News March 8, 2025

అంతరిక్షంలోకి అడుగుపెట్టిన ఏకైక ఏపీ మహిళ

image

తెనాలికి చెందిన బండ్ల శిరీష ఏపీ నుంచి అంతరిక్షంలోకి అడుగుపెట్టిన ఏకైక మహిళ. మురళీధర్, అనురాధ దంపతులకు 1987లో శిరీష జన్మించారు. 5 ఏళ్ల వయసులోనే అమెరికాకు వెళ్లి హ్యూస్టన్‌లో స్థిరపడ్డారు. 2021లో వర్జిన్ గెలాక్టిక్ సంస్థ చేపట్టిన అంతరిక్ష ప్రయాణంలో ఆమె పాల్గొన్నారు. దీంతో కల్పనా చావ్లా తర్వాత భారత్లో పుట్టి స్పేస్లో అడుగుపెట్టిన రెండో మహిళగానూ, ఏపీ నుంచి ఏకైక మహిళగా నిలిచారు.

Similar News

News April 19, 2026

గుంటూరులో నేడు బంగారం ధర ఎంతంటే?

image

అక్షయ తృతీయ కావడంతో గుంటూరు జిల్లాలో బంగారు దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. గుంటూరులో ఆదివారం 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ రూ. 1,57,934 పలుకుతోంది. 22 క్యారెట్ 10 గ్రాములు రూ. 1,43,600 చొప్పున విక్రయిస్తున్నారు. వెండి గ్రాము రూ. 263గా ఉంది. అక్షయ తృతీయలో కనీసం గ్రాము బంగారమైనా కొనాలని పలువురు ఆసక్తి చూపుతున్నారు.

News April 19, 2026

GNT: వై.ఎస్ విజయమ్మకు లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు

image

వై.ఎస్ విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ‘x’ వేదికగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘శ్రీమతి వై.ఎస్. విజయమ్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంలో ఆమె మంచి ఆరోగ్యం, ఆనందంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాము’. అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

News April 19, 2026

మ్యుటేషన్ కొత్త రూల్స్‌తో గుంటూరు రైతుల అవస్థలు

image

ఆటో మ్యుటేషన్ విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. భూమి రిజిస్ట్రేషన్ అయ్యాక అమ్మిన, కొన్న వ్యక్తులిద్దరూ అధికారుల వద్ద బయోమెట్రిక్ వేస్తేనే మ్యుటేషన్ పూర్తవుతుంది. ఒకవేళ అమ్మిన వారు అందుబాటులో లేకున్నా, చనిపోయినా ఏం చేయాలనే దానిపై స్పష్టత లేదు. పారదర్శకత కోసమే ఈ రూల్ తెచ్చినా.. దీనివల్ల గుంటూరు జిల్లా రైతులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.