News December 2, 2024
అందోల్: అంబులెన్స్లు ప్రారంభించిన మంత్రి దామోదర్

హైదరాబాదులోని ఎన్టీఆర్ మార్గ్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం విక్రమార్కతో కలిసి మంత్రి దామోదర్ రాజనర్సింహ అంబులెన్స్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. ఆరోగ్య సబ్ సెంటర్లు, PHC, ఏరియా హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలకు రూ.500 కోట్ల విడుదల చేసిన చరిత్ర కాంగ్రెస్దే అని ఆయన అన్నారు. పేదవాని వైద్యం, విద్య మా బాధ్యతగా భావించేది కాంగ్రెస్ అని తెలిపారు.
Similar News
News November 21, 2025
మెదక్: డ్రగ్స్కు పూర్తిగా దూరంగా ఉండాలి: కలెక్టర్

యువత, విద్యార్థులు సహా ప్రతీ ఒక్కరూ మత్తు పదార్థాలు, డ్రగ్స్కు పూర్తిగా దూరంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. మెదక్ కలెక్టరేట్లో శుక్రవారం డ్రగ్స్ నిర్మూలనపై అధికారులు, పోలీసు సిబ్బందితో ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం డ్రగ్స్, మత్తు పదార్థాల వాడకం పెరిగిపోతూ, మహమ్మారి లా సమాజాన్ని, యువతను చెడు మార్గం వైపు నడిపిస్తుందన్నారు.
News November 21, 2025
మెదక్: కలెక్టర్ను కలిసిన కొత్త డీఈఓ విజయ

జిల్లా విద్యాధికారిగా, జిల్లా విద్యా శిక్షణ సంస్థ హవేలీ ఘనపూర్ ప్రిన్సిపల్గా పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించిన విజయ కలెక్టర్ రాహుల్ రాజ్ను మర్యాద పూర్వకంగా కలిశారు. పదవ తరగతి వార్షిక పరీక్షలలో వంద శాతం ఫలితాలు సాధించేలా ప్రణాళికలు రూపొందించుకొని పర్యవేక్షించాలన్నారు. ఆమె వెంట జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సమగ్ర శిక్ష అధికారులు నవీన్, రాజు, ఆడల్ట్ ఎడ్యుకేషన్ కో ఆర్డినేటర్ మురళి ఉన్నారు.
News November 21, 2025
మెదక్: రోడ్డు ప్రమాదాలతో ప్రాణ, ఆర్థిక నష్టం: కలెక్టర్

జిల్లాలో రోడ్డు ప్రమాదాల వల్ల అమూల్యమైన ప్రాణ, ఆర్థిక నష్టం జరుగుతున్న సందర్భంగా రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజలకు సూచించారు. కలెక్టరేట్లో ఎస్పీ శ్రీనివాస్ రావు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలలో గణనీయమైన తగ్గుదల సాధ్యమని పేర్కొన్నారు.


