News March 26, 2025
అంబాజీపేట: బంగారు మురుగు సినిమా షూటింగ్

బంగారు మురుగు చిత్రం షూటింగ్ అంబాజీపేటలో మంగళవారం జరిగింది. డొక్కా ఫణి దర్శకత్వంలో పల్లెటూరి వాతావరణంలో ఈ చిత్రం షూటింగ్ నిర్వహిస్తున్నారు. నాయనమ్మ- మనవడు మధ్య జరిగే ఉమ్మడి కుటుంబం, పిల్లల పెంపకం, బంధుత్వాలు ఈ చిత్రంలో ప్రధానాంశాలుగా ఉంటాయని దర్శకులు తెలిపారు. ఏప్రిల్ 14 వరకు షూటింగ్ జరుగుతుందన్నారు. మాచవరం కోటి వారి అగ్రహారంలో మేడిది సత్తిరాజు వ్యవసాయ క్షేత్రంలో పలు దృశ్యాలను చిత్రీకరించారు.
Similar News
News July 8, 2025
మహబూబాబాద్ నుంచి తిరుపతికి స్పెషల్ ట్రైన్

కాచిగూడ నుంచి మహబూబాబాద్, డోర్నకల్ మీదుగా తిరుపతి వెళ్లడానికి స్పెషల్ ట్రైన్ నడుపుతున్నామని దక్షిణమధ్య రైల్వే ఎస్టీఎం రాజనర్సు తెలిపారు. కాచిగూడ-తిరుపతి, తిరుపతి-కాచిగూడ స్పెషల్ ట్రైన్ జులై 10, 17, 24, 31 తేదీల్లో నడుపుతున్నామని ప్రయాణికులు గమనించాలని సూచించారు.
News July 8, 2025
బాధితులకు సత్వర న్యాయం జరగాలి: SP అశోక్ కుమార్

జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా SP అశోక్ కుమార్ మాట్లాడుతూ బాధితులకు సత్వర న్యాయం జరగాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 11 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖ మరింత చేరువవ్వాలన్నారు.
News July 8, 2025
చర్చకు రాకుంటే కేసీఆర్కు క్షమాపణ చెప్పు: KTR

TG: సీఎం రేవంత్ స్థాయికి కేసీఆర్ అవసరం లేదని, తాము సరిపోతామని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. ‘రేవంత్.. నిజాయితీ, నిబద్ధత ఉంటే చర్చకు రా. లేకపోతే తప్పుడు కూతలు కూసినందుకు, మహా నాయకుడిపై అడ్డగోలుగా మాట్లాడినందుకు ముక్కు నేలకు రాసి KCRకు క్షమాపణలు చెప్పు. చర్చ కోసం రేవంత్ ఎక్కడికి రమ్మన్నా వస్తా. చర్చకు సత్తా లేకపోతే సవాళ్లు చేయొద్దు. సీఎంకు వాతలు పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని ఫైరయ్యారు.