News March 26, 2025
అంబాజీపేట: బంగారు మురుగు సినిమా షూటింగ్

బంగారు మురుగు చిత్రం షూటింగ్ అంబాజీపేటలో మంగళవారం జరిగింది. డొక్కా ఫణి దర్శకత్వంలో పల్లెటూరి వాతావరణంలో ఈ చిత్రం షూటింగ్ నిర్వహిస్తున్నారు. నాయనమ్మ- మనవడు మధ్య జరిగే ఉమ్మడి కుటుంబం, పిల్లల పెంపకం, బంధుత్వాలు ఈ చిత్రంలో ప్రధానాంశాలుగా ఉంటాయని దర్శకులు తెలిపారు. ఏప్రిల్ 14 వరకు షూటింగ్ జరుగుతుందన్నారు. మాచవరం కోటి వారి అగ్రహారంలో మేడిది సత్తిరాజు వ్యవసాయ క్షేత్రంలో పలు దృశ్యాలను చిత్రీకరించారు.
Similar News
News November 24, 2025
అధికారులు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

సమస్యల పరిష్కారానికి అధికారులందరూ సమన్వయంతో పనిచేసి, ప్రజా సమస్యల పరిష్కార వేదిక లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 127 ఫిర్యాదులు అందాయాన్నారు. ప్రతి దరఖాస్తు వ్యక్తిగత శ్రద్ధతో పరిశీలించి ప్రజలకు తృప్తి కలిగించే విధంగా నిర్ణీత గడువులో పరిష్కరించాలన్నారు.
News November 24, 2025
రాజన్న కోడె మొక్కు చెల్లించుకున్న 5,547 మంది భక్తులు

వేములవాడ రాజన్న క్షేత్రంలో సోమవారం నాడు 5,547 మంది భక్తులు కోడెమొక్కు చెల్లించుకున్నారు. కార్తీక మాసం ముగిసినప్పటికీ శ్రీ స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నాడు భీమేశ్వరాలయం రద్దీగా మారింది. శ్రీ స్వామివారి నిత్య కల్యాణోత్సవంలో 94 జంటలు పాల్గొన్నాయి. వివిధ రకాల ఆర్జిత సేవలలో భక్తులు పాల్గొని తరించారు.
News November 24, 2025
లెక్చరర్ వేధింపులు.. కారేపల్లిలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ విద్యార్థి ఇంగ్లిష్ లెక్చరర్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంటికి వెళ్లేందుకు అనుమతి అడిగినందుకు అధ్యాపకుడు దురుసుగా ప్రవర్తించడంతో మనస్తాపం చెంది లారీ కింద పడేందుకు ప్రయత్నించాడు. ఆ లెక్చరర్పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ ఆ అధ్యాపకుడు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, మెమో జారీ చేసినట్లు తెలుస్తోంది.


