News November 25, 2024

అందరూ సమన్వయంతో పని చేయండి: అడిషనల్ ఎస్పీ

image

కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లా అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, జిల్లా కోర్ట్ కానిస్టేబుళ్లతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 14న జరిగే లోక్ ఆదాలత్‌లో అందరూ సమన్వయంతో పని చేయాలన్నారు. వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. న్యాయశాఖ, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

Similar News

News October 23, 2025

వలసబాట పట్టిన కూలీలు

image

గ్రామాల్లో ఉపాధి కరువై పొట్ట కూటి కోసం కూలీలు వలసబాట పట్టారు. బుధవారం పెద్దకడబూరు ఎస్సీ కాలనీకి చెందిన పలువురు కూలీలు కర్ణాటకలోని రాయచూరు జిల్లా గబ్బూరు మండలం హనుమాపురంలో పత్తి తీయడానికి టెంపోలో బయలుదేరారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు గ్రామంలో సాగు చేసిన పత్తి పంట పూర్తిగా దెబ్బతినడంతో పనులు కరువయ్యాయి. దీంతో చేసేది లేక పిల్లా పాపలతో కూలీలు వలస బాట పట్టారు.

News October 23, 2025

తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: ఆర్డీవో

image

రాబోయే తుఫాన్ నేపథ్యంలో తుంగభద్ర నదికి ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ఆర్డీవో సందీప్ బుధవారం సూచించారు. కర్నూలు రూరల్ మండలంలో 11, సి.బెళగల్ మండలంలో 9 గ్రామాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు. వరద కారణంగా ఏవైనా ఇబ్బందులు కలిగితే ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ 08518-241380 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

News October 23, 2025

ఈనెల 25న కర్నూలులో జాబ్ మేళా

image

ఈ నెల 25న కర్నూలులోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి దీప్తి బుధవారం తెలిపారు. ఈ మేళాలో ఆరంజ్ ఫైనాన్స్, టాటా ఎలక్ట్రానిక్స్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. టెన్త్ నుంచి డిగ్రీ వరకు ఉత్తీర్ణులైన అభ్యర్థులు విద్యార్హత పత్రాలు, ఫొటోలు తీసుకుని హాజరుకావాలని సూచించారు. www.ncs.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.