News August 21, 2024

అంతరాష్ట్ర దొంగల్ని అరెస్ట్ చేసిన గుంటూరు పోలీసులు

image

అంతర్రాష్ట్ర దొంగల ముఠాని గుంటూరు సీసీఎస్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. అబ్బినేనిగుంట వారిపాలెం అడ్డరోడ్డు వద్ద ముగ్గురు నిందితులను పట్టుకొని వారి నుంచి రూ.4,94,500 విలువైన బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ సతీశ్ కుమార్ ఆదేశాల మేరకు నేరవిభాగం అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, సీసీఎస్ డీఎస్పీ శివాజీ పర్యవేక్షణలో ఇన్స్ పెక్టర్ V.చౌదరి‌, ఎస్సై రాజ్ కుమార్ నిందితులను పట్టుకున్నారు.

Similar News

News October 18, 2025

గుంటూరు: సోమవారం పీజీఆర్‌ఎస్ కార్యక్రమం రద్దు

image

దీపావళి పండుగ సందర్భంగా సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం నిర్వహించడం లేదని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా శనివారం తెలిపారు. దీపావళి సందర్భంగా సెలవు దినం కావడంతో పీజీఆర్‌ఎస్ జరగదని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. వ్యయ ప్రయాసలతో కలెక్టరేట్‌కు రావద్దని కలెక్టర్ సూచించారు.

News October 18, 2025

తెలుగులో వినూత్న సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనుడితడు

image

రావూరి భరద్వాజ (జులై 5, 1927- అక్టోబరు 18, 2013) గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. తెలుగు రచనా ప్రపంచంలో వినూత్న సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనుడు. తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, రేడియోలో రచయితగా ఆయన పేరుతెచ్చుకున్నారు. ఆయన 37 కథా సంపుటాలు, 17 నవలలు, 6 బాలల మినీ నవలలు, 5 బాలల కథా సంపుటాలు, 3 వ్యాస, ఆత్మకథా సంపుటాలు, 8 నాటికలు, ఐదు రేడియో కథానికలు రచించారు.
#నేడు ఆయన వర్ధంతి

News October 18, 2025

GNT: ఫీజులు చెల్లించాలంటూ ఒత్తిడి..!

image

గుంటూరు జిల్లాలోని పలు కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను ఫీజుల కోసం తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పడడంతో, ఆ మొత్తాన్ని చెల్లిస్తేనే సెమిస్టర్ పరీక్షలకు అనుమతిస్తామని యాజమాన్యాలు మెలిక పెట్టాయి. బీటెక్ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో పాత ఫీజుల పేరుతో పరీక్ష ఫీజులు కూడా కట్టించుకోకపోవడంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు.