News February 14, 2025
అందరూ ఆధార్ కలిగి ఉండాలి: ASF కలెక్టర్

జిల్లాలో ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి యూఐడీఏఐ. డిప్యూటీ డైరెక్టర్ చైతన్య నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సభ్యులతో కలిసి హాజరయ్యారు. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలలో చదివి విద్యార్థులు తప్పని సరిగా ఆధార్ కార్డు తీసుకోవాలన్నారు.
Similar News
News November 17, 2025
అనకాపల్లిలో కాలుష్య నియంత్రణ మండలి ఆఫీసు: ఛైర్మన్

నాణ్యమైన సేవలు అందించడంతో పాటు పని భారం తగ్గించేందుకు ప్రతి జిల్లా కేంద్రంలోనూ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు పీసీబీ ఛైర్మన్ పి.కృష్ణయ్య తెలిపారు. అనకాపల్లి, రాజమండ్రిలో కార్యాలయాలు ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. విశాఖలో ఆదివారం మాట్లాడుతూ.. పరిశ్రమల పర్యవేక్షణతోపటు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే ఘటన స్థలానికి చేరుకునేలా అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.
News November 17, 2025
ఏపీలో అణువిద్యుత్ ప్రాజెక్ట్.. పరిశీలిస్తున్న NTPC!

విద్యుదుత్పత్తి సంస్థ NTPC 700, 1000, 1,600 మెగావాట్ల కెపాసిటీతో అణువిద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం AP, గుజరాత్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో అనువైన ప్రదేశాలను అన్వేషిస్తున్నట్లు సంస్థ అధికారి ఒకరు వెల్లడించారు. 2047 నాటికి 30K మె.వా. విద్యుత్ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వెయ్యి మెగావాట్ల ప్లాంట్కు రూ.20వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా.
News November 17, 2025
డెయిరీ ఫామ్ ప్రారంభించే ముందు ఇవి చేయాలి

డెయిరీ ఫామ్ ప్రారంభించడానికి ముందు కొంత భూమిలో హైబ్రిడ్ నేపియర్, గినీ గడ్డి, జొన్న.. మరి కొంత భాగంలో అలసంద, పిల్లిపెసర, లూసర్న్ వంటి పశుగ్రాసాలను సాగుచేయాలి. అలాగే సుబాబుల్, అవిశ చెట్లను ఫామ్ పెట్టే స్థలం చుట్టూ కంచెలా వేయాలి. ఇలా పశుగ్రాసాన్ని పెంచి, షెడ్డులు కట్టిన తర్వాత పరికరాలు, మందులు కొనుగోలు చేశాక పాడి పశువులను కొనాలంటున్నారు వెటర్నరీ నిపుణులు. ✍️మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.


