News January 24, 2025
అంతర్గాం: చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు

అంతర్గాం మండలం ముర్ముర్ గ్రామంలో నిన్న పెసరి సత్తమ్మ కిరాణ షాపు వద్ద ఉండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి మెడలో ఉన్న 3 తులాల గోల్డ్ చైన్ లాక్కెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న SI వెంకటస్వామి ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా ఈరోజు ఇద్దరు నిందితులను ఎల్లంపల్లి డ్యాం వద్ద అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.
Similar News
News October 31, 2025
ఆదిలాబాద్లో క్రీడాకారుల ఎంపిక పోటీలు

జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఆదిలాబాద్లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో U-17 జోనల్ లెవల్ స్పోర్ట్స్ ఎంపిక పోటీలు జరగనున్నాయి. నవంబర్ 3న బాలబాలికల రగ్బీ, 4న బాలుర కబడ్డీ, 5న బాలికల క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. క్రీడాకారులు సంబంధిత పోటీల్లో పాల్గొనేందుకు ఆరోజు ఉదయం 10 గంటలలోపు హాజరుకావాలని పోటీల కన్వీనర్లు తెలిపారు.
News October 31, 2025
కరీంనగర్ జిల్లాకు నేడు CM..!

మొంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఇవాళ మధ్యాహ్నం ఏరియల్ సర్వే చేయనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని హుస్నాబాద్, చిగురుమామిడి, సైదాపూర్ ప్రాంతాల్లో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించి హుజూరాబాద్ మీదుగా వరంగల్ జిల్లాకు చేరుకోనున్నారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్లో ఏరియల్ సర్వే చేసిన ప్రాంతాల్లో జరిగిన నష్టంపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
News October 31, 2025
NLG: 6.7 KM పొడవునా దెబ్బతిన్న రోడ్లు

జిల్లాలో రోడ్డు భవనాల శాఖ పరిధిలోని 24 ప్రాంతాల్లో 6.7 కిలోమీటర్ల పొడవున రోడ్లు దెబ్బతినగా అందులో 15 ప్రాంతాల్లో పూర్తిగా ధ్వంసమై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాటిల్లో గురువారం 7 ప్రాంతాల్లో రాకపోకలను పునరుద్ధరించారు. వాటి తాత్కాలిక మరమ్మతులకు రూ.35 లక్షలు అవసరమని అధికారులు అంచనా వేశారు. శాశ్వత మరమ్మతులకు రూ.9.70 కోట్లు అవసరమని ప్రతిపాదించినట్లు అధికారులు తెలిపారు.


