News April 14, 2025
అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించాలి: ఎర్రబెల్లి

దేవరుప్పుల మండల కేంద్రంలో నూతన అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ సోమవారం జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. డాక్టర్ అంబేడ్కర్ వల్లే భారత రాజ్యాంగం సాధ్యమైందన్నారు. వారి ఆశయాలను కొనసాగించేలా చూడాలన్నారు. కొందరు దేశ రాజకీయ నేతలు అంబేడ్కర్ను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలున్నారు.
Similar News
News February 24, 2026
182 గ్రామాల్లో 7.95 లక్షల పాసు పుస్తకాల పంపిణీ: కలెక్టర్

ఏలూరు జిల్లాలో రీ-సర్వే పూర్తయిన 182 గ్రామాల్లో ఇప్పటివరకు 79,500 పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసినట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. మార్చిలో మరో 10 గ్రామాల్లో పంపిణీకి సిద్ధంగా ఉన్నామన్నారు. ఏప్రిల్ నుంచి ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, మరిన్ని గ్రామాల్లో రైతులకు పాసు పుస్తకాలు అందజేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.
News February 24, 2026
కూలెంట్ ఉన్నచోటే తేడా జరిగి ఉండొచ్చు: వీరపాండియన్

AP: పాలకల్తీ <<19216426>>ఘటనకు<<>> సంబంధించి రక్తనమూనాలు సేకరించడం సహా పలు పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్యశాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. పాలరుచిలో తేడా వచ్చిందని.. బాధితులకు తొలుత వాంతులు అయ్యాయని వివరించారు. ఒకే ప్రాంతం నుంచి రావడంతో వైద్యులకు అనుమానం వచ్చిందన్నారు. కూలెంట్ వద్దే ఏదైనా జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతాల్లో మరో నెలపాటు పరిస్థితులు పర్యవేక్షిస్తామన్నారు.
News February 24, 2026
భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల భూసేకరణను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్లో మంగళవారం జరిగిన సమీక్షలో తారకరామ తీర్థసాగర్, తోటపల్లి, జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, తదితర పనుల పురోగతిని సమీక్షించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ రహదారి, కాలువలు, ఎస్టీపీలు, ఒబేరాయ్ హోటల్కు సంబంధించిన భూసేకరణను గడువులోగా పూర్తి చేయాలన్నారు.


