News March 17, 2025
అంబాజీపేట: కళల్లోనే కాదు..చదువుల్లోనూ ఆణిముత్యాలే

జడ్పీ హైస్కూల్ తొండవరంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులు సాంస్కృతిక కళల్లో విశేషంగా రాణిస్తున్నారు. విద్యాశాఖ నిర్వహించే కార్యక్రమాల్లో వీరుచేసే నృత్య ప్రదర్శన అందరిని ఆకట్టుకుంటుంది. వీరికి క్రాఫ్ట్ టీచర్ శ్రీమతి పెయ్యల రాజేశ్వరి చక్కని తర్ఫీదునిస్తుండగా సోషల్ టీచర్ గంటి శ్రీనివాస్ సహకరిస్తున్నారు. చదువులో కూడా చక్కగా రాణిస్తున్న వీరు మంచిమార్కులతో ఉత్తీర్ణత సాధించాలని అందరూ కోరుకుంటున్నారు.
Similar News
News March 17, 2025
BREAKING: మోదీ పాడ్కాస్ట్ షేర్ చేసిన ట్రంప్

ప్రధాని నరేంద్రమోదీపై US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి అభిమానం చాటుకున్నారు. US పాడ్కాస్టర్, AI పరిశోధకుడు లెక్స్ ఫ్రైడ్మన్కు ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూ వీడియోను తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో షేర్ చేశారు. మూడు గంటల నిడివి ఉన్న ఈ పాడ్కాస్ట్లో RSSతో అనుబంధం, భారత్కు నిర్వచనం, సంస్కృతి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ పాలన సహా అనేక అంశాలపై మోదీ తన అభిప్రాయాలు పంచుకున్నారు.
News March 17, 2025
భారీగా కార్ల ధరలు పెంచుతున్న మారుతీ సుజుకీ

కస్టమర్లకు మారుతీ సుజుకీ షాకిచ్చింది. 2025, APRIL నుంచి కార్ల ధరలను 4% వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ముడి వనరుల ధరలు, ఆపరేషనల్ కాస్ట్ పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. మోడల్ను బట్టి కస్టమర్లపై తక్కువ భారం వేసేందుకే ప్రయత్నించామని వెల్లడించింది. 2025లో ఈ కంపెనీ ధరలు పెంచడం ఇది మూడోసారి. గత DEC ప్రకటించిన 4% పెంపు JANలో అమల్లోకి వచ్చింది. FEBలో మోడల్ను బట్టి రూ.1500-32,500 వరకు పెంచింది.
News March 17, 2025
శ్రీ సత్యసాయి జిల్లా: ఐసీడీఎస్ పీడీగా శ్రీదేవి బాధ్యతలు స్వీకరణ

శ్రీ సత్యసాయి జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్గా శ్రీదేవి బాధ్యత స్వీకరించారు. తాడిపత్రిలో పనిచేస్తున్న శ్రీదేవి పదోన్నతిపై శ్రీ సత్యసాయి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్గా నియమితులయ్యారు. సోమవారం పీడీగా బాధ్యతలు స్వీకరించారు. కాగా ఆమె కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్నారు.