News April 4, 2025
అంబాజీపేట: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

అంబాజీపేట మండలం గంగలకుర్రు ప్రాథమిక పాఠశాల వద్ద ప్రధాన రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ స్కూటీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఒకరు మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 18, 2025
నిర్మల్: పీటీఎం మీటింగ్ వాయిదా

బీసీ బంద్ నేపథ్యంలో ప్రతినెల మూడవ శనివారం నిర్వహించే పీటీఎం (పేరెంట్ టీచర్స్ మీటింగ్) రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు రద్దు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న ఓ ప్రకటనలో తెలిపారు. రద్దు విషయాన్ని ఆయా ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయాలని వారు కోరారు.
News October 18, 2025
సింహాచలం ఆలయ పైకప్పుకు కొత్త అందం

సింహాచలం వరాహ లక్ష్మీనృసింహ స్వామి దేవస్థానం ఇప్పుడు కొత్త రూపంలో మెరిసిపోతోంది. ఆలయ ప్రధాన గర్భగృహం, కళ్యాణ మండపం, వ్రత మండపం, వంటశాలకు టెర్రాకోట పెంకులతో కొత్త పైకప్పు ఏర్పాటు చేశారు. పూణేకు చెందిన లార్డ్ వేంకటేశ్వర చారిటబుల్ అండ్ రీలిజియస్ ట్రస్ట్ సుమారు రూ.5 కోట్లతో ఈ మరమ్మతులు చేపట్టింది. పాత పద్ధతిలోనే పైకప్పును పునరుద్ధరించి, శిల్పకళా అందాన్ని కాపాడుతూ ఆలయానికి నూతన శోభను చేకూర్చింది.
News October 18, 2025
MBNR: BC బంద్.. PU పరీక్షలు వాయిదా

పాలమూరు విశ్వవిద్యాలయంలో బీసీ బంద్ కారణంగా షెడ్యూల్ ప్రకారం జరగవలసిన పరీక్షలన్నీ వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు Way2Newsతో తెలిపారు. ఈ మేరకు సెమిస్టర్–IV, B-ఫార్మసీ సెమిస్టర్–II పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ కారణంగా వాయిదా వేసిన పరీక్షల తేదీలను, సమయాన్ని త్వరలో షెడ్యూల్ విడుదల చేస్తామని ప్రకటించారు.