News July 31, 2024

అందులో నిర్మల్ జిల్లా TOP

image

మహాలక్ష్మి పథకం వినియోగానికి సంబంధించి ఆదిలాబాద్ RTC రీజియన్ వ్యాప్తంగా పరిశీలిస్తే నిర్మల్ డిపోలో అధికంగా లబ్ధిదారులు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. గత డిసెంబర్ నుండి జులై వరకు నిర్మల్ జిల్లాలో జీరో టిక్కెట్ తీసుకున్న మహిళలు 96.54 లక్షల మంది ఉన్నారు. మంచిర్యాలలో 78 లక్షలు, ఆదిలాబాద్‌లో 50 లక్షలు, బైంసాలో 56 లక్షలు, ఆసిఫాబాద్‌లో 49, ఉట్నూర్ పరిధిలో 16 లక్షల మంది అతివలు, బాలికలు ప్రయాణం చేశారు.

Similar News

News November 22, 2025

సీఎంఆర్ సరఫరా వేగవంతం చేయండి: ADB కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లాలో కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (CMR) సరఫరాను వేగవంతం చేయాలని కలెక్టర్‌ రాజార్షి షా మిల్లర్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ప్రభుత్వం విధించిన గడువులు ముగుస్తున్న నేపథ్యంలో మిల్లర్లు సన్నబియ్యం మిల్లింగ్‌, సిఎంఆర్‌ సరఫరా పనులను త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమయానికి సిఎంఆర్‌ సరఫరా చేయని మిల్లర్లపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

News November 22, 2025

ADB: కారు జోరు.. కాంగ్రెస్ ఇలా.. బీజేపీ డీలా..!

image

రాష్ట్రంలో అన్ని ప్రధాన ఎన్నికల్లో ఓటమి చూసిన కారు పార్టీ ADBలో ఏమాత్రం జోరు తగ్గించడం లేదు. తరచూ వివిధ సమస్యలపై ఆందోళన నిర్వహిస్తూ ప్రజల్లో మద్దతు కూడగట్టుకుంటోంది. అభివృద్ధి తమ మంత్రమని కాంగ్రెస్ వివిధ పనులు చేస్తూ ముందుకు వెళ్తోంది. అధికార పార్టీ కార్యక్రమాలు అంతంతగానే ఉన్నాయి. ఇక బీజేపీ హిందుత్వపరంగా బలంగా ఉన్నా.. పార్టీ కార్యక్రమాలు అంతగా కనిపించడం లేదని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.

News November 22, 2025

ADB: స్వచ్ఛంద సంస్థల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలో పలు సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు స్టెప్ సీఈవో రాజలింగు పేర్కొన్నారు. యువత సంక్షేమార్గం నైపుణ్య అభివృద్ధికి కృషి చేస్తున్న సంస్థలు దరఖాస్తు చేసుకునేందుకు ముందుకు రావాలని కోరారు. అర్హత గల సంస్థలు ngodarpan.gov.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. స్టెప్ కార్యాలయంలో ఈనెల 30లోపు సమర్పించాలని సూచించారు.