India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చెన్నై, ఆర్సీబీ- 38 సార్లు
పంజాబ్- 35
ముంబై- 33
SRH, కేకేఆర్- 30
రాజస్థాన్- 28
ఢిల్లీ- 20
గుజరాత్- 18
లక్నో- 13

ఇరాన్ తరఫున అక్రమంగా సూడాన్కు బాంబులు, డ్రోన్లు అందిస్తోన్న షమీమ్ మాఫీ అనే మహిళా వ్యాపారవేత్త అమెరికాలో అరెస్టయ్యారు. ఇరాన్ సంతతికి చెందిన ఆమె 2013లో USకు వచ్చారు. 2016లో పర్మనెంట్ సిటిజన్షిప్ వచ్చింది. మొహాజెర్-6 ఆర్మ్డ్ డ్రోన్స్ సరఫరా చేసేందుకు షమీమ్ మధ్యవర్తుల ద్వారా 70 మిలియన్ల ఒప్పందాన్ని చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఆరోపణలను ఆమె ఖండించారు.

టాయిలెట్ లేదని బాలికలకు ఓ ప్రభుత్వ కాలేజ్ 67ఏళ్లుగా అడ్మిషన్స్ ఇవ్వని ఘటన UPలోని బస్తీ జిల్లా కల్వారీలో వెలుగుచూసింది. తన కూతురికి అడ్మిషన్ ఇవ్వమని ఓ తండ్రి టాయిలెట్ సీటుతో నిరసన తెలపడంతో ఇది వైరలైంది. కళాశాల యాజమాన్యమే పక్కనే ఓ ప్రైవేట్ కాలేజీ నిర్మించి టాయిలెట్ లేదనే నెపంతో బాలికలను అక్కడికి మళ్లిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. కాగా 1957లో ఈ కాలేజీకి కో-ఎడ్ గుర్తింపు వచ్చింది.

జపాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్పై 7.5 తీవ్రతతో భూమి కంపించినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర తీర ప్రాంతాల్లో 10 అడుగుల మేర సముద్ర అలలు విరుచుకుపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ముందు జాగ్రత్తగా నార్త్ జపాన్లో బుల్లెట్ రైళ్లను రద్దు చేశారు.

TG: ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు APలో మాదిరి ఇంప్రూవ్మెంట్ EXAMSకు అవకాశం కల్పించాలని పేరెంట్స్ కోరుతున్నారు. సెకండియర్లో తక్కువ మార్కులు వచ్చిన స్టూడెంట్స్ 75% కనిష్ఠ మార్కుల నిబంధనలుండే ఢిల్లీ వర్సిటీ వంటి సంస్థల కాలేజీల్లో సీట్లు పొందలేకపోతున్నారు. బెటర్మెంటుకు అవకాశమిస్తే మార్కులు మెరుగుపర్చుకొని ఆశించిన సంస్థల్లో చేరే అవకాశముంటుంది. పిల్లలకు మేలుచేసే దీన్ని ఇక్కడా పెట్టాలని TGJLA కోరింది.

మెగాస్టార్ చిరంజీవి మరోసారి మంచి మనసు చాటుకుని ఇద్దరికి పునర్జన్మను ప్రసాదించారు. మేకప్ ఆర్టిస్ట్ శివనాథ్ హార్ట్ సర్జరీకి రూ.10.5 లక్షలు, మాజీ మేనేజర్ కేవీ నరసయ్య భార్య బైపాస్ సర్జరీకి రూ.9.5 లక్షలు అందించారు. అలాగే ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. దీంతో ఆయన దాతృత్వంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇండస్ట్రీలో ఎవరికి ఏ ఆపద వచ్చినా మొదట సాయం చేసేది చిరునేనని పేర్కొంటున్నారు.

బ్రిటిష్ కాలం నాటి పాత నిబంధనలు ఇంకా కొనసాగుతున్నాయనే విషయం మీకు తెలుసా? అప్పట్లో గుర్రాలపై వెళ్లే అధికారుల పరిశుభ్రత కోసం వచ్చిన తెల్లని టవళ్లు నేటికీ కుర్చీలపై దర్శనమిస్తున్నాయి. ఇక హోదాను బట్టి టేబుల్ సైజు, వాడే సిరా రంగు కూడా మారుతుంటాయి. ఓసారి జూనియర్ ఆఫీసర్లు రెడ్ పెన్ వాడారని పెద్ద రచ్చ జరిగింది. దీనిపై 13 నెలల పాటు విచారణ జరిపి.. జూనియర్లు కేవలం బ్లూ/బ్లాక్ పెన్సే వాడాలని రూల్ తెచ్చారు.

TG: వరంగల్ జిల్లాలో బహిరంగ సభ ఏర్పాటుకు BRS ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. రైతు సమస్యలపై ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నిర్ణయించిందని BRS వర్గాలు వెల్లడించాయి. 10వేల మంది రైతులతో మే మొదటి వారంలో సభ నిర్వహణకు ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా ఈ సాయంత్రం జగిత్యాలలో BRS నిర్వహించే బహిరంగ సభకు కేసీఆర్ హాజరై ప్రసంగించనున్నారు.

డైరెక్టర్ పూరీ జగన్నాథ్పై విజయ్ సేతుపతి ప్రశంసల వర్షం కురిపించారు. ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ సినిమా కోసం ఆయనతో వర్క్ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇండస్ట్రీలో 26 ఏళ్ల జర్నీని పూర్తిచేసుకున్నందుకు కంగ్రాట్స్ చెప్పారు. ‘ఇదొక మైలురాయి మాత్రమే కాదు. ధైర్యం, విశ్వాసం, బలమైన వాయిస్కు నిదర్శనం. నటుల పరిధిని పెంచే చిత్రాలను అందించే మీలాంటి డైరెక్టర్ల కోసం మేం ఎదురుచూస్తూ ఉంటాం’ అని ట్వీట్ చేశారు.

యువ క్రికెటర్లకు అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా BCCI కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో ఒకేసారి విండీస్తో సిరీస్, ఏషియన్ గేమ్స్ రానుండటంతో 30-35 మందితో రెండు T20 జట్లను సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. వైభవ్, జైస్వాల్, ప్రియాంశ్, రఘువంశీ, రజత్, బదోనీ, శశాంక్, జురెల్, అనుకుల్, అశోక్ శర్మ, త్యాగి తదితరులకు ఛాన్స్ ఇచ్చి <<19688972>>శ్రేయస్ను<<>> కెప్టెన్ చేస్తారని క్రీడా వర్గాల అంచనా.
Sorry, no posts matched your criteria.