News March 30, 2025
అందుకే అసెంబ్లీ పనిదినాలు పెంచాం: రఘురామకృష్ణరాజు

రాష్ట్ర ప్రజలు సమస్యలు చర్చించేందుకు అసెంబ్లీ పనిదినాలు 24 రోజులకు పెంచడం జరిగిందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. ఆదివారం అనకాపల్లిలో మీడియాతో మాట్లాడారు.. పులివెందుల ఎమ్మెల్యే జగన్ తన నియోజకవర్గ ప్రజల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడేందుకు రాకపోవడం ఆ నియోజకవర్గ ప్రజల దురదృష్టకరమన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడిగే హక్కు జగన్కు లేదన్నారు. ఆ ప్రతిపక్ష హోదాను ప్రజలే తిరస్కరించారన్నారు.
Similar News
News October 15, 2025
2800 MW విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతి

AP: రాష్ట్రంలో 2800 MW విద్యుదుత్పత్తి ప్లాంట్లకు అనుమతిస్తూ ప్రభుత్వం GOలు జారీచేసింది. మన్యం(D) మక్కువ(M) దుగ్గేరులో 2000MW హైడ్రో ప్రాజెక్టు కోసం ‘చింతా గ్రీన్ ఎనర్జీ’కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతపురం(D) కమలపాడు, కొనకొండ్ల, గుల్లపాలెంలో ‘ACME ఊర్జా’, బెళుగుప్ప(M)లోని 4 గ్రామాల్లో ‘TATA’ 400MW చొప్పున సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఓకే చెప్పింది. వీటికి భూమి ఇతర రాయితీలను GOల్లో పొందుపర్చారు.
News October 15, 2025
రామాయంపేట: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

పురుగుల మందు తాగి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రామాయంపేటలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గొలిపర్తి గ్రామానికి చెందిన ఎర్రం బాలకృష్ణ(40) కేసీఆర్ కాలనీలో నివాసం ఉంటారు. మంగళవారం రాత్రి గ్రామ శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
News October 15, 2025
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు

పాలకొల్లు-దిగమర్రు రహదారిపై బైకును ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టిన ఘటనలో మంగళవారం ఒకరు మృతి చెందగా, ఇరువురు గాయపడ్డారు. క్షతగాత్రులు శరణ్ శర్మ, సాయి చరణ్ను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరు పేరుపాలెం వెళ్తున్నట్లు సమాచారం. యువకులు తణుకుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో కొల్లి మహేష్ రాజు(18) మృతి చెందాడు.