India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రధాని మోదీ స్ఫూర్తితో యూపీలోని సహరన్పుర్లో రాజేంద్ర అనే వ్యక్తి పుంగనూరు ఆవులను కొని పెంచుతున్నాడు. ఈ బ్రీడ్ను స్థానికంగా పాపులర్ చేయడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ పుంగనూరు ఆవులను పెంచడం చూసి తనకు ఈ ఆలోచన వచ్చిందన్నారు. ₹4లక్షల ఖరీదు చేసే ఈ ఆవు పాల ధర లీటరుకు ₹2వేలు పలుకుతోందని తెలిపారు. కాగా ఏపీలోని చిత్తూరుకు చెందిన ఈ అరుదైన బ్రీడ్ ఆవులను మోదీ నివాసంలో పెంచుతున్నారు.

TG: నేడు మధ్యాహ్నం నుంచి రాత్రి లోపు పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, మేడ్చల్, జనగామ, సిరిసిల్ల, కామారెడ్డి, నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో వానలు పడతాయని చెప్పారు. కాగా నిన్న హైదరాబాద్లోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది.

దేశంలోని తొలి డెంగీ వ్యాక్సిన్కు డీసీజీఐ నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. ఈ క్యూడెంగా (TAK-003) వ్యాక్సిన్ను టకేడా ఫార్మాసూటికల్ కంపెనీ (జపాన్) అభివృద్ధి చేసింది. 4-60ఏళ్ల మధ్య వారు మూడు నెలల వ్యవధిలో రెండు డోసులలో ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇది నాలుగు రకాల డెంగీ సిరోటైప్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ ఏడాదిలోనే ఇది అందుబాటులోకి రావొచ్చు. HYDకు చెందిన బయో-ఈ సంస్థతో టకేడా భాగస్వామ్యం కుదుర్చుకుంది.

TVK అధినేత విజయ్-సంగీత విడాకుల కేసు నేడు చెంగల్పట్టు కోర్టులో విచారణకు రానుంది. విచారణకు హాజరుకావాలని ఇప్పటికే విజయ్కు కోర్టు నోటీసులిచ్చింది. కాగా విజయ్, సంగీత పరస్పర ఆమోదంతో విడిపోయేందుకు శనివారం లాయర్లతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సెటిల్మెంట్ కింద రూ.250 కోట్లు ఇవ్వాలని సంగీత కోరగా రూ.35 కోట్లు ఇచ్చేందుకు విజయ్ ఓకే చెప్పినట్లు సమాచారం.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8th పే కమిషన్ జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటికే డీఏ పెరగగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3.833గా ఉండాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీనికి ఆమోదం లభిస్తే బేసిక్ శాలరీ రూ.18వేల నుంచి రూ.69వేలకు పెరగనుంది. అలాగే అరియర్స్ రూపంలో లెవల్-1 ఎంప్లాయీస్ దాదాపు రూ.10 లక్షలకు పైగా అందుకోనున్నట్లు సమాచారం. కాగా తుది నివేదికను సమర్పించడానికి 8వ వేతన సంఘానికి మే 2027 వరకు గడువు ఉంది.

ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హ్యాపీ బర్త్డే మావయ్యగారు అని SMలో శుభాకాంక్షలు తెలిపారు. ఇలాగే ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని.. ఇదే నిబద్ధత, విజన్తో ప్రజలకు సేవలు కొనసాగించాలని కోరుకున్నారు. మీ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలని ఆశిస్తున్నానని Xలో పోస్ట్ చేశారు. మరోవైపు వైసీపీ చీఫ్ జగన్ కూడా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

నిన్న RRతో మ్యాచులో సున్నాకే ఔటైన KKR కెప్టెన్ రహానే IPLలో ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఓపెనర్గా అత్యధిక సార్లు(12) డకౌట్ అయిన ప్లేయర్గా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో పార్థివ్ పటేల్(11), శిఖర్(10), గంభీర్(10), వార్నర్(9) ఉన్నారు. ఓవరాల్(బ్యాటింగ్ పొజిషన్తో సంబంధం లేకుండా)గా మ్యాక్స్వెల్(19) టాప్లో ఉన్నారు. కాగా సీజన్లో రహానే 7 మ్యాచుల్లో 25.33 యావరేజ్తో 152 రన్స్ చేశారు.

అమెరికాలోని లూసియానా కాల్పుల <<19693285>>కేసులో<<>> హృదయవిదారక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు కాల్చి చంపిన ఎనిమిది మంది పిల్లల్లో ఏడుగురు కన్నబిడ్డలే ఉన్నారు. మృతుల్లో ఏడాది చిన్నారి కూడా ఉంది. భార్య, మరో మహిళపైనా నిందితుడు కాల్పులు జరపగా వారి పరిస్థితి విషమంగా ఉంది. 2024 జనవరి తర్వాత USలో ఈ స్థాయిలో కాల్పులు జరగడం ఇదే తొలిసారి. పోలీసుల కాల్పుల్లో నిందితుడు చనిపోగా ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

AP: సీఎం చంద్రబాబు జీవితం, పరిపాలనా విశేషాలతో ‘ధర్మచక్రం’ సినిమాను నిర్మించినట్లు దర్శక, నిర్మాత పసుపులేటి వెంకట రమణ వెల్లడించారు. CBN బర్త్ డే సందర్భంగా ఇవాళ 13 జిల్లాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తామని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రానికి చేస్తున్న సేవలను, ఆయనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా ఇందులో వాస్తవాలను చూపించామని పేర్కొన్నారు.

ఫామ్ లేమితో సతమతమైన KKR స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎట్టకేలకు నిన్న RRతో జరిగిన మ్యాచ్లో కమ్బ్యాక్ ఇచ్చారు. 4 ఓవర్లు వేసి 14 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టారు. అయితే IPL సీజన్కు ముందు తాను గాయపడ్డట్లు వరుణ్ తెలిపారు. ఇప్పటికీ లెఫ్ట్ హ్యాండ్లో 2 ఫ్రాక్చర్స్ ఉన్నట్లు వెల్లడించారు. ఆ నొప్పితోనే బౌలింగ్ చేస్తున్నట్లు చెప్పారు. దాన్ని అధిగమించడానికే ట్రై చేస్తున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.