News February 12, 2025
అంబారిపేటలో బైక్ దొంగతనం.. కేసు నమోదు

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం అంబారిపేట గ్రామంలో శనిగారపు అశోక్ అనే వ్యక్తికి చెందిన బైకును దొంగలు ఎత్తుకెళ్లినట్లు గ్రామస్థులు మంగళవారం తెలిపారు. తాను బైకును తన పంట పొలం వద్ద పార్కింగ్ చేసి వెళ్లాడని, కొద్దిసేపటికి బైక్ను దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు చెప్పారు. అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఘటనా స్థలాన్ని ఎస్ఐ నవీన్ కుమార్ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 24, 2025
Free movies, Free downloads ప్రమాదకరం: సజ్జనార్

అనుమానాస్పద లింక్స్, ఫ్రీ మూవీ సైట్స్ను క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల వలలో పడొద్దని HYD CP సజ్జనార్ హెచ్చరించారు. అలాంటి వాటిపై క్లిక్ చేస్తే అకౌంట్స్ హ్యాక్ చేసి డేటాను దొంగిలిస్తారని, తర్వాత బ్లాక్మెయిల్కు దిగుతారని పేర్కొన్నారు. ‘Free movies, Free downloads అంటూ ఉచితమనిపించే కంటెంట్ ప్రమాదకరం. ఇలాంటి ఫేక్ సైట్లు, యాప్స్ ఎప్పుడూ క్లిక్ చేయొద్దు. స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోండి’అని సూచించారు.
News November 24, 2025
దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ అనుదీప్

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. పలు మండలాల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసి అర్హులకు న్యాయం చేయాలన్నారు. ఎక్కువగా భూ సమస్యలు, పారిశుద్ధ్య, ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. జిల్లా నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో ఫిర్యాదు చేయడానికి ప్రజావాణికి బాధితులు వచ్చారు.
News November 24, 2025
అల్లూరి జిల్లాలో సెల్టవర్ కోసం గ్రామస్థుల వినతి

అల్లూరి జిల్లా హుకుంపేట మండలం అడ్డుమండ, సన్యాసమ్మపాలెం గ్రామాలకు ఫోన్ సిగ్నల్, ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో గ్రామస్థులు సెల్టవర్ ఏర్పాటుకు సంతకాల సేకరణ చేపట్టారు. దాదాపు 2,000 జనాభాలో 1,500 మంది ఫోన్ వాడుతున్న నేపథ్యంలో ఈ సేవలు అత్యవసరమని తెలిపారు. సేకరించిన దరఖాస్తును సోమవారం పాడేరు ఐటీడీఏ పీవో పూజకు సమర్పించనున్నట్లు గ్రామస్థులు వెల్లడించారు.


