News March 30, 2025
అందుకే అసెంబ్లీ పనిదినాలు పెంచాం: రఘురామకృష్ణరాజు

రాష్ట్ర ప్రజలు సమస్యలు చర్చించేందుకు అసెంబ్లీ పనిదినాలు 24 రోజులకు పెంచడం జరిగిందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. ఆదివారం అనకాపల్లిలో మీడియాతో మాట్లాడారు.. పులివెందుల ఎమ్మెల్యే జగన్ తన నియోజకవర్గ ప్రజల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడేందుకు రాకపోవడం ఆ నియోజకవర్గ ప్రజల దురదృష్టకరమన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడిగే హక్కు జగన్కు లేదన్నారు. ఆ ప్రతిపక్ష హోదాను ప్రజలే తిరస్కరించారన్నారు.
Similar News
News November 24, 2025
డిసెంబర్ 10 నుంచి ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ వీక్షించే అవకాశం!

ముచ్చర్ల సమీపంలోని ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ తలుపులు త్వరలో ప్రజల కోసం తెరవనున్నాయి. DEC 8, 9న జరిగే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2025 అనంతరం 10, 11, 12న సాధారణ ప్రజలు సందర్శించేందుకు అనుమతి ఉంటుంది. తెలంగాణలో ప్రపంచ పెట్టుబడులు చూపడం, రాష్ట్ర విధానాలు, భవిష్యత్తు ప్రాజెక్టులను ప్రదర్శించడం ఈ సదస్సు లక్ష్యం. భారీ భద్రత, నిఘా మధ్య ప్రజలకు ఇబ్బంది లేని ఎంట్రీ, ఎగ్జిట్పై అధికారులు చర్చిస్తున్నారు.
News November 24, 2025
డిసెంబర్ 10 నుంచి ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ వీక్షించే అవకాశం!

ముచ్చర్ల సమీపంలోని ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ తలుపులు త్వరలో ప్రజల కోసం తెరవనున్నాయి. DEC 8, 9న జరిగే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2025 అనంతరం 10, 11, 12న సాధారణ ప్రజలు సందర్శించేందుకు అనుమతి ఉంటుంది. తెలంగాణలో ప్రపంచ పెట్టుబడులు చూపడం, రాష్ట్ర విధానాలు, భవిష్యత్తు ప్రాజెక్టులను ప్రదర్శించడం ఈ సదస్సు లక్ష్యం. భారీ భద్రత, నిఘా మధ్య ప్రజలకు ఇబ్బంది లేని ఎంట్రీ, ఎగ్జిట్పై అధికారులు చర్చిస్తున్నారు.
News November 24, 2025
పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గురించి మీకు తెలుసా..?

పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ జిల్లాలో అభివృద్ధి కార్యకలాపాలను అమలు చేయడానికి 2022లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సంస్థ 7281.31 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, 21,36,660 జనాభాను కలిగి ఉంది. పల్నాడు పట్టణాభివృద్థి సంస్థ పరిధిలో 28 మండలాల్లోని 349 గ్రామాలు, 8 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్గా చిరుమామిళ్ల మధుబాబును ప్రభుత్వం ఇటీవల నియమించింది.


