News April 20, 2026

ఢిల్లీకి హరీశ్ రావు.. జగిత్యాల సభకు గైర్హాజరు

image

TG: నేడు జగిత్యాల BRS బహిరంగ సభకు హరీశ్ రావు హాజరు కాలేకపోతున్నారు. ‘కాళేశ్వరం’పై నమోదైన కేసులో హైకోర్టులో ఎల్లుండి తుదితీర్పు ఉండటంతో, న్యాయ సలహాల గురించి ఆయన ఢిల్లీ వెళ్లారు. తీర్పు వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేలా ఎక్స్‌పర్ట్స్‌తో చర్చించనున్నారు. KCR సూచన మేరకే పార్టీ కార్యక్రమాల కంటే న్యాయపరమైన అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని BRS వర్గాలు పేర్కొంటున్నాయి.

News April 20, 2026

ట్రంప్ టారిఫ్స్ రిఫండ్ నేటి నుంచి షురూ!

image

ట్రంప్ ప్రతీకార టారిఫ్స్ చెల్లవని US <<19195677>>సుప్రీంకోర్టు<<>> కొట్టేసిన నేపథ్యంలో ఈరోజు నుంచి రిఫండ్స్ ప్రారంభంకానున్నాయి. ఇంపోర్టర్లు, అర్హులైన కస్టమ్స్ బ్రోకర్లు ఈ క్లెయిమ్స్‌కు అప్లై చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. దాదాపు 3,30,000 ఇంపోర్టర్స్ 53 మిలియన్ షిప్‌మెంట్లకు $166 బిలియన్లు టారిఫ్‌గా చెల్లించారు. అయితే తొలి విడతలో రిఫండ్స్‌ను పరిమిత సంఖ్యలోనే ఇవ్వనుంది. 60-90రోజుల్లో రిఫండ్ రానుందని సమాచారం.

News April 20, 2026

భార్యతో CBN బర్త్ డే సెలబ్రేషన్స్.. క్యూట్ ఫొటో!

image

ఏపీ సీఎం చంద్రబాబు తన పుట్టిన రోజును సతీమణి భువనేశ్వరితో కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను SMలో షేర్ చేస్తూ ‘నా జీవిత ప్రయాణంలో అడుగడుగునా తోడుగా ఉంటూ నాకు అండగా నిలిచిన నా భార్యతో కలిసి మరో ఏడాది పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉంది’ అని రాసుకొచ్చారు. దీనికి అన్యోన్య దంపతులు అంటూ అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

News April 20, 2026

ఐకాన్ స్టార్ రూటే సప‘రేటు’?

image

‘పుష్ప’ ఫ్రాంచైజీ నుంచి అల్లు అర్జున్ కొత్త పంథాను అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాకు ముందు ఆయన ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్ తీసుకోవట్లేదని సమాచారం. బదులుగా మూవీ కలెక్షన్లలో 30% వాటాను తీసుకుంటున్నారట. దీనివల్ల నిర్మాతలకు భారీ లోన్ల నుంచి విముక్తి కలుగుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి పుష్ప-2 రూ.1,742 కోట్లు కలెక్ట్ చేయగా ఐకాన్ స్టార్ రూ.522 కోట్లు తీసుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది.

News April 20, 2026

సాదా బైనామా రిజిస్ట్రేషన్లకు నేటినుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ

image

TG: సాదా బైనామాలతో అగ్రిభూముల రిజిస్ట్రేషన్‌కు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటినుంచి ఆరంభమైంది. రైతులు అప్లికేషన్‌తో పాటు సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేయాలి. గతంలో 9L అప్లికేషన్లు రాగా వివిధ చిక్కులతో 60000 మాత్రమే పరిష్కారమయ్యాయి. హైకోర్టు ఉత్తర్వులతో వీటి త్వరిత పరిష్కారానికి GOVT చర్యలు చేపట్టింది. డ్రై ల్యాండ్ 5Acr వరకు, వెట్ ల్యాండ్ 2.5Acr వరకు రిజిస్ట్రేషన్ ఉచితం. ఆపై ఉంటే మార్కెట్ ధర చెల్లించాలి.

News April 20, 2026

విజయ్-సంగీత విడాకుల కేసు వాయిదా

image

TVK అధినేత విజయ్-సంగీత దంపతుల విడాకుల కేసు వాయిదా పడింది. జూన్ 15న విచారణ చేపడతామని చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు వెల్లడించింది. కాగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని విజయ్ పిటిషన్ దాఖలు చేశారు.

News April 20, 2026

డ్వాక్రా మహిళలకు శుభవార్త

image

AP: చిన్నతరహా వ్యాపారం చేయాలనుకునే డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి స్త్రీనిధి ద్వారా ప్రస్తుతం ఇస్తున్న ₹లక్షకు అదనంగా మరో ₹2 లక్షల వరకు రుణం ఇవ్వనుంది. SC, STలకు ₹4 లక్షలు అందనున్నాయి. తీసుకున్న రుణాన్ని సక్రమంగా చెల్లిస్తున్న వారికే ఈ అవకాశం ఉంటుంది. దీనిపై రేపటి నుంచి నెలపాటు సెర్ప్ అధికారులు అవగాహన కల్పించి ప్రతి గ్రామ సంఘం నుంచి 15 మంది చొప్పున ఎంపిక చేయనున్నారు.

News April 20, 2026

మరోసారి తండ్రయిన స్టార్ డైరెక్టర్ అట్లీ

image

తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ మరోసారి తండ్రయ్యారు. ఆయన భార్య, నటి ప్రియా మోహన్ ఇవాళ ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు అట్లీ X వేదికగా ప్రకటించారు. 2023లో వీరికి కుమారుడు (మీర్) జన్మించగా, ఇప్పుడు అతనికి చెల్లి వచ్చినట్లు అట్లీ ఒక స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేశారు. దీంతో ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం అట్లీ.. అల్లు అర్జున్‌తో ‘రాకా’ సినిమా తీస్తున్నారు.

News April 20, 2026

సక్సెస్ కావడానికి మాధవన్ చెప్పిన 4 సూత్రాలు

image

జీవితంలో సక్సెస్ కావాలంటే 4 అలవాట్లను మానుకోవాలని నటుడు మాధవన్ సూచించారు. ‘ఇంట్లో నిరంతర వాదనలు, గొడవలను నివారించండి. కంప్లైంట్ చేయడం మానుకోండి. లేజీనెస్‌ను వదిలించుకోండి. ఇంట్లో ఉపయోగం లేని వస్తువులను తీసేయండి. నివాసాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. వీటివల్ల ప్రశాంతత నెలకొంటుంది. లైఫ్‌లో వృద్ధి సాధ్యమవుతుంది’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

News April 20, 2026

మదర్సా బోర్డు రద్దు.. ఉత్తరాఖండ్ సీఎం సంచలన నిర్ణయం

image

రాష్ట్రంలో మదర్సా బోర్డును రద్దు చేస్తున్నట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సంచలన ప్రకటన చేశారు. వచ్చే జులై నుంచి అన్ని మదర్సాలు తప్పనిసరిగా రాష్ట్ర బోర్డు కరిక్యులమ్‌ను ఫాలో అవ్వాలని స్పష్టం చేశారు. లేదంటే మదర్సాలనే మూసేస్తామని తేల్చిచెప్పారు. విద్యార్థులందరికీ మోడ్రన్, యూనిఫామ్ విద్యను అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనిపై ముస్లిం సంఘాలు ఇంకా స్పందించలేదు.