News January 31, 2025
అంతర్వేది వరకు బస్సులు నడపాలని వినతి

అంతర్వేది కళ్యాణోత్సవాలకు స్పెషల్ బస్సుల పేరుతో అధిక చార్జీలు వసూలు చేయరాదని బజరంగ్ దళ్ నాయకుడు శిరంగు నాయుడు కోరారు. అమలాపురం నుంచి మలికిపురం వరకే కాకుండా అంతర్వేది వరకు పూర్తిస్థాయిలో బస్సులు నడపాలని విన్నవించారు. ఈ మేరకు ఆయన అమలాపురం ఆర్టీసీ డిపో మేనేజర్ చర్ల సూర్యనారాయణను శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. భక్తులు రద్దీకి తగ్గట్టుగా పూర్తిస్థాయిలో బస్సులు నడపాలని కోరారు.
Similar News
News November 18, 2025
వేములవాడలో అదనంగా 30 కళ్యాణం టికెట్లు జారీ

వేములవాడ పుణ్యక్షేత్రంలో శ్రీ పార్వతి, రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. నిత్య ఆర్జిత సేవలలో భాగంగా మంగళవారం ఆలయ అన్నదాన సత్రం పైఅంతస్తులో అర్చకులు, వేద పండితుల మంత్రాల మధ్య స్వామివారి కళ్యాణం కనులపండువగా సాగింది. కళ్యాణం టికెట్ల కోసం భక్తులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో మంగళవారం అదనంగా 30 టికెట్లను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
News November 18, 2025
వేములవాడలో అదనంగా 30 కళ్యాణం టికెట్లు జారీ

వేములవాడ పుణ్యక్షేత్రంలో శ్రీ పార్వతి, రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. నిత్య ఆర్జిత సేవలలో భాగంగా మంగళవారం ఆలయ అన్నదాన సత్రం పైఅంతస్తులో అర్చకులు, వేద పండితుల మంత్రాల మధ్య స్వామివారి కళ్యాణం కనులపండువగా సాగింది. కళ్యాణం టికెట్ల కోసం భక్తులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో మంగళవారం అదనంగా 30 టికెట్లను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
News November 18, 2025
ఉమ్మడి మెదక్ జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత

ఉమ్మడి మెదక్ జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ 7.8, న్యాల్కల్ 8.2, సదాశివపేట 8.4,మెదక్ జిల్లా నర్లాపూర్ 9.5, దామరంచ 9.9, సిద్దిపేట జిల్లా బేగంపేట 8.6,పోతారెడ్డిపేట 9.2, కొండపాక 9.7డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యాయి. చలి తీవ్రత దృష్ట్యా వృద్ధులు,బాలింతలు, చిన్నపిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.


