India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TOSS ఓపెన్ ఇంటర్ టెన్త్ పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. జిల్లాలో పదో తరగతికి 4 ఇంటర్కు 3 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పది పరీక్షకు 548 విద్యార్థులకు గాను 410 మంది హాజరై 130 మందికి గైర్హాజరయ్యారు. అలాగే ఇంటర్కు 461 మంది విద్యార్థులకు గాను 414 మంది విద్యార్థులు హాజరై 47 మంది గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు.

ఆదిలాబాద్ జిల్లాలో సంక్షేమ వారోత్సవాలను ఈనెల 20 నుంచి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఏప్రిల్ 20 నుంచి 26 వరకు వారం రోజుల పాటు ఈ సంక్షేమ వారోత్సవాలు జరుగుతాయన్నారు. ప్రతి రోజూ ప్రత్యేక కార్యక్రమాలను ప్రణాళికబద్దంగా నిర్వహిస్తూ, నివేదికలను నమోదు చేయాలన్నారు.

ఆదిలాబాద్లోని దస్నాపూర్లో కోళ్ల దొంగతనం కేసును మావల పోలీసులు చేధించారు. పోలీసులు తెలిపిన వివరాలు.. రాత్రి సమయంలో కొందరు దుండగులు షాప్ వెనుక భాగంలో టిన్ షీట్లు కట్ చేసి లోపలికి ప్రవేశించి సుమారు 4 క్వింటాళ్ల కోళ్లను ఎత్తుకెళ్లారు. సుగుణ చికెన్ సెంటర్ యజమాని సంజీవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులు అమన్, ఫిరోజ్ ఖాన్, ముజాహిద్ అలీని అరెస్టు చేశారు. ఒకరు పరారీలో ఉన్నారు.

ఆదిలాబాద్లోని దస్నాపూర్లో కోళ్ల దొంగతనం కేసును మావల పోలీసులు చేధించారు. పోలీసులు తెలిపిన వివరాలు.. రాత్రి సమయంలో కొందరు దుండగులు షాప్ వెనుక భాగంలో టిన్ షీట్లు కట్ చేసి లోపలికి ప్రవేశించి సుమారు 4 క్వింటాళ్ల కోళ్లను ఎత్తుకెళ్లారు. సుగుణ చికెన్ సెంటర్ యజమాని సంజీవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులు అమన్, ఫిరోజ్ ఖాన్, ముజాహిద్ అలీని అరెస్టు చేశారు. ఒకరు పరారీలో ఉన్నారు.

ఆదిలాబాద్లోని దస్నాపూర్లో కోళ్ల దొంగతనం కేసును మావల పోలీసులు చేధించారు. పోలీసులు తెలిపిన వివరాలు.. రాత్రి సమయంలో కొందరు దుండగులు షాప్ వెనుక భాగంలో టిన్ షీట్లు కట్ చేసి లోపలికి ప్రవేశించి సుమారు 4 క్వింటాళ్ల కోళ్లను ఎత్తుకెళ్లారు. సుగుణ చికెన్ సెంటర్ యజమాని సంజీవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులు అమన్, ఫిరోజ్ ఖాన్, ముజాహిద్ అలీని అరెస్టు చేశారు. ఒకరు పరారీలో ఉన్నారు.

మొక్కజొన్న పండించిన రైతులు తమ మొక్క జొన్న పంటని బయటి మార్కెట్లో తక్కువ ధరకి అమ్మి నష్టపోకుండా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వేలిముద్ర బయోమెట్రిక్ విధానము ద్వారా మాత్రమే కొనుగోలు చేస్తామన్నారు. కౌలు రైతులు వ్యవసాయ విస్తీర్ణ అధికారి ద్వారా కౌలు వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి తమ పంటను సంబందిత కొనుగోలు కేంద్రంలో షెడ్యూల్ ప్రకారం అమ్ముకోవాలన్నారు.

జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షేమ వారోత్సవాలు, వివిధ అధికారిక కార్యక్రమాల నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. వారోత్సవాల నిర్వహణలో అధికార యంత్రాంగమంతా నిమగ్నమై ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. తదుపరి ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

మొక్కజొన్న కొనుగోలుకు ఆదిలాబాద్ జిల్లాలో 11 కేంద్రాలను గుర్తించినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. పలు కేంద్రాలను ప్రారంభించామని.. మిగతా కొనుగోలు కేంద్రాలు కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు. రైతులు తమ పంటను బయటి మార్కెట్లో తక్కువ ధరకు అమ్మి నష్టపోకుండా, తమ మొక్కజొన్న పంటను చెత్తచెదారం లేకుండా తేమ 14% మించకుండా షెడ్యూల్ ప్రకారం కొనుగోలు కేంద్రాలలో అమ్మి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు.

ఆదిలాబాద్, ఉట్నూర్లలో సార్వత్రిక విద్యాపీఠం (టాస్) ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ తెలిపారు. పదవ తరగతి కోసం 4, ఇంటర్ కోసం 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1,484 మంది అభ్యాసకులు హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని ఆయన వివరించారు.

ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం 20 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని DIEO జాదవ్ గణేశ్ కుమార్ ఆదేశించారు. సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులు రాణించేలా ప్రతి సబ్జెక్టులో ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రిన్సిపళ్లు, అధ్యాపకులు సమన్వయంతో విద్యార్థుల బలహీనతలను గుర్తించి, వారిని పరీక్షలకు సిద్ధం చేయాలని ఆయన స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.