Adilabad

News May 7, 2025

జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ADB SP

image

ప్రస్తుత ఆధునిక సమాజంలో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసగిస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. సైబర్ నేరం జరిగిన వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 లేదా cybercrime.gov.in వెబ్సైట్‌ను సంప్రదించాలని సూచించారు. వారం రోజులలో జిల్లాలో 13 ఫిర్యాదులు నమోదయినట్లు తెలిపారు. ఆన్‌లైన్ మనీ, గేమింగ్, బెట్టింగ్ చేయడం చట్ట విరుద్ధమన్నారు.

News May 7, 2025

ADB కలెక్టర్‌కు జడ్పీ మాజీ ఛైర్ పర్సన్ అభినందన

image

కలెక్టర్ రాజర్షి షాను కలెక్టరేట్‌లో జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ సుహాసిని రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక ప్రధాన మంత్రి ప్రజాస్వామ్య పరిపాలన అవార్డు అందుకున్నందుకు అభినందించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఆమెతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.

News May 7, 2025

ఆదిలాబాద్ కలెక్టర్‌ను కలిసిన సాయి చైతన్య

image

యూపీఎస్సీ ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 68వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికైన ఉట్నూర్‌కు చెందిన గిరిజన యువకుడు సాయి చైతన్య జాదవ్‌ శనివారం కలెక్టర్ రాజర్షి షాను ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా సాయి చైతన్యకు కలెక్టర్ జ్ఞాపిక అందజేసి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు. జిల్లా నుంచి ఐఏఎస్‌కు ఎంపిక కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

News May 7, 2025

ADB: ‘భూభారతి చట్టంతో రైతులకు మేలు’

image

జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్‌లో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. MLA పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షా భూభారతి చట్టం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. దీంతో రైతులకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. DCCB ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, RDO వినోద్ కుమార్, MRO శ్రీనివాస్ తదితరులున్నారు.

News May 7, 2025

నిర్మల్: కాలకృత్యాలకు వెళ్లిన వివాహితపై లైంగిక దాడి

image

నిర్మల్ జిల్లా తానూరు మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మోగ్లిలో కాలకృత్యాలకు వెళ్లిన వివాహితపై ఓ యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలు గాయాలతో ఇంటికి చేరుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. భర్తతో కలిసి గ్రామానికి చెందిన సునీల్‌పై ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 7, 2025

నిర్మల్: కాలకృత్యాలకు వెళ్లిన వివాహితపై లైంగిక దాడి

image

నిర్మల్ జిల్లా తానూరు మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మోగ్లిలో కాలకృత్యాలకు వెళ్లిన వివాహితపై ఓ యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలు గాయాలతో ఇంటికి చేరుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. భర్తతో కలిసి గ్రామానికి చెందిన సునీల్‌పై ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 7, 2025

ADB: ఇలా వెళ్తే కేసులు పెడతాం: DTO

image

ఆదిలాబాద్ లో శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు రవాణా వాహనాలలో ప్రజలని పరిమితికి మించి తీసుకువెళ్తున్న 6 వాహనాలను సీజ్ చేశారు. ఈ క్రమంలో వాహనాలలో ప్రయాణిస్తున్న ప్రజలకి అవగాహన కల్పించారు. రోడ్డు భద్రత నియమాలను పాటించాలని సూచించారు. రవాణా అధికారి రవీందర్ మాట్లాడుతూ.. వాహన యజమానులు సరకు రవాణా వాహనాల్లో ప్రజలను తరలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

News May 7, 2025

ఆదిలాబాద్‌లో 10 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్

image

సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ పి.చంద్రశేఖర్‌కు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ADBలోని తిరుపెల్లిలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ మేరకు పేకాట ఆడుతుండగా సంఘటన స్థలంలో పది మంది పట్టుబడ్డారని సీఐ తెలిపారు. వారి వద్ద నుంచి పది మొబైల్ ఫోన్లు, పేకాట ముక్కలు, రూ.79,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

News May 7, 2025

కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి: ఎస్పీ

image

పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల దర్యాప్తును వేగవంతం చేసి ప్రజలకు సత్వర నయం చేకూర్చేలా చూడాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశించారు. శుక్రవారం ఆదిలాబాద్ లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో నెలవారీ నేర సమీక్షలో ఎస్పీ పాల్గొని సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్లలో ఉన్న 16 వర్టికల్స్ పనితీరు సక్రమంగా ఉండాలన్నారు. వాటిని ప్రతిరోజు పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. ఏఎస్పీ సురేందర్ ఉన్నారు.

News April 25, 2025

ADB: కట్టుకున్నవారే కడతేర్చుతున్నారు

image

కట్టుకున్నవారే కాలయముళ్లుగా మారి కడతేరుస్తున్నారు. బంధాలను మర్చిపోయి పిల్లలను తల్లి ప్రేమకు దూరం చేస్తున్నారు. ADB (D) గుడిహత్నూర్‌కు చెందిన మారుతి భార్యపై కక్ష పెంచుకుని కత్తితో హతమార్చాడు. ASF(D) కాగజ్‌నగర్‌కు చెందిన జయరాం మగసంతానం కోసం భార్యతో గొడవపడి పలుగుతో దాడి చేసి చంపాడు. అన్యోన్యంగా ఉండాల్సినవారు గొడవలతో జీవితాన్ని నాశనం చేసుకుంటూ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు.