News March 30, 2025

అందుకే అసెంబ్లీ పనిదినాలు పెంచాం: రఘురామకృష్ణరాజు

image

రాష్ట్ర ప్రజలు సమస్యలు చర్చించేందుకు అసెంబ్లీ పనిదినాలు 24 రోజులకు పెంచడం జరిగిందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. ఆదివారం అనకాపల్లిలో మీడియాతో మాట్లాడారు.. పులివెందుల ఎమ్మెల్యే జగన్ తన నియోజకవర్గ ప్రజల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడేందుకు రాకపోవడం ఆ నియోజకవర్గ ప్రజల దురదృష్టకరమన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడిగే హక్కు జగన్‌కు లేదన్నారు. ఆ ప్రతిపక్ష హోదాను ప్రజలే తిరస్కరించారన్నారు.

Similar News

News November 14, 2025

నవజాత శిశు వారోత్సవాలు నిర్వహించాలి: DM&HO

image

మాతా శిశు సేవల ద్వారా గర్భిణులను గుర్తించి సకాలంలో రికార్డుల్లో నమోదు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డీ.కృష్ణమూర్తి నాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పాడేరు డీఎంహెచ్‌వో కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. మాతా శిశువులకు నిర్ధేశించిన సమయానికి వ్యాధి నిరోధక టీకాలు అందించాలని సూచించారు. ఈనెల 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జాతీయ నవజాత శిశు వారోత్సవాలు నిర్వహించాలన్నారు.

News November 14, 2025

18 నెలల్లో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు: CBN

image

AP: కూటమి అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించినట్లు CII సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇన్వెస్ట్‌మెంట్స్ రాబట్టగలిగామని వివరించారు. అటు రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు సంబంధించి లులూ గ్రూప్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సీఎం CBN, లులూ ఛైర్మన్ యూసుఫ్ అలీ సమక్షంలో అధికారులు, సంస్థ ప్రతినిధులు అంగీకార పత్రాలు మార్చుకున్నారు.

News November 14, 2025

కాకినాడ కలెక్టర్ కీలక ప్రకటన

image

కాకినాడ జిల్లాలో దివ్యాంగుల సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభించినట్లు కలెక్టర్ షాన్ మోహన్ వెల్లడించారు. శుక్రవారం నుంచి డిసెంబర్ వరకు స్లాట్స్ బుకింగ్ కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటికే వెయిటింగ్ లిస్టులో ఉన్నవారికి స్లాట్ బుకింగ్‌లో తొలి ప్రాధాన్యమిస్తామన్నారు. కొత్త దరఖాస్తులకు తేదీ ఖరారు చేస్తామని చెప్పారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు.