News October 16, 2024
అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీలలో పైడిరాజుకు కాంస్య పతకం
సాలూరు మండలం మామిడిపల్లికి చెందిన కనకల పైడిరాజు ఈనెల 10 నుంచి 19 వరకు మలేషియాలో జరుగుతున్న అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో 800 మీటర్ల రన్నింగ్లో కాంస్య పతకం సాధించినట్లు ఆమె గురువు పొట్నూరు శ్రీరాములు తెలిపారు. 36వ మలేషియా ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో ఇండియా తరఫున పాల్గొన్న పైడిరాజు భారతదేశానికి 800 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.
Similar News
News October 16, 2024
విశాఖకు తలమానికంగా అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్: MP
విశాఖపట్నానికి తలమానికంగా అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం నిలవబోతోందని విశాఖ ఎంపీ శ్రీ భరత్ అన్నారు. భోగాపురంలో విమానాశ్రయం వద్ద GMR సంస్థ ప్రతినిధులతో బుధవారం భేటీ అయ్యారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. వచ్చే 50ఏళ్లను దృష్టిలో పెట్టుకుని విమానాశ్రయ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి రాకపోకలు సులభతరం చేయడానికి అవసరమైన మార్గాల అభివృద్ధిపై చర్చించామని చెప్పారు.
News October 16, 2024
VZM: డయేరియా మరణాలపై సీఎం ఆరా
గుర్లలో డయేరియాతో ఐదుగురు మృతి చెందడంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మంగళవారం ఒక్కరోజే నలుగురు మృతి చెందారన్న సమాచారంపై సీఎం ఆరా తీశారు. ప్రస్తుతం బాధితులకు అందుతున్న చికిత్స, వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
News October 16, 2024
VZM: పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఎంపీ
ఢిల్లీలో జరిగిన మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా జరిగిన ఎగ్జామినేషన్ ఆఫ్ డిమాండ్ ఫర్ గ్రాండ్స్ 2024-25 సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలిసి ఎంపీ పలు సూచనలు, సలహాలు అందజేశారు.