News January 31, 2025

అంతర్వేది వరకు బస్సులు నడపాలని వినతి

image

అంతర్వేది కళ్యాణోత్సవాలకు స్పెషల్ బస్సుల పేరుతో అధిక చార్జీలు వసూలు చేయరాదని బజరంగ్ దళ్ నాయకుడు శిరంగు నాయుడు కోరారు. అమలాపురం నుంచి మలికిపురం వరకే కాకుండా అంతర్వేది వరకు పూర్తిస్థాయిలో బస్సులు నడపాలని విన్నవించారు. ఈ మేరకు ఆయన అమలాపురం ఆర్టీసీ డిపో మేనేజర్ చర్ల సూర్యనారాయణను శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. భక్తులు రద్దీకి తగ్గట్టుగా పూర్తిస్థాయిలో బస్సులు నడపాలని కోరారు.

Similar News

News December 9, 2025

చొప్పదండి: నవోదయ ప్రవేశ పరీక్ష నిర్వహణపై శిక్షణ కార్యక్రమం

image

చొప్పదండి జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ఈనెల 13న జరగనున్న దృష్ట్యా, నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్(పరీక్షలు) సంధ్యారాణి సోమవారం ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 34 పరీక్ష కేంద్రాల నిర్వహణ అధికారులు పాల్గొన్నారు. పరీక్ష నిర్వహణపై విధి విధానాలు చర్చించి, సామగ్రిని నిర్వాహకులకు అందజేశారు. ఇన్చార్జి ప్రిన్సిపల్ బ్రహ్మానందరెడ్డి, ఎంఈఓ మోహన్ పాల్గొన్నారు

News December 9, 2025

సంజూకు మళ్లీ నిరాశేనా!

image

SAతో వన్డేల్లో చోటు దక్కని సంజూ శాంసన్‌కు T20ల్లోనూ మొండిచేయి ఎదురయ్యే ఆస్కారముంది. గాయాల నుంచి కోలుకున్న గిల్, పాండ్య జట్టుతో చేరనున్నట్లు కెప్టెన్ సూర్య ప్రకటించారు. దీంతో అభిషేక్‌తో కలిసి గిల్ ఓపెనింగ్ చేయనున్నారు. వికెట్ కీపర్‌గా జితేశ్‌ను తీసుకోవడానికే ఎక్కువ అవకాశాలున్నాయి. ప్రాబబుల్ ప్లేయింగ్ 11.. సూర్య(C), గిల్(VC), అభిషేక్, తిలక్, పాండ్య, దూబే, అక్షర్, జితేశ్, బుమ్రా, వరుణ్, కుల్దీప్

News December 9, 2025

JMKT: గత వారం లాగానే నిలకడగా పత్తి ధర

image

రెండు రోజుల విరామం అనంతరం సోమవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌ తిరిగి ప్రారంభమైంది. మార్కెట్‌కు రైతులు 68 వాహనాల్లో 546 క్వింటాళ్ల పత్తిని విక్రయానికి తీసుకురాగా, దీనికి గరిష్ఠంగా క్వింటాకు రూ.7,300, కనిష్టంగా రూ.6,600 ధర పలికిందని మార్కెట్ కార్యదర్శి రాజా తెలిపారు. మార్కెట్లో కార్యకలాపాలను చైర్ పర్సన్ స్వప్న పరిశీలించారు. పత్తి ధర శుక్రవారం లాగానే నిలకడగానే కొనసాగింది.