరేషన్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ షం సున్నిషా బేగం శనివారం తెలిపారు. ఈ పథకం కింద మైనారిటీలకు రూ.లక్ష నుంచి 8 లక్షల రుణంలో 50% సబ్సిడీ మంజూరు చేయబడుతుందన్నారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలలో 21- 55 ఏళ్ల మధ్య బీపీఎల్కు చెందిన వారు మే 25 లోపు https://apobmms.apcfss.in ఈ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మత్స్యకారుల సేవలో’ పథకం 2025-26 కింద జిల్లా నుంచి 12,138 మంది లబ్ధి పొందారు. ఒక్కొక్కరికి రూ.20 వేలు చొప్పున మొత్తం రూ.24,27,60,000ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మెగా చెక్కును లబ్ధిదారులకు శనివారం అందజేశారు. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో శనివారం లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.
GVMCలో ఈనెల 28న జరగనున్న PGRS కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ శనివారం తెలిపారు. మేయర్ ఎన్నిక సోమవారం కానున్నందున GVMC ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం రద్దు చేసినట్లు పేర్కొన్నారు. GVMC జోనల్ కార్యాలయాల్లో యథావిధిగా PGRS ఉంటుందన్నారు. ప్రజలు తమ సమస్యలపై జోనల్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేయాలన్నారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
విశాఖ పోర్ట్ కళ్యాణ మండపంలో శనివారం 15వ రోజ్గార్ మేళా నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఆయన చేతులు మీదుగా 278 మంది అభ్యర్థులకు కేంద్ర నియామక పత్రాలను అందజేశారు. ప్రభుత్వ సేవ, జీవితపు కొత్త ప్రయాణంలో పెద్ద లక్ష్యాలను సాధించడానికి అదే ఉత్సాహంతో పనిచేయాలని వారిని కోరారు. సమాజానికి ఆదర్శంగా ఉండాలని మంత్రి సూచించారు.
సీఎం చంద్రబాబు శ్రీకాకుళం పర్యటన నిమిత్తం శనివారం విశాఖ చేరుకున్నారు. ఆయనకు విశాఖ ఎయిర్ పోర్ట్లో ఎంపీ శ్రీ భరత్,ఎమ్మెల్యే గణబాబు, సీపీ శంఖ బ్రత బాగ్చి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ స్వాగతం పలికారు. అనంతరం విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్లో చంద్రబాబు శ్రీకాకుళం వెళ్లారు. మరల సాయంత్రం విశాఖలో పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు.
Sorry, no posts matched your criteria.