News January 30, 2025

అంబర్‌పేటలో కానిస్టేబుల్ ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. మాదన్నపేట PSలో PCగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు (42) అంబర్‌పేటలోని దుర్గానగర్‌లో ఉంటున్నారు. అతనికి భార్య ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. తన ఇంట్లో ఫ్యాన్‌కి చున్నీతో ఉరి వేసుకొన్నాడు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Similar News

News February 7, 2025

UPDATE: గజ్వేల్ మృతులు గోదావరిఖని వాసులు

image

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని రాజీవ్ రహాదారిపై జరిగిన <<15384831>>రోడ్డు ప్రమాదం<<>>లో మృతులు గోదావరిఖని వాసులుగా పోలీసులు గుర్తించారు. గోదావరిఖనికి చెందిన బాణేశ్(28), లింగం(48) మృతిచెందారు. మహేశ్(44) పరిస్థితి విషమంగా ఉండడంతో గజ్వేల్ వైద్యులు హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. కారు డ్రైవర్ కుందేళ్ల ప్రణయ్ సాగర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

News February 7, 2025

రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం.. గోదావరిఖని వాసులు మృతి

image

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలోని రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. గోదావరిఖని నుంచి HYD వెళ్తున్న కారు లారీని ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న గోదావరిఖనికి చెందిన బాణేష్(28), లింగం(48) మృతిచెందారు. మహేశ్(44) పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు హైదరాబాద్‌కు తరలించారు. కారు డ్రైవర్ కుందేళ్ల ప్రణయ్ సాగర్ కు స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 7, 2025

రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం.. గోదావరిఖని వాసులు మృతి

image

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలోని రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. గోదావరిఖని నుంచి HYD వెళ్తున్న కారు లారీని ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న గోదావరిఖనికి చెందిన బాణేష్(28), లింగం(48) మృతిచెందారు. మహేశ్(44) పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు హైదరాబాద్‌కు తరలించారు. కారు డ్రైవర్ కుందేళ్ల ప్రణయ్ సాగర్ కు స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!